Visakhapatnam

News March 24, 2024

విశాఖ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయ కళాశాల జంక్షన్ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో మధురవాడ ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ కొండల జస్వంత్ (22) మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 24, 2024

సింహాచలం సింహాద్రి అప్పన్నకు రేపు పెళ్లి చూపులు

image

సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్టింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.

News March 24, 2024

కలెక్టరు కార్యాలయంలో ఎన్నికల గ్రీవెన్స్ కేంద్రం ఏర్పాటు

image

అనకాపల్లి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికల గ్రీవెన్స్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమాండ్ కంట్రోల్ కేంద్రం నోడల్ అధికారి, మత్సశాఖ డి.డి పి.ప్రసాదు తెలిపారు. అలాగే ఇప్పటికే అందుబాటులో వున్న టోల్ ఫ్రీ నం.1950 కూడా అందుబాటులో వుంటుందని చెప్పారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి గ్రీవెన్స్ తెలియజేయడానికి 24 గంటలు అందుబాటులో వుంటుందని తెలిపారు.

News March 23, 2024

విశాఖ: 24 నుంచి ఐపీఎల్ టికెట్లు విక్రయాలు

image

విశాఖ వైఎస్సార్ స్టేడియంలో ఈనెల 31, వచ్చేనెల 3న నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్ లైన్‌లో విక్రయించనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది. 27 నుంచి పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ ఢిల్లీ క్యాపిటల్స్ వెబ్సైట్లో ద్వారా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. పీఎం పాలెం స్టేడియం బి గ్రౌండ్, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో రెడీమ్ చేసుకోవచ్చునని చెప్పింది.

News March 23, 2024

విశాఖ: పుట్టెడు దుఃఖంతో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

image

పదో తరగతి పరీక్ష రాస్తున్న దేశగిరి యమునకు పుట్టెడు దుఃఖం కలిగింది. జీకే వీధికి చెందిన యమున తల్లి సరస్వతి మృతిచెందిన సమాచారం తండ్రి కేశకర్ణ చేరవేశారు. రక్తపోటు అధికమై కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పరీక్ష రాసి స్వగ్రామం దేవరపల్లిలో తల్లి అంత్యక్రియలకు విచ్చేసిన యమున బోరున విలపించింది. దీంతో గ్రామాల్లో విషాదఛాయలు అనుముకున్నాయి.

News March 23, 2024

పాడేరుపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

2019 ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీకి సంబంధించి తక్కువగా (62 శాతం) పోలింగ్ నమోదు కావడంతో ఈ దఫా పోలింగ్ శాతం పెంపునకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. అల్లూరి జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని తెలిపారు. అన్ని ప్రధాన జంక్షన్లు, పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News March 23, 2024

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మురళీక్రిష్ణ శనివారం పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించిన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

News March 23, 2024

విశాఖ: ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్

image

నగర పరిధిలోని చినగదిలి వద్ద గల ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున శనివారం తనిఖీ చేశారు. ప్రతి మూడు మాసాలకు చేసే తనిఖీలో భాగంగా గోదాములను సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. వివిధ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాముల లోపల గల వీవీ ప్యాట్లను, ఇతర సామగ్రిని స్వయంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును గమనించిన ఆయన సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

News March 23, 2024

సికింద్రాబాద్- సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైలు

image

హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్- సంత్రాగచ్చి- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి తెలిపారు. సికింద్రాబాద్- సంత్రాగచ్చి (07645) ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 9.35కు దువ్వాడ చేరుకొని ఇక్కడి నుంచి 9.40కు బయలుదేరి వెళుతుందన్నారు.

News March 23, 2024

విశాఖ: పెళ్లి కారు బోల్తా పడిన ఘటనలో బాలుడి మృతి

image

ఇటీవల శొంట్యాంలో పెళ్లి కారు <<12894599>>బోల్తా పడిన విషయం<<>> తెలిసిందే ఈ ఘటనలో గాయాలైన ఓ బాలుడు ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆనందపురం ఎస్సై శివ వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు చిన్నారులలో తీవ్రంగా గాయపడిన కౌశిక్ (4) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం బంధువులకు అప్పజెప్పినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు పూర్తి సమాచారం కోసం కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.