Visakhapatnam

News March 23, 2024

కసింకోట: ఏలేరు కాలువలో పడి యువకుడి మృతి

image

తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట సమీపంలోని ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై దొర తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన బుద్ధన పవన్ కుమార్ (19) పెంపుడు కుక్క, స్నేహితుడితో కలిసి ఏలేరు కాలువ గట్టు వైపు వెళ్తుండగా కుక్క పరిగెత్తడంతో దాన్ని పట్టుకునే క్రమంలో నీటిలో పడిపోయాడు. స్థానికులు నీటిలో దూకి బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపారు.

News March 23, 2024

విశాఖ: నేడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన

image

మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు శనివారం విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 11.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సాగర్‌ నగర్‌లోని నివాసానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5గంటలకు నోవాటెల్ హోటల్‌కి వెళ్లి అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు. 24న తిరుగు ప్రయాణం కానున్నారు.

News March 23, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

విశాఖ జీవీఎంసీ 6వ వార్డ్ పీఎం పాలెం గాయత్రి నగర్‌లో చిల్ల సంతోష్ (27) అనే వ్యక్తి శుక్రవారం కరెంట్ షాక్‌కి గురై మృతి చెందాడు. గాయత్రి నగర్‌లోని ఓ భవనంలో ప్లంబింగ్ పని చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగిందని, స్థానికుల సమాచారం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా జామి మండలం చిల్లపాలెంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 23, 2024

విశాఖ: ‘సీఎం, మంత్రుల ఫోటోలు ఉండకూడదు’

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయాలని జిల్లా ఎన్నికల అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆర్.ఓలను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి జారీ చేయబడే విద్యుత్, తాగునీరు, ఇతర బిల్లులపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ ప్రతినిధుల ఫొటోలు గాని, వారి సందేశాలు గాని ఉండకూడదని స్పష్టం చేశారు.

News March 22, 2024

విశాఖ: లోకేశ్‌తో భేటీ అయిన గండి బాబ్జి

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ గండి బాబ్జి భేటీ అయ్యారు. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని బాబ్జికి లోకేశ్‌ హామీ ఇచ్చారు. దీంతో పార్టీకి చేసిన రాజీనామాను బాబ్జి వెనక్కి తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానన్నారు.

News March 22, 2024

చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు: జిల్లా 

image

అనకాపల్లి జిల్లాలోని 9 చెక్ పోస్టుల వద్ద పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ రవి పట్టం శెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణం నుంచి గ్రామాల వరకు ఎక్కడ ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. నియమావళి అమలు, పరిశీలన పట్ల అధికారులు నిశితంగా గమనించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి పాల్గొన్నారు.

News March 22, 2024

విశాఖ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి గురువారం అర్ధరాత్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ఆర్.ఎస్.నాయుడు బాబు విశాఖ పోర్ట్ అథారిటీలో దినసరి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. జీతం సరిపోక కుటుంబ పోషణ కష్టమవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. చేసిన అప్పులు తీర్చమని ఒత్తిళ్లు పెరగడంతో గురువారం అర్ధరాత్రి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 22, 2024

ఈ సారి విశాఖ ఎంపీగా నెగ్గేదెవరు?

image

టీడీపీ మూడో జాబితాలో 13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా భరత్ మరోసారి బరిలో దిగుతున్నారు. అటు వైసీపీ బొత్స ఝాన్సీ పోటీచేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో భరత్ ప్రచారం చేస్తుండగా, అధికారిక ప్రకటనతో మరింత ఊపందుకోనుంది. ఈ సారి విశాఖలో ఎవరు నెగ్గుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

చింతపల్లి: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపుకు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2024

కంచరపాలెం: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బాపూజీ నగర్‌లో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బోర సుధాకర్ రెడ్డి (40) తన అన్న సురేశ్ రెడ్డితో కలిసి నివసిస్తున్నాడు. తనకి వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై అందరితోనూ గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం తను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.