India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మలేషియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిస్సెస్ ఇండియా-2024 విజేతగా విశాఖకు చెందిన హేమలతా రెడ్డి నిలిచారు. 300 మంది పాల్గొన్న ఈ పోటీల్లో విజేతగా నిలిచి విశాఖ ఖ్యాతిని పెంచారు. ఆమె ఇంతకముందు యాంకర్గా పనిచేశారు. త్వరలో పారిస్ ఫ్యాషన్ వీక్కి కూడా వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హేమలతా రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, పలువురు పాత్రికేయులు సత్కరించారు.
అప్పుగా ఇచ్చిన రూ.100 కోసం ఓ వ్యక్తిపై పదునైన బ్లేడ్తో దాడి చేశాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తలిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నూకిరెడ్డి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన బంగారి వెంకటరమణకు రూ.100 అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత రామాలయం వద్ద కూర్చున్న శ్రీనివాస్పై వెంకటరమణ బ్లేడ్తో దాడి చేశాడు.
టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 కాగా, రైతు బజార్లలో రూ.66కి విక్రయిస్తున్నారు. రాయితీపై టమాటాను విక్రయించాలని విశాఖ నగర ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వారం రోజుల కిందట కిలో టమాటా ధర రూ.66 ఉండగా అదనంగా రూ.22 పెరిగింది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు టమాటా జోలికి వెళ్లటం లేదు. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో పోలీస్ అధికారులు పనిచేయాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. విశాఖలో గురువారం న్యూఢిల్లీకి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో 50 మంది పోలీస్ అధికారులకు డ్రగ్స్ నియంత్రణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ మాటాడుతూ యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
* మాడుగుల నియోజకవర్గంలో 80 అడుగుల రోడ్డు.!
* ముంచింగిపుట్టులో గంజాయితో పట్టుబడ్డ మహిళలు
* ఏయూలో డిప్లొమో కోర్సులకు నోటిఫికేషన్
* విశాఖ పోర్టు.. సరికొత్త రికార్డు
* విశాఖ: ఇన్ స్టా గ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తి అరెస్ట్
* డొంకరాయి జలాశయం వద్ద మొసలి హల్ చల్
* బుచ్చియ్యపేట: ఆవుల అక్రమ తరలింపు అడ్డగింత
* సీఎంతో భేటీ అయిన భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్
* అల్లూరి జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక
విశాఖలో గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 3931 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 3439 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మొత్తం 492 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. నగరంలో ఉదయం 5 కేంద్రాల్లోనూ మధ్యాహ్నం మూడు కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుచ్చిరాజుపాలెం సెంటర్ను సందర్శించినట్లు తెలిపారు.
ఏయూలో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డి.ఏ నాయుడు ప్రకటనలో తెలిపారు. ఏడాది కాల వ్యవధిలో నటన, దర్శకత్వం, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, తాళ వాయిద్యం కోర్సుల్లో, ఆరు నెలలకు యోగా, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, ఫొటోగ్రఫీ, స్పానిష్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 21లోగా దరఖాస్తు చేయాలి, 23న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. >Share it
దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.
ఏపీలో చెన్నై-కోల్ కతా నగరాలను కలిపే జాతీయ రహదారి నాలుగు వరుసలుగా ఉండేది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆరు వరుసలుగా ఇటీవల దానిని అభివృద్ధి చేశారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జిల్లా కేంద్రం అనకాపల్లిని ఆనుకుని ఇలా తీర్చిదిద్దారు. పాము మెలికలు కనిపించే ఈ డబుల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ కూడలి రాష్ట్రంలో ఇదే మొదటిది కావటం విశేషం.
స్వచ్ఛత హీ కార్యక్రమంలో విశాఖకు రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానం దక్కింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అవార్డును అందుకున్నారు. గత నెల 17 నుంచి నేటి వరకు నాలుగు రకాలుగా స్వచ్ఛత హీ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యంతో విజయవంతమయ్యారని సీఎం కొనియాడారు. అవార్డు రావడంతో అధికారులు ఆనందం వ్యక్తంచేశారు.
Sorry, no posts matched your criteria.