Visakhapatnam

News November 21, 2024

విశాఖ: పోస్టర్స్ ఆవిష్కరించిన కలెక్టర్

image

వచ్చేనెల ఏడవ తేదీన నిర్వహించే సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా పరిష్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్టిక్కర్స్, కారు ఫ్లాగ్స్, పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించి దేశ రక్షణ కోసం సాయుధ దళాలు చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకుంటామన్నారు.

News November 20, 2024

విశాఖ: స్టేడియం అభివృద్ధి ప‌నుల‌ ప‌రిశీలన-కలెక్టర్

image

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ఇందిరా ప్రియ‌ద‌ర్శిని మున్సిప‌ల్ స్టేడియంలో మ‌రిన్ని మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గ‌త కొంతకాలంగా సుమారు రూ.7 కోట్ల వ్యయంతో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను బుధ‌వారం ఆయ‌న ప‌రిశీలించారు. జీవీఎంసీ అధికారుల‌తో క‌లిసి స్టేడియంను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు.

News November 20, 2024

వరాహ పుష్కరిణి వద్ద పోలిపాడ్యమికి ఏర్పాట్లు 

image

డిసెంబర్ 2న జరిగే పోలిపాడ్యమికి సింహాచలం వరాహ పుష్కరిణి వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం ఈవో త్రినాథరావు తెలిపారు. వరాహ పుష్కరిణిలో దీపాలు వదిలేందుకు మహిళలు ఎక్కువగా రానున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పుష్కరిణి వద్ద బారికేడింగ్ ఏర్పాట్లు చేశారు. పుష్కరిణికి మార్గంలో పోలీసులతోను బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తోలిపావంచ వద్ద ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేస్తామన్నారు.

News November 20, 2024

అవకతవకల వల్లే విశాఖ డెయిరీకి నష్టాలు: పల్లా

image

సుమారు రూ. 2000 కోట్ల టర్నోవర్ కలిగిన విశాఖ డెయిరీలో జరుగుతున్న అవకతవకల వల్లే డెయిరీకి నష్టాలు వస్తున్నాయని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సొసైటీగా ఉన్న డెయిరీని కంపెనీగా మార్పు చేసినప్పటి నుంచి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. డెయిరీకి అనుబంధంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి ‌ రైతుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు మళ్లిస్తున్నారని అన్నారు.

News November 20, 2024

మీరు మారిపోయారు సార్..!

image

10సార్లు MLAగా.. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుని 40 ఏళ్ల రాజకీయ అనుభవం స్పీకర్ పాత్రలో అసెంబ్లీలో కనిపిస్తోంది. నాడు తనదైన మాటశైలితో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ ఆయన.. నేడు ప్రశ్నోత్తరాల సమయంలో, జీరో అవర్‌లో మంత్రులు, MLAలకు సూచనలిస్తున్నారు. కొత్త MLAలకు బడ్జెట్‌పై తరగతులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. దీంతో ‘మీరు మారిపోయారు సార్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News November 20, 2024

విశాఖ: లంచ్ బాక్సులో గంజాయి.. ఉద్యోగి అరెస్టు

image

విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీకి గంజాయి సప్లై చేస్తున్న జైలు హాస్పిటల్ ఫార్మసిస్టు కడియం శ్రీనివాసరావును ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. శ్రీనివాసరావుతో రిమాండ్ ఖైదీ గుర్రాల సాయి పరిచయం ఏర్పాటు చేసుకుని.. ఇంటి నుంచి వచ్చేటప్పుడు తన సోదరుడు గంజాయి ఇస్తాడని, దాన్ని తీసుకొస్తే డబ్బులిస్తానని ఆశ చూపాడు. లంచ్ బాక్సులో 95 గ్రాముల గంజాయిని ఉండలుగా చుట్టి తీసుకురాగా పోలీసులు అరెస్టు చేశారు.

News November 19, 2024

విశాఖ అత్యాచార ఘటనపై హోంమంత్రి స్పందన

image

విశాఖ లా స్టూడెంట్ <<14651987>>అత్యాచార ఘటనపై<<>> హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని హోంమంత్రి అన్నారు.

News November 19, 2024

విశాఖలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

image

విశాఖలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. లా విద్యార్థినిని ప్రేమ పేరుతో ఓ యువకుడు వంచించి తన స్నేహితులతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో విశాఖ టూ టౌన్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అత్యాచారానికి గురైన విద్యార్థిని మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 

News November 19, 2024

రుషికొండ భవనాలపై మీ కామెంట్?

image

వైసీపీ హయాంలో నిర్మించిన రుషికొండ భవనాలపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. కోట్ల ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ విలాసాలకు భవనం నిర్మించుకున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అవసరాలకు కోసం వాటిని నిర్మించామని వైసీపీ నాయకులు ఆ ఆరోపణలకు తిప్పికొడుతున్నారు. అయితే ఆ భవనాలను రాష్ట్ర ఆదాయ వనరులుగా మలచాలని పలువురు సూచిస్తున్నారు. మరి భవనాలు దేనికి వినియోగిస్తే బాగుంటుందో కామెంట్ చెయ్యండి.

News November 19, 2024

అనకాపల్లి: ‘మండల స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం చూపాలి’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మండల స్థాయిలో నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను జిల్లా స్థాయికి తీసుకురావద్దన్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.