India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలో నేటి నుంచి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని డిఎంహెచ్ఓ జగదీశ్ అన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో కాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంపై వైద్య సిబ్బందితో అవగాహనా శిబిరం నిర్వహించారు.18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పరీక్షలు చేసి అవసరమగు వారికీ వైద్యం అందిస్తారని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించికోవాలన్నారు.

రాష్ట్ర గవర కార్పొరేషన్కు ప్రభుత్వం 15 మంది డైరెక్టర్లను నియమించింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినవారు 11 మంది ఉన్నారు. పరమేశ్వరరావు(పెందుర్తి),పి.అజయ్ బాబు (విశాఖ),ఏ.మంగరాజు (నర్సీపట్నం), బి.శ్రీనివాసరావు (ఎలమంచిలి),బీ.గోపికృష్ణ (విశాఖ), బి.లక్ష్మీనారాయణ (విశాఖ),బి.నాగ గంగాధర్ (చోడవరం), పి.శ్రీనివాసరావు (విశాఖ) ఎం.రవికుమార్ (విశాఖ), బి.శ్రీనివాసరావు(అనకాపల్లి ),వి.హరికృష్ణ (అనకాపల్లి) ఉన్నారు.

విశాఖ జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరికతో పాటు సూచనలు తెలియజేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, కులమతాల విద్వేషాలను, ఉద్దేశపూర్వకంగా వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నకిలీ ఖాతాలతో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే డయల్ 112కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యాలని కమిషనర్ తెలిపారు.

రాజమహేంద్రవరం-అనకాపల్లి జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. జాతీయ రహదారి-16 పరిధిలోని అనకాపల్లి- అన్నవరం-దివాన్ చెరువు సెక్షన్లలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరించడానికి డీపీఆర్లను కేంద్రం సంబంధిత కన్సల్టెంట్కు అందజేసినట్లు పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం మాడుగుల మోదకొండమ్మవారిని సినీ నటి మీనాక్షి చౌదరి బుధవారం దర్శించుకున్నారు. గత వారం రోజులుగా అరకులోయలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తాం’ సినిమా షూటింగ్ అరకు లోయలో జరిగింది. అరకులో చిత్రీకరణ ముగియడంతో తిరుగుపయమయ్యారు. మార్గ మధ్యలో ఉన్న మాడుగుల అమ్మవారిని దర్శించుకున్నారు.

పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీసు అవతారమెత్తిన వంతల సంతోష్(32)ని స్థానిక క్రైమ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైవేపై వంతెన వద్ద పోలీస్ యూనిఫామ్ ధరించి ఫోన్ అమ్మేందుకు యత్నింస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా.. పాడేరుకు చెందిన సంతోఫ్పై ఇదివరకే ఆరిలోవ స్టేషన్లో 2 కేసులు ఉన్నట్లు తెలిపారు.

విశాఖ మెట్రోపై ఉమ్మడి జిల్లా MLAలు అసెంబ్లీలో మాట్లాడారు. విశాఖలో జనాభా పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని మెట్రో పూర్తయితేనే ఈ కష్టాలు తీరుతాయని గాజువాక MLA పల్లా పేర్కొన్నారు. అనకాపల్లి వరకు మెట్రో ప్లాన్ పొడిగించాల్సని అవసరం ఉందని MLA కొణతాల కోరారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతున్న క్రమంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా మెట్రో పూర్తిచేయాలని MLA గణబాబు అన్నారు.

విశాఖలో డ్రగ్స్ కంటైనర్ను CBI సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై MLC బొత్స కేంద్ర హోంమంత్రికి మంగళవారం లేఖ రాశారు. ‘సంధ్యా ఆక్వా సంస్థ పేరు మీద బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ను CBI సీజ్ చేసింది. ఆక్వా యాజమాన్యానికి పురందీశ్వరికి సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. దర్యాప్తు వివరాలు బహిర్గతం కాలేదు. వాస్తవాలను పబ్లిక్ డొమైన్లో వెల్లడించాలని CBIకి ఆదేశాలు జారీ చేయండి’ అని పేర్కొన్నారు.

నగరంలో యారాడ లైట్ హౌస్ ఇండియన్ నేవీ నివాసితులు ఉండే ప్రదేశంలో మంగళవారం సాయంత్రం పాము ప్రత్యక్షం అయ్యింది. విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన నేవీ అధికారి గ్యారేజీలో కారును పార్కింగ్ చేసేందుకు వెళ్లి చూడగా అక్కడ పాము మెరుస్తూ కనిపించిందని తెలిపారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నారు.

శాసనసభ విప్గా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబును ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో విప్గా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గణబాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. 2017 నుంచి 2019 వరకు విప్గా పనిచేశారు. వేపాడ చిరంజీవి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.