Visakhapatnam

News September 24, 2024

ఈపీడీసీఎల్ అధికారులతో MP శ్రీభరత్ సమీక్ష

image

ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజనలో మరింత మంది లబ్ధిదారులను చేర్చాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ సూచించారు. సోమవారం ఆయన ఈపీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరితగతిన అండర్ గ్రౌండ్ సిస్టం పనులను పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

News September 23, 2024

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు

image

సింహాచలం సింహాద్రి అప్పన్నను సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయంలో సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

News September 23, 2024

ఏయూ: ఫార్మసీ పరీక్ష కేంద్రాలకు జంబ్లింగ్ విధానం

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీ.ఫార్మసీ రెండవ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్ సప్లమెంటరీ, మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం తెలిపారు. కళాశాల వారీగా జంబ్లింగ్ చేసి నూతన పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు వెల్లడించారు. వివరాలకు ఏయూ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

News September 23, 2024

అరకులోయలో నెత్తుటి చారికకు ఆరేళ్లు..!

image

23/9/2018 మన్యం ప్రజలు మరిచిపోలేని రోజు. అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమును మవోయిస్టులు అతి కిరాతంగా చంపిన రోజు. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ఇద్దరు నేతలను మావోయిస్టులు హతమార్చి నేటికి ఆరేళ్లు గడుస్తోంది. అనంతరం కిడారి కుమారుడు శ్రవణ్ కుమార్ మంత్రిగా పనిచేయగా.. సివేరి కుమారుడు అబ్రహం గత ఎన్నికల్లో TDP తరఫున రెబల్ అభ్యర్థిగా బరిలో దిగి సస్పెన్షన్‌కు గురయ్యారు.

News September 23, 2024

సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి

image

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం స్టోర్‌లో ఈనెల 21న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సీజ్ చేశారు. ప్రస్తుతం రోజుకు 25 వేల నుంచి 30 వేల లడ్డూలు విక్రయిస్తారు. సోమవారం వంద డబ్బాల విశాఖ డెయిరీ నెయ్యి(1500 కేజీలు) దేవస్థానానికి రానుంది.

News September 23, 2024

ఉమ్మడి విశాఖలో 16 మంది తహశీల్దార్లు బదిలీ

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 16 మంది తహశీల్దార్లను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బదిలీ చేశారు. వీరిలో 8 మందిని విశాఖ జిల్లాకు, ఐదుగురిని అనకాపల్లి జిల్లాకు, ముగ్గురిని అల్లూరి జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో ఎంబీ అప్పారావు, పీ.లచ్చాపాత్రుడు, ఎస్.రాణి అమ్మాజీ, కే.జానకమ్మ, ఎస్.రామారావు, ఏ.శ్రీనివాసరావు, కే.రమాదేవి, ఎస్.నాగమ్మ, వేణుగోపాల్, శ్యామ్ కుమార్, కే.జయ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

News September 23, 2024

అరకులోయలో కొంతమేర తగ్గిన పర్యాటకుల సందడి

image

పర్యాటక ప్రాంతమైన అరకులోయ గిరిజన మ్యూజియంను సందర్శించిన పర్యాటకుల సంఖ్య కొంతమేర తగ్గింది. శనివారం సాయంత్రం వర్షం పడటం, అల్పపీడనం వలన భారీ వర్షాలు పడతాయన్న ఐఎండి సూచన మేరకు అరకులోయ వచ్చిన పర్యాటకులు శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం ఇంటిముఖం పట్టారని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. శని, ఆదివారాలలో మ్యూజియంను సుమారు 1100 మంది పర్యాటకులు సందర్శించారన్నారు.

News September 22, 2024

చిరంజీవికి ఎంపీ సీఎం రమేశ్ అభినందనలు

image

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అభినందనలు తెలిపారు. చిరంజీవికి దక్కిన విశిష్ట గౌరవం మన తెలుగువారి గుర్తింపు పెంచిందన్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో ప్రేక్షకులను అలరించినందుకు చిరంజీవికి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కిందన్నారు. ఇది తెలుగు వారికి గర్వకారణం అన్నారు.

News September 22, 2024

గిన్నిస్ రికార్డు సాధించిన విశాఖ మహిళలు

image

అతి తక్కువ సమయంలో మహిళలు ధరించే 58,112 క్రోంచెట్ స్క్వెర్స్ నూలు వస్త్రంను తయారు చేసి విశాఖ మహిళలు గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. వెంకోజీపాలెంలోని ఆదివారం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ వస్త్రాన్ని ప్రదర్శించారు. వాటిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లండన్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి రికార్డును ధ్రువీకరించారు.

News September 22, 2024

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యం: పల్లా

image

గత ప్రభుత్వంలో దగా పడిన ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక నియోజకవర్గం 69, 70, 71 వ వార్డుల్లో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు.