India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో ఈ నెల 29న ప్రైవేట్ ఐటిఐల్లో మిగులు సీట్ల భర్తీకి మూడవ విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 26లోగా ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు ప్రింట్, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు కౌన్సిలింగ్ కు హాజరుకావాలని కోరారు.
నక్కపల్లి హైవేపై ఒక ట్రయిలర్ లారీపై వెళ్తున్న విమానాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్య పోయారు. కోల్కతా నుంచి చెన్నైకు పొడవటి ట్రయిలర్ లారీపై పాత విమానాన్ని తీసుకువెళ్తుండగా, హైవేపై ప్రయాణించేవారు ఎంతో ఆసక్తిగా తిలకించారు. వినియోగంలో లేని ఈ పాత విమానానికి మరిన్ని హంగులు దిద్ది, ఒక హోటల్గా తయారు చేస్తారని ఇందులో సంబంధిత వ్యక్తి చెప్పారు. కోల్ కతా ఎయిర్పోర్ట్ నుంచి దీనిని తీసుకొస్తున్నారు.
విజయవాడ నుంచి విశాఖ వస్తున్న రైలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతుండగా మేలుకొని కేకలు వేసింది. ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు నిందితుడిని పట్టుకుని బుధవారం ఉదయం విశాఖలో రైల్వే పోలీసులకు అప్పగించారు. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయికుమార్ డిమాండ్ చేశారు.
చెన్నై సెంట్రల్-బేసిన్ బ్రిడ్జి స్టేషన్ల మధ్య వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే బొకారో ఎక్స్ప్రెస్ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. అలప్పుజ-ధన్ బాద్ బొకారో ఎక్స్ప్రెస్ను ఈనెల 8,10,13, 15,17, 20,22, 24,27,29తేదీల్లో రెగ్యులర్ మార్గంలో కాకుండా వయా పొదనూర్,ఇరుగూర్, సూరత్కల్ స్టేషన్ల మీదుగా నడుస్తుందన్నారు. పొదనూర్లో హాల్ట్ కల్పించామన్నారు.
ఎన్నడూ లేనివిధంగా విశాఖ ప్రజలు ఈసారి ఒలింపిక్స్ క్రీడల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పారిస్లో జరుగుతున్న పోటీల్లో విశాఖకు చెందిన పరుగుల రాణి జ్యోతి యర్రాజీ భారీ అంచనాలతో బరిలోకి దిగుతుండటమే దీనికి కారణం. నేడు అథ్లెటిక్స్ విభాగానికి సంబంధించి 100 మీటర్ల హార్డిల్స్ తొలి రౌండ్ జరగనుంది. పోటీలో జ్యోతి చిరుతలా మెరుగైన ప్రదర్శన కనబరచి పసిడి పతకాన్ని సాధించాలని విశాఖ జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
విశాఖ పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై ఆర్మీ, జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాటాడుతూ.. రాష్ట్రంలో 13 జిలాలకు చెందిన 8వేల మంది యువత ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఏయూ అంబేడ్కర్ ఛైర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ఆన్లైన్ క్విజ్ 12న, రాత పరీక్ష 13న, ఫైనల్ పోటీలు 14న నిర్వహిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, 2వ బహుమతిగా రూ.10వేలు, 3వ బహుమతిగా రూ.5వేల నగదుతో పాటు ట్రోఫీ ఇస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోగా 97000 66832 నంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం విస్తృతంగా సర్వే నిర్వహించింది. ఢిల్లీ నుంచి వచ్చిన జియోలాజికల్ సర్వే బృందం స్థానిక ఎస్ఈ చంద్రశేఖరరెడ్డితో కలిసి తొమ్మిది ప్రాంతాలను సందర్శించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యాప్కోస్ సంస్థ తయారు చేసిన డీపీఆర్ ఆధారంగా పరిశీలన చేసింది. జీఎస్ఐ సభ్యులకు ప్రాజెక్టు గురించి ఎస్ఈ చంద్రశేఖరరెడ్డి వివరించారు
విశాఖ వైసీపీ నాయకులతో ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. విశాఖలో జరిగిన భేటీలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 10 స్థాయి సంఘాలను వైసీపీ కైవసం చేసుకునే విధంగా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 30న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశమై మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ కోడ్) పటిష్టంగా అమలు చేయాలన్నారు. చెక్ పోస్టులను పెట్టి తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.
Sorry, no posts matched your criteria.