India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెన్నేటి విశ్వనాథం విశాఖ జిల్లా అభివృద్ధిలో తనదైన మార్క్ చూపించారు. 1937లో మొదటిసారి మద్రాసు శాసనసభకు ఎన్నికైన ఆయన.. విశాఖ-1 MLAగా, విశాఖ MPగా గెలుపొందారు. అరకులో కాఫీ మొక్కల పెంపకం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన గుర్తుగా విశాఖలో 2కాంస్య విగ్రహాలు, GVMC, పెద్దేరు రిజర్వాయర్కు ఆయన పేరు పెట్టారు. విశాఖలో తెన్నేటి పార్క్ అంటే తెలియనివారుండరు.
NOTE: నేడు ఆయన వర్థంతి

విశాఖలో తొలి స్కై స్క్రాపర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బీచ్ రోడ్డులో ఐకానిక్ తాజ్ గేజ్ వే హోటల్ స్థానంలో వరుణ్ గ్రూప్ దీన్ని నిర్మించనుంది. రూ.600 కోట్లతో 24 ఫ్లోర్లలో ఆఫీస్ స్పేస్, హోటల్, స్టూడియో నిర్మిస్తారు. రూ.120 కోట్లతో తాజ్ గేట్ వే హోటల్ను 2018లో ఓరియెంటల్ హోటల్స్ లిమిటెడ్ నుంచి వరుణ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈనెల 14 నుంచి గేట్ వే హోటల్ కూల్చివేత పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజా స్పందన వస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సూపర్-6 హామీల్లో ఒకటిగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి 5,17,383 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.41.17 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం జమ చేసినట్లు వివరించారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో పలువురికి నామినేటెడ్ పదవులు వరించాయి. రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్గా ఎం.సురేంద్ర, కొప్పల వెలమ ఛైర్మన్గా PVG కుమార్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నాగేశ్వరరావు, AP కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్గా జి.బాబ్జి, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఛైర్మన్గా S.సుధాకర్, GCC ఛైర్మన్గా K. శ్రావణ్ కుమార్ VMRDA ఛైర్మన్గా ప్రణవ్ గోపాల్ నియమితులయ్యారు.

రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ గా అనకాపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మళ్ల సురేంద్రను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. శనివారం కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేట్ పదవుల జాబితాలో సురేంద్రకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ.. తన పై నమ్మకంతో అవకాశం కల్పించిన చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గండి బాబ్జిని ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బాబ్జికి ఎన్నికల ముందే టీడీపీ అధిష్ఠానం వర్గం న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు నామినేటెడ్ పదవిలో నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావును ఏపీ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ప్రగడను పొత్తుల్లో భాగంగా చివరి నిమిషంలో తప్పించారు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా జనసేన గెలుపుకు ప్రగడ సహకరించారు.

అక్కయ్యపాలేనికి చెందిన బాలిక కీర్తి హాఫ్ శారీ ఫంక్షన్ ఈ నెలలో జరగనుంది. దీంతో ఆ బాలిక ఇన్విటేషన్ను ‘x’లో మంత్రి నారా లోకేశ్కు ట్యాగ్ చేస్తూ అంకుల్ నా ఫంక్షన్కు మీరు తప్పకుండా రావాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కి లోకేశ్ స్పందిస్తూ.. ఇన్విటేషన్ పంపినందుకు థాంక్యూ చిట్టితల్లి. నేను ఆరోజు రాలేను గానీ తప్పకుండా నీతో ఫోన్లో మాట్లాడతా. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయమ్మ అంటూ రీ ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానం సంబంధించి డిపోల ద్వారా ఇసుక సరఫరా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ శుక్రవారం ఇచ్చారు. విశాఖ కలెక్టర్ ఆదేశాలు మేరకు జీవో విడుదల చేశారు. ఆసక్తి కలవారు భీమిలీ, ముడసర్లోవ, గాజువాకలో 4 ఏకరాల స్థలం కలిగి ఉండాలని అన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 14వ తేదీలోపు రూ.5,000 డీడీ గనుల శాఖ కార్యాలయంలో చెల్లించాలన్నారు.

అనకాపల్లి జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలు పూర్తి చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Sorry, no posts matched your criteria.