Visakhapatnam

News August 6, 2024

విశాఖ: రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో కోర్బా రైలులో జరిగిన అగ్ని ప్రమాదంపై తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం విశాఖ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బృందంలో నిపుణులు రైల్వే స్టేషన్‌తో పాటు అగ్నిప్రమాదంలో దగ్దమైన బీ7 భోగి, పాక్షికంగా కాలిన బీ6 భోగిని పరిశీలించారు. దర్యాప్తులో పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్న బృందం అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతుంది.

News August 6, 2024

విశాఖలో గర్భం దాల్చిన బీ.టెక్ విద్యార్థిని

image

విశాఖలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన కలకలం రేపింది. విద్యార్థిని గ్రామానికి చెందిన ఓ యువకుడు నగరంలో బీ.టెక్ చదువుతున్నాడు. వీరిద్దరూ చనువుగా ఉండేవారు. ఈ క్రమంలో విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. గర్భంలో మృత శిశువును వైద్యులు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి మృతశిశువును బయటకు తీశారు.

News August 6, 2024

బ్యాలెట్ పద్ధతిలో విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తరువాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు.

News August 6, 2024

విశాఖ: ఓటర్లుగా చేరేందుకు మరో ముగ్గురు దరఖాస్తు

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు కల్పించాలని మరో ముగ్గురు దరఖాస్తు చేశారు. జీవీఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నందున తమకు ఓటు హక్కు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు గొల్ల బాబురావు, నిరంజన్ రెడ్డి అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. వీరి దరఖాస్తులను అధికారులు పరిశీలించి ఓటు హక్కు కల్పించే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

News August 6, 2024

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఓటర్ల వివరాలు ఇలా..

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 838 మంది ఓటర్లు జాబితాను విడుద చేసిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీలు 636 మంది, జడ్పీటీసీలు 36 మంది, కార్పొరేటర్లు 97 మంది, కౌన్సిలర్లు 53 మంది, ఎక్స్ ఆఫీషియో సభ్యులు 16 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రిటర్నింగ్ అధికారి కె.మయూర్ అశోక్ తెలిపారు.

News August 6, 2024

విశాఖ: 838 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 838 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు రిటర్నింగ్ అధికారి కే.మయూర్ అశోక్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థిని పదిమంది ఓటర్లు బలపర్చాల్సి ఉంటుందన్నారు.

News August 6, 2024

బొర్రా గుహలను కాపాడాలని  వినతి

image

బొర్రా గుహలను కాపాడాలంటూ అరకు ఎంపీ డా.గుమ్మా తనూజ రాణి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆఫీసులో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. బొర్రాగుహలపై నుంచి వేసే రెండో రైల్వే లైన్ ఎలైన్మెంట్ 40మీటర్లు జరపాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే బొర్రా గుహలకు పెను ప్రమాదం ఉందని, గుహలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

News August 6, 2024

విశాఖ: ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల అవుతుందని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఉప ఎన్నికకు సంబంధించి విశాఖ కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్‌కు ఓటు హక్కు ఉంటుందన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుందన్నారు.

News August 5, 2024

విశాఖ: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా?

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరఫున అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వగృహంలో అభ్యర్థి ఎంపికపై నిర్వహించిన సమావేశంలో పీలాను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News August 5, 2024

కంచరపాలెం: అదృశ్యమైన యువకుడి మృతి

image

అదృశ్యమైన యువకుడు చనిపోయిన ఘటన డుంబ్రిగుడ మండలంలో వెలుగు చూసింది. విశాఖ కంచరపాలేనికి చెందిన చంద్రకాంత్(17) గత నెల 30న అరకులో అదృశ్యమైనట్లు పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తుండగా డుంబ్రిగుడ మండలం జాంగుడ సమీపంలోని పొలం గడ్డ వాగులో మృతదేహం దొరికిందని సీఐ రుద్రశేఖర్ వెల్లడించారు. కాళ్లు చేతులు కట్టి ఉండటంతో పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని తెలుస్తోంది.