India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సీహెచ్.వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలలో మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు ముగింపు రోజున బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే గ్రంథాలయాల్లో కవి సమ్మేళనాలు జరుగుతాయన్నారు.

అల్లూరి జిల్లా ప్రముఖ పర్యటక కేంద్రం కొత్తపల్లి జలపాతాన్ని బుధవారం పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ సందర్శించారు. ఇటీవల లైట్ల వెలుతురులో తీర్చిదిద్దుతున్న వాటర్ ఫాల్స్ అందాలు రాత్రి వేళలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి ప్రమాదకరమైన పరిస్థితులు, ఇతర అవసరాలపై అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులకు రాత్రి వేళలో కూడా కొత్తపల్లి జలపాతం సందర్శనకు అందుబాటులో ఉండనుంది.

డిజిటల్ ఇండియాలో భాగంగా వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో గల అన్ని స్టేషన్లలోనూ ఆన్లైన్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ ఉపయోగించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. పాసింజర్ రిజర్వేషన్ సిస్టం & అన్రిజర్వ్ టికెటింగ్ సిస్టమ్కు సంబంధించి క్యూఆర్ కోడ్ టికెటింగ్ను అమల్లోకి తీసుకొచ్చినట్లు బుధవారం తెలిపారు. అవాంతరాలు లేని డిజిటల్ లావాదేవీల కోసం ఈ సౌకర్యాన్ని రైల్వే ప్రయాణికులు వినియోగించుకోవాలన్నారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలని, విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్తో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత లక్ష్యాల మేరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. చీడికాడ మండలం పెదగోగాడలో మాజీ మంత్రి అంతిమయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రం నలుమూలల నుంచి అనేకమంది ప్రముఖులు, ప్రజలు తరలివచ్చి తమ నాయకుడికి నివాళులర్పిస్తున్నారు.

ప్రకృతి వైపరీత్యాల నివారణ ప్రణాళిక అమలులో అత్యుత్తమ పనితీరు కనపర్చినందుకు విశాఖ పోర్ట్ ట్రస్ట్ అథారిటీకి మంచి గుర్తింపు లభించింది. ఢిల్లీలో కోస్టుగార్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో జాతీయ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కాంటిన్ జెన్సీ సమావేశంలో సముద్రి పర్యావరణ సురక్ష ట్రోఫీని అందజేశారు. ఈ విషయాన్ని విశాఖ పోర్టు కార్యదర్శి టి.వేణుగోపాల్ తెలిపారు.

నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేసి రాష్ట్ర మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అప్రతిష్ఠ పాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను దువ్వాడ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విశాఖ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎస్.రతన్ కాంత్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. 88వ వార్డు యాదవ జగ్గరాజుపేటకు చెందిన బి.వెంకటేశ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రన్న దోపిడి పథకాలను అమలు చేస్తున్నట్లు వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా విమర్శించారు. చంద్రన్న ఇసుక దోపిడి పథకం, చంద్రన్న మద్యం దోపిడి, చంద్రన్న విద్యుత్ దోపిడి, చంద్రన్న పింఛన్ల కోత పథకం, చంద్రన్న దీపం అర్హుల కోత పథకం, చంద్రన్న డూపర్ సిక్స్ పథకం, చంద్రన్న ఖనిజ దోపిడీ పథకాలను అమలు చేస్తుందని ధ్వజమెత్తారు.

AU లో బీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలలో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) ఎం.పద్మరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 13 నుంచి జరగనున్న బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను AU వెబ్సైట్లో పొందుపరిచారు. వీటి ఆధారంగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలి.

నాగుల చవితి సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్లో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. జూ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు జూ పార్క్కు కుటుంబాలతో సహా తరలివచ్చి పుట్టల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టల్లో గుడ్లు వేసి పాలు పోసి సందడి చేశారు. బాణసంచాను జూ అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో కొందరు నిరాశ చెందారు.
Sorry, no posts matched your criteria.