Visakhapatnam

News August 5, 2024

విశాఖ: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా?

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరఫున అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వగృహంలో అభ్యర్థి ఎంపికపై నిర్వహించిన సమావేశంలో పీలాను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News August 5, 2024

కంచరపాలెం: అదృశ్యమైన యువకుడి మృతి

image

అదృశ్యమైన యువకుడు చనిపోయిన ఘటన డుంబ్రిగుడ మండలంలో వెలుగు చూసింది. విశాఖ కంచరపాలేనికి చెందిన చంద్రకాంత్(17) గత నెల 30న అరకులో అదృశ్యమైనట్లు పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తుండగా డుంబ్రిగుడ మండలం జాంగుడ సమీపంలోని పొలం గడ్డ వాగులో మృతదేహం దొరికిందని సీఐ రుద్రశేఖర్ వెల్లడించారు. కాళ్లు చేతులు కట్టి ఉండటంతో పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని తెలుస్తోంది.

News August 5, 2024

గాజువాక: బైకులు ఢీ.. ఒకరు మృతి

image

గాజువాక పరిధిలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లంకెలపాలెం జాతీయ రహదారి పెట్రోల్ బంక్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అలమండ అప్పారావు అనే వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 5, 2024

ఎమ్మెల్సీగా నన్ను గెలిపించండి: బొత్స

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. చోడవరంలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అధ్యక్షతన పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బొత్స మాట్లాడుతూ.. జగన్ తనపై ఎంతో నమ్మకంతో అభ్యర్థిగా ఖరారు చేశారన్నారు. ప్రజా ప్రతినిధులు కలిసిమెలిసి పనిచేసి గెలిపించాలని కోరారు.

News August 5, 2024

మధురవాడలో మరో కొత్త యూనిట్ మాల్

image

విశాఖలోని మధురవాడ ప్రాంతంలో మరో కొత్త యూనిట్ మాల్ ఏర్పాటు కానుంది. రామానాయుడు స్టూడియో వద్ద ఈ మాల్‌ను నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్, రూరల్ ఎమ్మార్వో పాల్ కిరణ్ సోమవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అంశాలపై అధికారులతో ఆరా తీశారు.

News August 5, 2024

పారా ఒలింపిక్స్‌కు అనకాపల్లి జిల్లా క్రీడాకారుడు

image

అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన రొంగలి రవి పారిస్‌లో ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. షాట్‌పుట్‌లో రవి భారత్‌కు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. అతణ్ని క్రీడాకారుడిగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు మంగ, బాబు తమ వ్యవసాయ భూమిని సైతం విక్రయించారు. ఆదాయపు పన్ను విభాగంలో అధికారిగా పనిచేస్తున్న రవి పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని అన్నారు.

News August 5, 2024

విశాఖ: బాలుడిపై పోక్సో కేసు

image

విశాఖ జిల్లాలోని ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీకి చెందిన ఓ బాలిక కడుపులో నొప్పి వస్తుందని తల్లికి చెప్పింది. దీంతో ఆమె కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించడంతో గర్భవతి అని తేలింది. దీనికి కారణమైన అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడిపై బాలిక తల్లి ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతిరావు తెలిపారు.

News August 5, 2024

రిటర్నింగ్ అధికారిగా విశాఖ జేసీ

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా జేసీ కె.మయూరి అశోక్ వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయన ఛాంబర్‌లోనే నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 13 వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. 14 నుంచి 16 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఆగస్టు 30న ఎన్నిక జరుగుతుంది. సహాయ రిటర్నింగ్ అధికారులుగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల డీఆర్ఓలు ఉంటారు.

News August 5, 2024

సీఎం సదస్సుకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు దూరం

image

అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించే కలెక్టర్ల సదస్సుకు విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు హాజరు కావడం లేదు. ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అనుమతి కోసం విశాఖ కలెక్టర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సదస్సులో అభివృద్ధి కార్యక్రమాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ ఉంటుంది. ఆయా అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో ఈసీ అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

News August 5, 2024

అల్లూరి జిల్లాలో గుండెలు పిండేసిన ఘటన

image

కొడుకు మృతదేహం పట్టుకుని నడిరోడ్డుపై తల్లిదండ్రులు రోదించిన హృదయ విదారక ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. గూడెంకొత్తవిధి మండలం తిరుమలబంధకి చెందిన కార్తీక్‌కి గుండె నొప్పి రావడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించుకొని తిరిగి ఆదివారం తల్లిదండ్రులు తమ చుట్టాల ఇంటికి తీసుకు వెళుతుండగా అరకు సమీపంలో ఆ బాలుడు మృతి చెందాడు. రోడ్డుపైనే మృతదేహంతో సుమారు మూడు గంటల పాటు రోదిస్తూ ఉండిపోయారు.