India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆనందపురం మండలంలోని పలు గ్రామాలలో విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరీంద్రప్రసాద్ సోమవారం పర్యటించనున్నారని ఎంపీడీవో అప్పలనాయుడు తెలిపారు. చందక, గొట్టిపల్లి, లొడగలవానిపాలెం పంచాయతీలో ఏర్పాటు చేసిన కాలనీ లే అవుట్లను పరిశీలిస్తారని వివరించారు. కాలనీలో మౌలిక సౌకర్యాలను పరిశీలించి, లబ్దిదారులను కలిసి పలు విషయాలపై చర్చిస్తారని పేర్కొన్నారు.
ఓ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు ఏర్పడిన స్నేహం నేటికీ కొనసాగిస్తున్నారు. ఏటా స్నేహితుల దినోత్సవాన కలుస్తూ ఉంటారు. అయితే వారిలో కే.కోటపాడు మండలం పాచిలవానిపాలెంకి చెందిన అప్పారావుకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. దీంతో ఈ ఏడాది మిగిలిన స్నేహితులు రూ.50 వేలు పోగు చేసి ‘ఫ్రెండ్షిప్ డే’న అందజేశారు. సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ ఆదుకున్నవారే స్నేహితులని నిరూపించారు. మరి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా..?
ఉమ్మడి విశాఖ జిల్లా మీసేవా ఆపరేటర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు అయింది. అనకాపల్లి సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా కొరుప్రోలు చంద్రశేఖర్, కార్యదర్శిగా నాగు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా అప్పలనాయుడు, ఉపాధ్యక్షులుగా నాగరాజు, తులసి రామ్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ.. మీసేవా కేంద్రాలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.
విశాఖ రేంజ్ పరిధిలో 35 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండడంతో వీరిని మినహాయించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన సీఐలు తక్షణమే విధుల్లో చేరాలని డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.
అనకాపల్లి జిల్లాలో శనివారం ఎంవీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 568, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై 38, అక్రమ మద్యంపై 7 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ దీపిక ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి శాంతిభద్రతలకు భంగం కలిగించిన వారిపై 86, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై 292, రోలుగుంట మండలం చటర్జీపురంలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఒక కేసును నమోదు చేశామన్నారు.
అనంతగిరి మండలంలో సహజసిద్ధ బొర్రాగుహల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా.తనుజారాణి తెలిపారు. ఈ విషయమై లోక్ సభలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. రైల్వే ట్రాక్ నిర్మాణంతో బొర్రాగుహలకు వచ్చే నష్టాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సహజసిద్ధ గుహలను పరిరక్షించడం, కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అరకు ఎంపీగా వీటిని కాపాడాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని చెప్పారు.
VMRDA పరిధిలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా వినూత్న ప్రాజెక్టులు, ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రకృతిని పరిరక్షించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో అదనంగా 500 ఎకరాల్లో ఏరో సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్కు గతంలోనే బడ్జెట్ కేటాయించిందన్నారు. 52 ఎకరాల స్థలం విశాఖలో కేటాయించాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం భూమిని సేకరించలేకపోయిందన్నారు. భూసేకరణకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
మధురవాడ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. విశాఖలో మంత్రితో గంటా భేటీ అయ్యారు. భీమిలిలో ప్రధాన రహదారులను విస్తరించాలని కోరారు. భీమిలి, పీఎం పాలెం, కొమ్మాదిలో ఫ్లై ఓవర్ వంతెనలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. భీమిలి తగరపువలసలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు. చంద్రబాబును వారు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కలిశారు. ప్లాంట్ సమస్యలను సీఎంకు వివరించారు. కార్మికులు అంకితభావంతో పనిచేసి పరిశ్రమను లాభాలు బాటలో నడిపితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారని వారు తెలిపారు.
Sorry, no posts matched your criteria.