India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈస్ట్ కోస్ట్ డివిజన్లోని పలు ప్రత్యేక రైళ్లును రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ను, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు – తిరుపతి ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.
విశాఖ రేంజ్ పరిధిలో 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. మాకవరపాలెం ఎస్సై టీ.రామకృష్ణారావును రోలుగుంట పోలీసు స్టేషన్కు, కే.కోటపాడు ఎస్సై లక్ష్మీనారాయణను ఏ.కోడూరు, రావికమతం ఎస్సై ధనుంజయ్ నాయుడును అనకాపల్లి వీఆర్కు, ఏ.కోడూరు ఎస్సై రమేశ్ను అనకాపల్లి వీఆర్కు, కొత్తకోట ఎస్సై లక్ష్మణరావును కశింకోటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖలో మంగళవారం రాత్రి దారుణఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ గోపాలపట్నంలోని ఓ బాలికకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. మధురానగర్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో నిర్వాహకురాలితో పాటు ఒక బాధితురాలు విటుడు ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిపారు.
భారీ వర్షాల వల్ల అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసివేసిన బొర్రా గుహలను అధికారులు మంగళవారం తెరిచారు. అయితే మంగళవారం కేవలం 300 మంది పర్యాటకులు మాత్రమే బొర్రా గుహలను సందర్శించారని యూనిట్ మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా విశాఖ నుంచి అరకులోయ రాకపోకలు సాగించే మూడు బస్సులను గత శనివారం నుంచి నాలుగు రోజుల పాటు రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో బుధవారం నుంచి ఈ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి మాడుగుల, పాడేరు వెళ్లాల్సిన సర్వీసులను చోడవరం వరకు మాత్రమే నడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా చోడవరం నుంచి మాడుగుల, పాడేరు రూట్లు బాగా పాడయ్యాయి.
సీతమ్మధార రైతు బజార్ సమీపంలో గల ఆక్సిజన్ టవర్స్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినాయకుని ప్రసాదమైన 50 కిలోల లడ్డూ వేలంపాటలో రూ.4.50 లక్షలు పలికింది. స్థానికురాలు హర్ష పల్లవి లడ్డూను వేలంలో దక్కించుకుని.. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆక్సిజన్ టవర్స్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా లబ్ధిదారులను తీసుకెళ్లి జియో ట్యాగింగ్ చేయించాలన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అన్ని విధాల సహకారం అందించాలన్నారు.
విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ చేసినవారు అర్హులు. అశోక్ లేలాండ్ కంపెనీలో ఖాళీలు భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సెలక్ట్ అయిన వారికి దుబాయ్లో ఉద్యోగావకాశం అని పేర్కొన్నారు. వివరాలకు 9440197068 నంబర్కు సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.