India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. విశాఖకు చెందిన ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడి ధర కేవలం రూ.20 లక్షలు మాత్రమే.

నవంబర్ 02న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఇతర అధికారులతో కలిసి సీఎం హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే కోస్టల్ బ్యాటరీ ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ వద్దకు శనివారం మధ్యాహ్నం చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కలెక్టరేట్కు వస్తారని అన్నారు.

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని గూగుల్ హెడ్క్వార్టర్స్ను సందర్శించారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈవో, వైస్ప్రెసిడెంట్ను కోరారు. ఏపీలో ఈ- గవర్నెన్స్, డిజిటల్ విద్యకు సహకరించాలని మీటింగ్లో ప్రతిపాదించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి తోడ్పాటుతో పాటు స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి లోకేశ్ కోరినట్లు టీడీపీ ట్వీట్ చేసింది.

జిల్లాలో ఈనెల 2వ తేదీన సీఎం పర్యటనకు సంబంధించి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని, సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్ ఆదేశించారు. బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టరేట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

పర్యావరణహిత దీపావళిని జరుపుకోవాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. విశాఖలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పశు, పక్షాదులకు, వృద్ధులు, పిల్లలకు హాని కలగకుండా సంప్రదాయ బద్దంగా దివ్వెల పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2019లో నిందితుడు అమరపల్లి అరవింద్ మాయ మాటలు చెప్పి బాధిత బాలికలపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

NAD ఫ్లైఓవర్పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులు లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ లారీ కిందకు వెళ్లిపోయింది. ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని కేజీహెచ్కు తరలించారు.

జీవీఎంసీ 2023- 24వ సంవత్సరమునకు గానూ పీఎం స్వనిధి పథకాన్ని అమలు పరచడంలో జీవీఎంసీ రాష్ట్రస్థాయి అవార్డును పొందిందని యుసిడి డైరెక్టర్ సత్యవేణి తెలిపారు.మంగళవారం అవార్డును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేతులమీదుగా విజయవాడలో కమిషనర్ సంపత్ కుమార్ అందుకున్నారు. స్వనిది పథకంలో 20,697 దరఖాస్తులు యుసిడి విభాగం అధికారులు అమలు పరిచినట్లు తెలిపారు.

విశాఖలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్ టీం 38 పరుగుల తేడాతో ఆంధ్రా జట్టుపై విజయం సాధించింది. 158 ఓవర్లలో 500 పరుగులు చేసిన హిమాచల్ప్రదేశ్ జట్టు 156 పరుగులు ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రిషి ఆర్ ధావన్ 318 బంతుల్లో 19 ఫోర్లు, రెండు సిక్సులతో 195 పరుగులతో నాట్ అవుట్గా నిలిచారు. అనంతరం ఆంధ్ర జట్టు 32.1 ఓవర్లలో 118కి ఆలౌట్ అయ్యి 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.

విశాఖపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు ప్రతి చోటా అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. మద్యం అక్రమాల్లోని సూత్రధారులు, పాత్రధారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బెల్టు షాపుల నిర్వహణపై చర్యలుంటాయన్నారు.
Sorry, no posts matched your criteria.