India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రోజ్ గార్ మేళాలో పాల్గొనేందుకు విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ నేతల ఆహ్వానం మేరకు నగరంలో పార్టీ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పీవీన్ మాధవ్ తదితరులతో భేటీ అయ్యారు. నగరంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

10 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాని ధ్యేయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 75 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ రోజ్గార్ మేళాలో భాగంగా మంగళవారం విశాఖలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన యువతకు అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. రెండేళ్లలో 8 లక్షల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఈరోజు 51వేల మంది అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. యువతకు ముద్రా లోన్లు ఇస్తున్నామన్నారు.

విజయవాడలోని ఓ హోటల్ పైనుంచి పడి సోమవారం ఉదయం విశాఖ చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. సీఐ ప్రకాశ్ వివరాల ప్రకారం.. బాలిక అన్నతో దాగుడుమూతలు ఆడుకుంటూ కిటికీ కర్టెన్ వెనుక దాక్కుంది. ప్రమాదవశాత్తు జారిపోయి, 20 సెకన్లు కిటికీని పట్టుకుని వేలాడింది. కింద ఉన్న యువకులు పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

విశాఖకు చెందిన చిన్నారి విజయవాడలోని ఓ హోటల్ కిటికీ నుంచి జారిపడి మృతిచెందింది. ఈ ఘటన సోమవారం జరిగింది. విశాఖకు చెందిన బదరీ నాగరాజు తన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాడు. ఈ క్రమంలో ఈనెల 26న విజయవాడలోని ఓ హోటల్లో దిగారు. 27న ఉదయం అతని కుమార్తె రుహిక(4), సోదరునితో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిటికీ నుంచి జారి పడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మాచవరం పోలీసులు తెలిపారు.

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఇన్ ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం జరిగింది. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయిని అరికట్టాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు. ఆన్ రాక్ అల్యూమినియం ఫ్యాక్టరీ ఒప్పందాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీకి చెందిన భారీ వాహనాలు రాకపోకలను నియంత్రించాలన్నారు.

విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో మూడవరోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్ ప్రదేశ్ 150 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 478 పరుగులు చేసి 134 పరుగుల అధికంగా ఉంది. బౌలింగ్ బరిలోకి దిగిన ఆంధ్ర జట్టులో శశికాంత్ అద్భుతమైన బౌలింగ్తో హిమాచల్ ప్రదేశ్ పరుగులకు బ్రేకులు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సత్యనారాయణ రాజు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీశారు.

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా విమ్స్లో బుధవారం ఉచిత న్యూరో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్, నరాల సమస్యలు, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, పక్షవాతం, చిన్నపిల్లలకు మానసిక వైకల్యం తదితర రోగాలను నిర్ధారించే వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. >Share it

మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల్లో ప్రత్యామ్నాయంగా ఇథనాల్ తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. అనకాపల్లిలో నిర్వహించిన కూటమి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జగన్ విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఐదు ప్రాజెక్టుల కోసం టెండర్లను పిలిచినట్లు తెలిపారు.

విశాఖ డెయిరీ యాజమాన్యం గాజువాక మండలం మింది గ్రామ పరిధిలో రూ.100 కోట్ల విలువచేసే మూడు ఎకరాల భూమిని కబ్జా చేసిందని జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. అదే గ్రామ పరిధిలో ఏపీఐఐసీ నుంచి పాల ఉత్పత్తి పరిశ్రమకు మరో 19.36 ఎకరాల భూమిని అక్రమంగా పొందినట్లు వివరించారు. ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు.

అనకాపల్లిలో సోమవారం రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద అధ్యక్షతన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేశ్ హాజరయ్యారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.