Visakhapatnam

News July 30, 2024

త్వరలో నిర్వాసితుల సమస్యలు పరిష్కారం: హోం మంత్రి

image

నక్కపల్లి మండలం APIIC నిర్వాసితుల సమస్యలపై విశాఖ సర్క్యూట్ హౌస్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. ఏడు గ్రామాల రైతులు, ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. త్వరలోనే ఏపిఐఐసీ నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని మంత్రి కలెక్టర్ విజయకృష్ణన్, అధికారులను ఆదేశించారు.

News July 30, 2024

సింహాచలంలో రెండవ రోజు హుండీలు లెక్కింపు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో మిగిలిన హుండీలను మంగళవారం లెక్కించారు. 29, 30 తేదీల్లో మొత్తం రూ.2,65,72,189 నగదు లభించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. రెండు రోజుల లెక్కింపులో బంగారం 186 గ్రాముల 950 మిల్లీగ్రాములు, వెండి 13 కిలోల 500 గ్రాములు లభించినట్లు తెలిపారు. అలాగే వివిధ దేశాల కరెన్సీని భక్తులు కానుకలుగా వేసినట్లు పేర్కొన్నారు

News July 30, 2024

జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకు 20 నామినేషన్లు

image

జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకు 20 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈనెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. ఆగస్టు మూడవ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవుతుందన్నారు. వచ్చే నెల 7వ తేదీన ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు.

News July 30, 2024

విశాఖ 6,7,8 వార్డుల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం

image

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 2వ జోన్ పరిధిలో 6,7,8 వార్డుల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్ కె.వి.ఎన్.రవి మంగళవారం తెలిపారు. రెండవ జోన్ పరిధిలో గోస్తని నది జలాలకు బోని గ్రామం వద్ద ఉన్న గోస్తని హెడ్ వాటర్ వర్క్స్ వద్ద 700MM డీఐ పైపులైను లీకులు ఏర్పడ్డాయన్నారు. వాటి మరమ్మతుల కారణంగా బుధవారం తాగునీరు సరఫరా ఉండదన్నారు.

News July 30, 2024

విశాఖ: ‘చట్టబద్ధమైన దత్తతను మాత్రమే ప్రోత్సాహించాలి’

image

చట్టబద్ధమైన దత్తతను మాత్రమే ప్రోత్సాహించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కే.అప్పారావు సూచించారు. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, కేజీహెచ్ సంయుక్తంగా మంగళవారం కేజీహెచ్ ఎథిక్స్ గ్యాలరీలో అనాధికార దత్తత-చట్టప్రకారం చర్యలు అనే అంశంపై గైనకాలజీ పిల్లల విభాగం వైద్యులు, నర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు గొండు సీతారాం పాల్గొన్నారు.

News July 30, 2024

‘సగటు మనుషి జీవన చిత్రమే రావిశాస్త్రి రచన’

image

సగటు మనుషి జీవన చిత్రమే రావిశాస్త్రి రచన సారాంశం అని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం బీచ్ రోడ్ లోని రావిశాస్త్రి మెమోరియల్ దగ్గర జరిగిన రావిశాస్త్రి 102వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది ఎం.రామదాసు హాజరై రావిశాస్త్రి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, సాధారణ బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా ఎన్నో రచనలు చేశారన్నారు.

News July 30, 2024

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: హోంమంత్రి అనిత

image

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. విశాఖ నుంచి రాష్ట్రంలోని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. మహిళల, బాలికల రక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నేర నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

News July 30, 2024

23 వాహనాలపై రవాణా శాఖ కేసు నమోదు

image

వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉంటే వాటిపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని ఉప రవాణా కమిషనర్ జీసీ.రాజారత్నం తెలిపారు. వాహనాలలో బ్లాక్ ఫిలిం వెంటనే తొలగించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజుల్లో ఎన్‌ఎస్‌టి‌ఎల్, బోయపాలెం, పీఎంపాలెం తదితర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేసి బ్లాక్ ఫిలిం కలిగిన 23 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 30, 2024

ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్టీసీలో విజయనగరం జోన్ పరిధిలో అప్రెంటిషిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆగస్టు ఒకటి నుంచి 16 తేదీ వరకు తమ పేర్లను www.apprenticeshipindia.gov.in సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లా పరిధిలో వివిధ ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

News July 30, 2024

తెరుచుకున్న చాపరాయి జలపాతం

image

సుమారు వారం రోజుల తర్వాత చాపరాయి జలపాతం వద్ద పర్యాటకుల ప్రవేశాలను పునరుద్ధరిచారు. అల్పపీడనం కారణంగా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో, చాపరాయి గెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రవేశాలను నిలుపుదల చేశారు. వర్షాలు తగ్గడంతో జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతిస్తున్నారు.