Visakhapatnam

News July 28, 2024

అల్లూరి: వాగు దాటుతూ యువకుడు గల్లంతు..!

image

హుకుంపేటలో మండలంలో వాగు దాటుతూ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. యువకుడు పామురాయి గ్రామానికి వెళ్లే మత్స్యగెడ్డను దాటే క్రమంలో వరద ఉధృతికి గల్లంతయ్యాడని స్థానికులు తెలిపారు. గల్లంతైన యువకుడు డుంబ్రిగుడ మండలం గుంటసీమకు చెందిన కిల్లో. సోంనాథ్(18)గా గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 28, 2024

విశాఖకు రానున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్

image

ఈనెల 30న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, సభ్యుడు గొండు సీతారాం విశాఖ వస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి కలెక్టరేట్‌కు సమాచారం అందించారు. ఆరోజు ఉదయం కేజీహెచ్‌లో నిర్వహించే అనధికార దత్తత-చట్ట ప్రకారం చర్యలు అనే అంశంపై ప్రసంగిస్తారని అన్నారు. మధ్యాహ్నం ఎంవీపీ కాలనీలో మాదకద్రవ్యాలపై నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొంటారని చెప్పారు.

News July 28, 2024

అనకాపల్లి: యువతి కిడ్నాప్.. ఐదుగురు అరెస్ట్

image

యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడితో సహా అతని స్నేహితులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనకాపల్లి టౌన్ సీఐ శంకర్ రావు తెలిపారు. 19 ఏళ్ల యువతి స్నేహితుడితో కలిసి సింహాచలం వెళ్లి వస్తుండగా తేజసాయికుమార్ అనే యువకుడు వారిని అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. మనస్తాపానికి గురైన యువతి ఏలేరు కాలవలోకి దూకారు. కాపాడిన తేజ సాయికుమార్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

News July 28, 2024

విశాఖలో కానిస్టేబుల్ సస్పెన్షన్

image

విశాఖ 4వ పోలీస్ స్టేషన్‌ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్న ఓ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. స్టేషన్ నుంచి న్యాయస్థానం వ్యవహారాలు చూసే కానిస్టేబుల్ హరీశ్ వ్యవహారంపై గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సీపీకి పంపించారు. వచ్చిన ఆరోపణలపై పూర్తి ఆధారాలు సేకరించిన అధికారులు అతనిని సస్పెండ్ చేశారు.

News July 28, 2024

రుషికొండ బీచ్‌లో స్పీడ్ బోట్లు పునరుద్ధరణ

image

విశాఖలో రుషికొండ బీచ్‌లో పర్యాటక స్పీడ్ ఓట్లను శనివారం నుంచి పునరుద్ధరించారు. తుఫాన్ ప్రభావం కారణంగా భారీ ఈదురు గాలులు వీచిన కారణంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం టూరిజం స్పీడ్ బోట్లను ఈ నెల 18వ తేదీ నుంచి నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో యథావిధిగా వీటిని నడుపుతున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

News July 28, 2024

విశాఖ తూర్పు తీరంలో మిషన్ గస్తీ విజయవంతం

image

భారత తూర్పు తీరంలో చేపట్టిన మిషన్ గస్తీ విజయవంతంగా ముగిసినట్లు కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ తెలిపారు. శనివారం విశాఖలో ఈ.ఎన్.సీ ముఖ్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మిషన్ గస్తీలో ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గాలు అధికారులు, సిబ్బంది అద్భుత ప్రదర్శన కనపర్చినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ఆపరేషన్ లక్ష్యాలను చేరుకోవడం అభినందనీయం అన్నారు.

News July 28, 2024

విశాఖ: యాక్సిడెంట్‌లో ఫార్మా ఉద్యోగి మృతి

image

ఆనందపురం మండలం దుక్కవానిపాలెం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో దివీస్ ఉద్యోగి ఉప్పల రాధాకృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది బాపట్ల జిల్లా వేమూరు మండలం బుతమల్లి గ్రామం. 2002 నుంచి దివీస్ కంపెనీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. గాజువాక స్టీల్ లోడ్ తీసుకొని వెళ్లివస్తూ టోల్ ప్లాజా వద్ద మంచినీటి కోసం ఆగి రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొని మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News July 28, 2024

దసపల్లా భూములను స్వాధీనం చేసుకోవాలి: విశాఖ కార్పొరేటర్

image

విశాఖ నగరంలోని అత్యంత విలువైన దసపల్లా భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. భూములు ప్రభుత్వానివి అని మరోసారి రుజువైనందున తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ భూముల హక్కుదారులుగా ఇంతవరకు చలామణి అయిన రాణి కమలాదేవికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

News July 28, 2024

ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు: కలెక్టర్ దీనేశ్

image

గోదావరి, శబరి వరదల నేపథ్యంలో వరద బాధితులు ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని, ఎటువంటి ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. అవసరమైన వారిని గుర్తించి రేషన్, నిత్యావసర వస్తువులు, టార్పాలిన్లు, దోమతెరలు, కిరోసిన్ టార్చ్ లైట్ లు లాంటివి పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News July 27, 2024

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోడవరం బాలుడు

image

చోడవరానికి చెందిన బాలుడు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అలవల సత్యప్రసాద్, మానస దంపతుల కుమారుడు ఆష్మాన్ రామ్ రెండున్నరేళ్ల వయసులో 110 దేశాల జాతీయ జెండాలను గుర్తించి వాటి దేశాల పేర్లు చెప్పడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఆన్‌లైన్‌‌లో లింగాష్టకం 57 సెకెన్‌లలో ఆలపించడంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు.