India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ANM నుంచి GNMగా ట్రైనింగ్ తీసుకుంటూ కేజీహెచ్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ స్టాఫ్ను భవిష్యత్తులో రెగ్యులర్ చేసే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేజీహెచ్లో 59 మంది డాక్టర్లు, 79 నర్సింగ్, 99 పారామెడికల్ స్టాఫ్ కొరత ఉందన్నారు. త్వరలో ఖాలీలు భర్తీ చేస్తామన్నారు. విశాఖ నార్త్ MLA విష్ణుకుమార్ రాజు కేజీహెచ్లో సిబ్బంది కొరతపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
ఏయూలోని ఎం.ఏ యోగ మొదటి సెమిస్టర్, మూడో సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ బిబిఏ – ఎంబీఏ 5వ సెమిస్టర్, బీటెక్+ఎంటెక్ మొదటి, మూడవ సెమిస్టర్, ఫార్మా-డి నాల్గవ సంవత్సరం పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల పరీక్ష ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్ సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్ను ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.
జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న ఉమ్మడి విశాఖ జిల్లా బీచ్ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక జరుగుతుందని సంఘం కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాదరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం 3 గంటలకు ఆర్కేబీచ్ సమీపంలో విశాఖ ఉమ్మడి జిల్లా పురుషులు, మహిళల బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. ఎంపికైన వారు విశాఖ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారని పేర్కొన్నారు.
విశాఖలోని వి.ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఐ.విజయబాబు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కు గత బడ్జెట్లో రూ. 276కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించగా.. ప్రస్తుతం రూ.150కోట్లు కేటాయించారు. సాగరమాల ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో రూ.700కోట్లు కేటాయించారు. ఇప్పటికే విశాఖ హార్బర్ ఆధునికీకరణ, రోడ్ల విస్తరణ సాగరమాల ప్రాజెక్టు కింద జరుగుతున్నాయి. దీనితో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో ప్రవేశాలకు జూలై 31వ తేదీ వరకు గడువు ఉన్నట్లు విశాఖ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ ధర్మారావు తెలిపారు. కేంద్రం పరిధిలో 11 జిల్లాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో డిగ్రీ, పీజీ, డిప్లమో సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కొమ్మాదిలోని జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సెప్టెంబర్ 16వ తేదీలోగా www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. 2003 మే 1 నుంచి 2017 జులై 31 మధ్య జన్మించిన వారు అర్హులు. 2025 జనవరి 18న ఉదయం 11:30 నుంచి 1:30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. 75 శాతం గ్రామీణ విద్యార్థులకు, 25 శాతం పట్టణ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. > Share it
కొమ్మాది ప్రాంతంలో బేకరీలో పనిచేస్తున్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. సోమవారం విధులు ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో వసతిగృహానికి వెళ్తున్న ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయాలతో హాస్టల్కి వెళ్లిన ఆమెను స్నేహితులు ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. కమిషనర్ శంఖబ్రత బాగ్చి దృష్టి సారించి విచారణను ఆదేశించినట్లు తెలుస్తోంది.
టమోటా ధరను సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లు చేస్తామని విశాఖ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి షేక్. యాసిన్ తెలిపారు. టమాటా ధరను కట్టడి చేసేందుకు మార్కెటింగ్ శాఖ చిత్తూరు జిల్లా నుంచి వీటిని కొనుగోలు చేసి విశాఖ వినియోగదారులకు బయట మార్కెట్ ధర కన్న తక్కువకు ధరలకు అందజేయాలని ప్రణాళికలు వేస్తోంది. దీనికి అనుగుణంగా 24న బుధవారం విశాఖ జిల్లాలో గల అన్ని రైతు బజార్లోకి కేజీ రూ.54 గా విక్రయాలు జరపనున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు 24వ తేదీ బుధవారం పాఠశాలలకు, కళాశాలలకు సెలవు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చింతూరు డివిజన్ కూనవరం, వి ఆర్ పురం ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాల్లో తగు జాగ్రత్తలతో ఉండాలని సూచించారు. విద్యార్థులు బయటకు వెళ్లరాదని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.