India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్మైలెక్స్ లాబరేటరీస్ పరిశ్రమలో వాక్యూమ్ పంపులు మీదపడి కబీ అనే ఒప్పంద కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఫార్మా కంపెనీలో తరచూ జరుగుతున్న ప్రమాదాల పట్ల కార్మికులు భయాందోళనలు చెందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
కసింకోట మండలం విసన్నపేటలో 609 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా వేసిన అక్రమ లేఅవుట్ పై కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ VMRDA కమిషనర్ విశ్వనాథన్కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా గెడ్డలు, సీలింగ్ భూములు, దళితుల అసైన్డ్ భూములు, డి.పట్టాలను కలుపుకొని అక్రమ లేఅవుట్ వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన స్పెషల్ కేటగిరి విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన డాక్టర్ వి.ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రారంభమైంది. దృవపత్రాల పరిశీలన 23, 24, 25 తేదీలలో జరుగుతుందని, ప్రవేశాల కోఆర్డినేటర్ డి.రమేశ్ తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామన్నారు.
ఈ నెల 27న జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.పోలినాయుడు మంగళవారం తెలిపారు. ఆరోజు ఉదయం 10.30గంటలకు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి నివేదికలకు సంబంధించిన పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు.
విశాఖలో 781 కి.మీ మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పనులు పూర్తయ్యాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పెందుర్తిలో రూ.412 కోట్లతో 226 కి.మీ మేర 80%, గాజువాక, మల్కాపురంలో రూ.530 కోట్లుతో 429 కి.మీ.లో 50% పనులు పూర్తయ్యాయన్నారు. మధురవాడ, యండాడ, కొమ్మాదిలో 413కి.మీ ప్రపోజల్తోపాటు అనకాపల్లి, భీమిలిలో 311 కి.మీ DPR ప్రిపేర్ చేస్తున్నామన్నారు. మొత్తం 2,160 కి.మీ. మేర యూజీడీ నిర్మాణం జరుగుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సం.కి నేడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చేసే కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. ఈసారైనా విశాఖ కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో నిధులు అందిస్తారా? అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. విశాఖ మీదుగా ఫ్లై ఓవర్ల నిర్మాణం, పోర్ట్ అభివృద్ధిని కోరుకుంటున్నారు.
విశాఖకు చెందిన బాక్సింగ్ కోచ్ ఐ.వెంకటేశ్వరరావు పారిస్ ఒలింపిక్స్లో టెక్నికల్ ఆఫిషియల్గా సేవలందించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. టెక్నికల్ అఫీషియల్స్ న్యూఢిల్లీ నుంచి బుధవారం బయలుదేరనున్నామన్నారు. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఆరుగురు కాంటింజెంట్ సభ్యులు ఇప్పటికే జర్మనీలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. కాగా.. వెంకటేశ్వరరావు ద్రోణాచార్య అవార్డు గ్రహీత.
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. అత్యాచారం చేసిన చోడిపల్లి మురళీకృష్ణకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొంది. ముద్దాయికి శిక్షపడే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులను కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అభినందించారు.
భారీ వర్షాల కారణంగా కొత్తవలస- కిరండూల్ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. విశాఖ- కిరండూల్ (18514), కిరండూల్- విశాఖ(18513) రైలు విజయనగరం, రాయగడ, కొరాపుట్ మీదుగా దంతెవాడ చేరుకుంటుందన్నారు. తిరిగి అదే మార్గంలో విశాఖ వైపు వెళ్తుందని వాల్తేరు డివిజనల్ వాణిజ్య మేనేజర్ కె.సందీప్ వెల్లడించారు. విశాఖ- కిరండూల్ పాసింజర్ దంతెవాడ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తుందన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 23 నుంచి విశాఖ- సికింద్రాబాద్(12739) గరీబ్ రథ్ రైలు ఎల్హెచ్బీ బోగీలతో నడుస్తుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. సోమవారం రాత్రి ఎల్హెచ్బీ బోగీలతో సికింద్రాబాద్ బయలు దేరిన ఈ రైలు మంగళవారం ఉదయం విశాఖ చేరుకుంటుందన్నారు. 18 థర్డ్ ఏసీ ఎకానమి బోగీలతో పాటు 2 జనరేటర్ బోగీలతో ఈ రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.