Visakhapatnam

News October 11, 2024

విశాఖలో ప్రీమియర్ షో చూసిన హీరో సుధీర్ బాబు

image

హీరో సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో ‘ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీమియర్ షోను గురువారం ద్వారకానగర్‌లోని సంఘం థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. సినిమా ఇద్దరు ఫాదర్స్, ఒక కొడుకు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఆయన వెల్లడించారు.

News October 10, 2024

తాతయ్యబాబుకి గృహ నిర్మాణ మంత్రి అభినందనలు

image

ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబుకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం విజయవాడలో బాధ్యతలు చేపట్టిన తాతయ్య బాబును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారథి అభినందించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయనకు మంత్రి సూచించారు. పేదలందరికి పక్కా గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

News October 10, 2024

మిల్లెట్స్‌తో రతన్ టాటా చిత్రపటం

image

దాతృత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ, భారతదేశానికి, పారిశ్రామిక రంగానికి పేరు ప్రఖ్యాతి తెచ్చిన మహోన్నత వ్యక్తికి విశాఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. మిలెట్స్ ఉపయోగించి రతన్ టాటా చిత్రాన్ని తయారు చేశారు. ఆ మహనీయునికి తాను ఇచ్చే నివాళి ఇది అని విజయ్ కుమార్ అన్నారు.

News October 10, 2024

విశాఖ: ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ప్రాధాన్యతను వివరించిన టాటా

image

ఇంటర్ డిసిప్లినరీ రీసర్చ్ జరపాల్సిన అవసరం ఉందని రతన్ టాటా అన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో 2018 డిసెంబర్ 10న నిర్వహించిన పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏయూతో పరిశోధన రంగంలో కలసి పనిచేయడానికి, సంయుక్త పరిశోధనలు జరిపే దిశగా యోచన చేస్తామన్నారు. విభిన్న శాస్త్రాలను సమన్వయం చేస్తూ పరిశోధనలు జరపాలన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్నవారితో గ్రూప్ ఫొటో తీసుకున్నారు.

News October 10, 2024

విశాఖ: నిన్న గుడ్‌న్యూస్.. అంతలోనే..!

image

తమ కంపెనీ సేవలను విశాఖలో విస్తరించనున్నట్లు టీసీఎస్ ప్రతినిధులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 10 వేల మందికి ఉపాధిని కల్పిస్తామని వెల్లడించింది. విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి టాటా గ్రూప్ చేయూతనిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. నిన్న అధికారిక ప్రకటన రాగా.. ఈరోజు ఆ సంస్థ అధినేత రతన్ టాటా మృతి వార్త విశాఖ వాసులను కలచివేసింది. కాగా.. 2018 డిసెంబర్ 10న చివరిసారిగా రతన్ టాటా విశాఖలో పర్యటించారు.

News October 10, 2024

విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు

image

పండగల సీజన్‌లో విజయవాడ- శ్రీకాకుళం రోడ్డు-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. విజయవాడ శ్రీకాకుళం స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఈనెల 10 నుంచి 17(13 మినహా) వరకు ప్రతిరోజు విజయవాడ నుంచి రాత్రి బయలుదేరి శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం-విజయవాడ స్పెషల్ ఎక్స్ ప్రెస్ శ్రీకాకుళం నుంచి ఈనెల 10 నుంచి 18 వరకు(14 మినహా) నడుస్తుందన్నారు.

News October 10, 2024

విశాఖ వేదికగా మలబార్ విన్యాసాలు

image

విశాఖ వేదికగా జరుగుతున్న మలబార్-2024 విన్యాసాల ప్రారంభ వేడుకల్లో నాలుగు దేశాలకు చెందిన నౌకాదళాల అధికారులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో సవాళ్లను పరిష్కరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి అవగాహన పెంపొందించుకునే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్ దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.

News October 10, 2024

విశాఖ: రూ.40 వేల జీతం.. దరఖాస్తులు ఆహ్వానం

image

కేజీహెచ్-ఏఎంసీలో నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ సెంటర్లో కోర్స్ కోఆర్డినేటర్ పోస్ట్ కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిబాబు తెలిపారు. నెలకు రూ.40 వేలు వేతనం చెల్లిస్తారని అన్నారు. నెల్స్ సిల్క్ ల్యాబ్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 18లోగా పరిపాలన కార్యాలయం ఆంధ్ర మెడికల్ కాలేజీలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News October 10, 2024

రైల్వే జోన్‌కు త్వరలో భూమి పూజ: ఎంపీ శ్రీభరత్

image

విశాఖ రైల్వే జోన్ త్వరలో ఏర్పాటు కానున్నట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. విశాఖ టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ త్వరలో విశాఖలో రైల్వే జోన్ కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్లాంటుకు రూ.1700 కోట్లు విడుదలైనట్లు తెలిపారు.

News October 10, 2024

బంతి పూల సొగసులతో..అరకు మరింత సోయగం

image

అరకులో జైపూర్ జంక్షన్ దగ్గర బోడ అనే రైతు బంతిపూల సాగుతూ ఒక సీజన్లో అత్యధిక రాబడిని పొందుతున్నాడు. టూరిస్టులు ఈ ప్రదేశంలో వచ్చి ఫోటోలు తీసుకోవడం వలన ఆ రైతుకు వచ్చే డబ్బు ఆధారంగా ఆదాయాన్ని పొందుతున్నాడు. ఆ పూల తోటలో ఫోటోలు తీసుకునే వారి వద్ద రూ.10 రూపాయల నుంచి రూ.30 వరకు టికెట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అరకు ప్రాంతంలో ఈ రకమైన పర్యటక వాణిజ్య వ్యవసాయం పట్ల రైతుల ఆసక్తి చూపెట్టడం గమనర్హం.