India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపుతూ పనుల్లో జాప్యం చేయడం సరికాదని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ గ్రామీణ పథకాలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికయుతంగా పనిచేయాలన్నారు.

విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) ఏర్పాటు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్కు విశాఖ ఎంపీ భరత్ శుభాకంక్షాలు తెలిపారు. ఈ మేరకు X వేదికగా స్పందిస్తూ టాటా గ్రూప్ను ఒప్పించారు. టీసీఎస్ ఏర్పాటు అయితే సుమారు పదివేల మంది స్థానిక యువతకి ఉపాధి లభిస్తుంది. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని చూపిస్తున్న చొరవకు ఎంపీగా అవసరమైనదంతా నేను చేస్తాను అని పేర్కొన్నారు.

సినీ హీరో సుదీర్ బాబు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రం ప్రమోషన్లో భాగంగా విశాఖ వచ్చిన మూవీ టీమ్ ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు. అనంతరం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

విశాఖలో ‘మా నాన్న సూపర్ హీరో’ చిత్ర బృందం బుధవారం సందడి చేసింది. ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర హీరో సుధీర్ బాబు మాట్లాడారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారన్నారు. ఆర్ణ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్, షియాజీషిండే కీలక పాత్రలు పోషించారన్నారు. ఇది తండ్రి, కొడుకుల చుట్టూ తిరిగే కథ అని అన్నారు. ఈ నెల 11న విడుదల అవుతుందని చెప్పారు.

విశాఖ జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తూ.. ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ మద్యం వ్యాపారి ఏకంగా 30దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కొందరు సిండికేట్గా ఏర్పడి దరఖాస్తులు ఎక్కువగా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇండియా- బంగ్లాదేశ్ మధ్య బుధవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొన్న జరిగిన తన అరంగేట్ర టీ20లో మన విశాఖ ప్లేయర్ నితీశ్ రెడ్డి బౌలింగ్, బ్యాటింగ్లో పర్వాలేదనిపించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేయడంతో పాటు, బ్యాటింగ్ సమయంలో ఓ భారీ సిక్సర్తో 16 రన్స్ చేశాడు. నేడు బంగ్లాతో రెండో టీ20లో సిక్సర్లతో చెలరేగడంతో పాటు ఆల్రౌండ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విశాఖ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జులైలో 1,720 విమానాల ద్వారా 2,25,261 మంది.. ఆగస్టులో 1,872 విమానాల్లో 2,52,311 మంది ప్రయాణించినట్లు ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ తెలిపింది. సెప్టెంబరులో 1,806 సర్వీసుల్లో 2,25,215మంది ప్రయాణించినట్లు వివరించింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే 6.8శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు కేంద్రం హామీ ఇచ్చినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ను రక్షించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందన్నారు.

ఏసీఏ అండర్ -14 క్రికెట్ టోర్నీలో విశాఖ జట్టు గెలుపొందింది. కడపలో జరిగిన మ్యాచ్లో తూ.గో. జిల్లా జట్టుపై విశాఖ ఘన విజయం సాధించింది. విశాఖ 68 ఓవర్లలో 426/3కి డిక్లేర్ చేయగా.. తూ.గో. జట్టు 50పరుగులకే ఆలౌట్ అయింది. విశాఖ జట్టులో వినోద్ (177), రామ్ చరణ్(133)రన్స్ చేయగా.. ప్రఖ్యాత్ వర్మ 5వికెట్లు తీశారు.

పండగ సీజన్ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ప్రయాణికులు సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక కోచ్లు జత చేస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్లు లేకుండా రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించరాదన్నారు. నిషేధిత వస్తువులను తీసుకువెళ్లవద్దన్నారు.
Sorry, no posts matched your criteria.