India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏసీఏ అండర్ -14 క్రికెట్ టోర్నీలో విశాఖ జట్టు గెలుపొందింది. కడపలో జరిగిన మ్యాచ్లో తూ.గో. జిల్లా జట్టుపై విశాఖ ఘన విజయం సాధించింది. విశాఖ 68 ఓవర్లలో 426/3కి డిక్లేర్ చేయగా.. తూ.గో. జట్టు 50పరుగులకే ఆలౌట్ అయింది. విశాఖ జట్టులో వినోద్ (177), రామ్ చరణ్(133)రన్స్ చేయగా.. ప్రఖ్యాత్ వర్మ 5వికెట్లు తీశారు.

పండగ సీజన్ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ప్రయాణికులు సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక కోచ్లు జత చేస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్లు లేకుండా రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించరాదన్నారు. నిషేధిత వస్తువులను తీసుకువెళ్లవద్దన్నారు.

అనకాపల్లి జిల్లాలో సాగినీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థలో రైతులను భాగస్వామ్యం చేసి సాగునీటి సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

✶విశాఖ: విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు
✶పాయకరావుపేటలో అమ్మవారి నవరూప అవతారాలు
✶డిసెంబర్లో విశాఖ రైల్వేజోన్కు శంకుస్థాపన
✶అరకులోయలో NCC కెడెట్స్ ట్రెక్కింగ్ క్యాంపు
✶నక్కపల్లి వద్ద బస్సు ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
✶మేడివాడ: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
✶అల్లూరి: 59 మొబైల్ ఫోన్లు అప్పగింత
✶విశాఖలో రూ.50కే కిలో టమాటా
✶విశాఖలో ఆక్రమణలు కూల్చివేత

అనకాపల్లి జిల్లాలో సాగినీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. సాగునీటి పారుదల వ్యవస్థలో రైతులను భాగస్వామ్యం చేసి సాగునీటి సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే అంశంపై కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఢిల్లీలో సీఎం అధికార నివాసంలో మంగళవారం కేంద్రమంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు.

విశాఖ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు “పల్లె పండగ” వారోత్సవాలను ప్రణాళికాయుతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన సమీక్ష కలెక్టర్ మాట్లాడారు. రూ.29 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ పరిధిలో 322 పనులకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు.

జిల్లాలో ప్రశాంతంగా టెట్ పరీక్షలు జరుగుతున్నట్లు డీఈఓ చంద్రకళ తెలిపారు. మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. మంగళవారం టెట్ పరీక్షకు 4614 మంది పరీక్షలు రాయాల్సి ఉందన్నారు. అయితే 4165 మంది పరీక్ష రాశారని ఆమె పేర్కొన్నారు. ఉదయం 5 కేంద్రాల్లో మధ్యాహ్నం 5 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. కాగా తాను రెండు కేంద్రాలను తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు కేంద్రాల్లో తనిఖీలు చేపట్టిందన్నారు.

మేడివాడ గ్రామానికి చెందిన గంటా కృష్ణ 36 ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న కృష్ణ తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంపై మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రావికమతం ఏఎస్ఐ అప్పారావు తెలిపారు. ఎస్సై రఘువర్మ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఈనెల 14 నుంచి అనకాపల్లి జిల్లాలో పల్లె పండగ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ వారోత్సవాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించినట్లు పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. పంచాయతీల వారీగా షెడ్యూల్ తయారుచేసి వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలకు ముందుగా అందజేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.