India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హుకుంపేట మండలం అడ్డుమండలో గురువారం అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం పొలంలో నాట్లేశారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి కృషి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు సంక్షేమానికి విస్మరించిందని ఆరోపించారు.
గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కేంద్రంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన భార్యకు శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఆమె భర్త మదన్ కమిషనర్కు రాసిన లేఖ బట్టబయలు కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. తాజాగా గురువారం రాత్రి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను మదన్ కలిశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమెకు ఫిర్యాదు చేశారు.
విశాఖలోని గొంతినవానిపాలెంలో <<13648352>>యువతి తల్లి<<>>ని గాయపరిచిన నిందితుడు సిద్ధును గురువారం అరెస్టు చేసినట్లు డీసీపీ తుహీన్ సిన్హా తెలిపారు. విశాఖ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రేమ పేరుతో యువతిని వేధించడంతో పాటు మరో రెండు కేసులు ఉండడంతో నిందితుడు సిద్ధుపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. మహిళలు, యువతులపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అధికారుల సహకారంతోనే సహజ వనరుల దోపిడీ జరుగుతుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. గురువారం విశాఖలో పౌర గ్రంథాలయంలో జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు. విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను రక్షించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
ఈనెల 20న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద మొదలుపెట్టి.. అడవివరం-ధారపాలెం-ఆరిలోవ-హనుమంతువాక-పోలీసు క్వార్టర్స్- కైలాసగిరి టోల్ గేట్- అప్పుఘర్ జంక్షన్- MVPడబుల్ రోడ్-వెంకోజీపాలెం- HB కాలనీ-కైలాసపురం-మాధవధార-మురళీనగర్-బుచ్చిరాజుపాలెం-లక్ష్మీ నగర్-ఇందిరా నగర్- ప్రహ్లాదపురం-గోశాల జంక్షన్-తొలి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేరుకోవాలి. సుమారు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయాలి. >Share it
APలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదన్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి శ్రేణులు చేస్తున్న దమనకాండ రోజురోజుకు మితిమీరిపోతుందన్నారు. దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఈసీఈ విభాగం సీనియర్ ఆచార్యులు జి.శశిభూషణరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆచార్య శశిభూషణరావు ఏయూ పాలకమండలి సభ్యునిగా పనిచేశారు. రక్షణ రంగ సంబంధ పరిశోధనలో శశిభూషణ్ రావు నిష్ణాతులు.
ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న సింహగిరి ప్రదక్షిణ ఉత్సవానికి హాజరు కావాలని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ మంత్రి అశోక గజపతి రాజును దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఆహ్వానించారు. ఈ మేరకు విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆయనను కలిసి ఉత్సవ ఏర్పాట్లను వివరించారు. అలాగే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 21న ఆలయంలో జరిగే చందన సమర్పణ వైదిక కార్యక్రమాలను తెలియజేశారు.
KGHలో వైద్యానికి వచ్చేవారికి abha యాప్ తప్పని సరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యాప్లో తమ వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్ ఫోన్ ద్వారా టోకెన్ వస్తుంది. టోకెన్ నంబర్ చెబితే కౌంటర్లో ఓపి సీట్ ఇస్తారు. మొబైల్ ఫోన్ లేనివారు ఆధార్ కార్డుతో డైరెక్టుగా ఓపి తీసుకోవచ్చు. మొబైల్ యాప్ వినియోగం తెలియని వారికి స్థానికంగా స్టాఫ్ నర్సులు సహాయం అందిస్తారు.
విశాఖ ఉక్కు డైరెక్టర్ సురేశ్ చంద్ర పాండే తన పదవికి రాజీనామా చేశారు. 13 నెలల క్రితం భాధ్యతలు చేపట్టిన ఆయన అనేక వివాదాస్పద నిర్ణయాలతో కర్మాగానికి, కార్మికులకు ఇబ్బందులు కలిగించారని ఆరోపణ ఎదుర్కొన్నారు. కార్మిక నాయకులు ఉక్కు మంత్రిత్వ శాఖకు దీనిపై ఫిర్యాదులు చేశారు. ఈ నెల 19న స్టీల్ సెక్రటరీ, సీఎండీ కలిసి దీనిపై నివేదికను ఢిల్లీ బోర్డుకు పంపాల్సి ఉంది. అంతలోనే ఆయన రాజీనామా చేశారు.
Sorry, no posts matched your criteria.