India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనాభా సంబంధిత పరిశోధనలో ఏయూ 47 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు కేంద్రం సంచాలకులు ఆచార్య బి.మునిస్వామి తెలిపారు. 1977లో ఏయూలో జనాభా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇటువంటి కేంద్రాలు 18 ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవి నడుస్తున్నాయి. రాష్ట్ర దేశ జనాభా తెలిపే విధంగా డిజిటల్ గడియారాన్ని ఈ కేంద్రం బయట ఏర్పాటు చేశారు.
విశాఖలో <<13598823>>డ్యూక్ బైక్<<>>తో మంగళవారం రాత్రి ఓ యువకుడు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మాధవధార నుంచి వెళుతూ జ్యోతినగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని కంచరపాలెం నుంచి వస్తున్న క్రాంతి బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో త్రినాథరావు అక్కడికక్కడే మృతి చెందగా.. సన్యాసిరావు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వీరిద్దరూ రోజువారి కూలీలే. ఈ ఘటనలో బైకర్కు స్వల్పగాయాలయ్యాయి.
ఉమ్మడి విశాఖ పర్యటనలో భాంగా సీఎం చంద్రబాబు ఈరోజు ఉ. 11 గంటలకు ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం హెలికాప్టర్లో 12 గంటలకు బయలుదేరి భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంతానికి వెళ్తారు. తిరిగి మధ్యాహ్నం1:35కు బయలుదేరి పెదగంట్యాడ మండలం మెడ్టెక్ జోన్కు బయలుదేరుతారు. సాయంత్రం 4:45 నిమిషాలకు ఎయిర్ పోర్టుకు చేరుకుని అధికారులతో సమీక్షిస్తారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాలలో ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, పీజీటీ సోషల్, ఫిజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులను బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీలను నియమిస్తున్నారు. అర్హత ఉన్నవారు గురువారం 10 గంటలకు మేఘాద్రి గెడ్డలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకులంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. పీజీలో 55% మార్కులు, బి.ఈ.డి., టెట్ అర్హత ఉండాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 11న ఎస్.రాయవరం మండలం దార్లపూడిలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. దార్లపూడిలో సీఎం భద్రతా ఏర్పాట్లపై అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ మురళీకృష్ణతో సమీక్షించారు. భద్రత ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించవద్దని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
10వ తరగతి విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచి సూపర్ 50 శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తెలిపారు. విద్యార్థులు సూపర్ 50ని సద్వినియోగం చేసుకుని, 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో సీట్లు సంపాదించాలని సూచించారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులను పండుగలకు ఇంటికి పంపించరని చెప్పారు.
విశాఖ నగర జనాభా 23.85 లక్షలకు చేరింది. గత ఏడాది కంటే 2.32 శాతం వృద్ధి సాధించింది. 2021లో విశాఖ జనాభా 22.26 లక్షలు ఉండగా, 2022లో 22.78 లక్షలు, 2023లో 23.31 లక్షలుగా నమోదయింది. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ఏయూలోని పీ.ఆర్.సీ కేంద్రం సంచాలకులు ఆచార్య బీ.మునిస్వామి వివరాలను వెల్లడించారు. అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాగా.. తక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా విశాఖ నిలుస్తోంది.
విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో 1794 జులై 10న ఆంగ్లేయులు విజయనగరం సంస్థానాధీశులు మధ్య జరిగిన యుద్ధానికి నేటికి 230 ఏళ్లు. ఆ యుద్ధంలో చినవిజయరామరాజుతో పాటు 394 మంది మరణించారు. దీంతో ఆ యుద్ధాన్ని స్కాట్లాండ్ ప్లోడెన్ యుద్ధంతో పోల్చారు. చినవిజయరామరాజును మచిలీపట్నం పంపించడానికి పన్నాగం పన్నగా అతను తన సామంతులతో కలిసి పద్మనాభం వద్ద ఆంగ్లేయులపై యుద్ధం చేసి వీరమరణం పొందారు. అక్కడే ఆయనకు సమాధి నిర్మించారు.
వాల్తేర్ రైల్వే డివిజన్ పుండి-నౌపడ సెక్షన్లో భద్రతపరమైన ఆధునీకరణ పనులు కారణంగా ఈనెల 11,13 తేదీలలో పలు రైళ్ల బయలుదేరే సమయాలు మార్చడంతోపాటు కొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేరు డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 11న, ట్రైన్ నెంబర్ 12830, 22879 గల రైలు 45 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరుతాయి. సంత్రగచ్చి-విశాఖ ఎక్స్ప్రెస్ 6 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులను కోరారు.
నక్కపల్లి ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి టెన్షన్ నెలకొంది. ఆస్పత్రిలోని రోగులకు సిపిటాక్సిం ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్లు వికటించడంతో 23 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ వాంతులై వణుకు మొదలవడంతో రోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది హడలిపోయారు. డా.జయలక్ష్మి సకాలంలో వైద్య సేవలు అందించడంతో 23 మంది రోగులు రికవరీ అయ్యారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Sorry, no posts matched your criteria.