India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికాలోని డల్లాస్లో థామస్ జేఫర్ సన్ పార్కులో ప్రవాసాంధ్రులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సెయిల్ లో స్టీల్ ప్లాంట్ ను విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు తెలుగు వారి గండె చప్పుడుగా పేర్కొన్నారు.
రుషి కొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.
ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సిలింగ్లో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆదివారంతో ముగిశాయి. వెబ్ ఆప్షన్లను సోమవారం నుంచి ఈనెల 12 వరకు ఎంపిక చేసుకోవాలని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ ఆదివారం తెలిపారు. 13న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చన్నారు. 16న సీట్ల కేటాయింపు 17 నుంచి 22 వరకు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు చేయాలన్నారు. 19న క్లాసులు ప్రారంభమవుతాయన్నారు
మాడుగుల మండలం తాచేరు ప్రాంతంలో ఫొటోలు దిగేందుకు వచ్చిన గుర్రం చందుమోహన్, గుబ్బల జ్ఞానేశ్వర్ అనే బావ బామ్మర్దులు నీటిలో మునిగి చనిపోయినట్లు ఎస్సై దామోదర్ నాయుడు తెలిపారు. తాచేరులో రాయిపై చందుమోహన్ నిల్చుని ఫొటో తీసుకుంటూ నీటిలో పడిపోగా.. అతనిని రక్షించేందుకు జ్ఞానేశ్వర్ నీటిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.
రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. హోం మంత్రి ఆదేశాల మేరకు 12 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వ్యసనాలకు బానిసైన సురేశ్.. సైకో మాదిరిగా ప్రవర్తిస్తుంటాడని అతని పరిచయస్థులు తెలిపారు. తాను ఎందుకు హత్యచేశానో బాలిక అన్నయ్యకు ఓ లేఖను రాసి దాన్ని సంఘటనా స్థలం వద్దే ఉంచాడు. నిందితుడు ఫోన్ వాడకపోవడంతో పోలీసులకు సవాల్గా మారింది.
విద్యుత్ బిల్లులు చెల్లింపుల కోసం ఏపీ ఈపీడీసీఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్లో సరికొత్త ఫీచర్లు జత చేసినట్లు సంస్థ సీఎండి పృథ్వీతేజ్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు సర్వీస్కు సంబంధించిన విద్యుత్ వినియోగం, బిల్లు వివరాలు, బిల్లు చెల్లింపు, విద్యుత్ సరఫరా పరిస్థితి వివరాలు తెలుసుకునేలా సరికొత్త ఫీచర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు.
సీతాఫలాల సీజన్ ప్రారంభమైంది. పాడేరు ఘాట్లోని వంట్లమామిడి, 12వమైలురాయి జంక్షన్ వద్ద గిరిజన రైతులు అమ్మకాలను ప్రారంభించారు. పక్వానికి వచ్చిన 10 పండ్ల బుట్టను సైజును బట్టి రూ.150 నుంచి రూ.200కు విక్రయిస్తున్నారు. స్థానికులతో పాటు సందర్శకులు కొనుగోలు చేస్తున్నారు. వంట్లమామిడి, సలుగు, దేవాపురం, మినుములూరు, మోదాపల్లి, వనుగుపల్లి తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో సీతాఫలం తోటలు ఉన్నాయి.
విశాఖ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం ఏపీఎల్ సీజన్-3 మ్యాచ్లో ఉత్తరాంధ్ర లయన్స్- రాయలసీమ కింగ్స్ జట్లు తలబడ్డాయి. ఆరు వికెట్ల తేడాతో రాయలసీమ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత రాయలసీమ కింగ్స్ 17.3 ఓవర్లలో ఆరు వికెట్ల ఆదిక్యంతో 122 పరుగులు చేసి గెలుపొందింది.
విశాఖలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఉడా పార్కు నుంచి సిరిపురంలో గురజాడ కళాక్షేత్రం వరకు ఘనంగా సాగింది. దారిపొడవునా జగన్నాథ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్నాథ స్వామికి 1,008 వంటకాలతో నైవేద్యం సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.
విశాఖలో బ్లూఫ్లాగ్ గుర్తింపునకు మరో బీచ్ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రుషికొండ బీచ్కు గుర్తింపు లభించింది. దీంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తున్నారు. దీంతో సాగర్నగర్ బీచ్ను అధికారులు పరిశీలించారు. అయితే అక్కడ కలుషితమైన వాతావరణం కారణంగా అధికారులు ఆసక్తి చూపలేదు. విశాఖ జూ వద్ద ఉన్న బీచ్ అనుకూలంగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.