India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రతి సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 16వ తారీకు నాడు రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 23వ తేదీన యధావిధిగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆర్జీదారులు కార్యాలయానికి రావద్దని సూచించారు.

సంత్రాగచ్చి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు(07222) ఈరోజు 5 గంటల ఆలస్యంగా ప్రారంభం కానుంది. సంత్రాగచ్చి నుంచి 12:20 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. ఇవాళ సాయంత్రం 05:20 గంటలకు అక్కడ రైలు కదులుతుంది. ఈ ట్రైన్ దువ్వాడ స్టేషన్కు సోమవారం ఉదయం 8:20 గంటలకు చేరుతుంది. లింక్ రైలు ఆలస్యంగా నడుస్తున్నందున ఈ అసౌకర్యం కలిగినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన మానసిక వైద్యుడు సతీశ్ కుమార్పై పీఎం పాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీతమ్మధారకు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ చిన్న కుమార్తె ప్రతి చిన్న విషయానికి భయపడుతోంది. దీంతో మిధిలాపురి వుడా కాలనీలోని సతీశ్ను సంప్రదించారు. ఈ క్రమంలో బాలికలకు క్లాస్ చెబుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో ఈనెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాధారణంగా రైతులు, రైతు బజార్లకు సైతం వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది. విశాఖలోని సీతమ్మధార, కంచరపాలెం, ఎంవీపీ కాలనీ, అక్కయ్యపాలెం నరసింహ నగర్ రైతు బజార్లకు ఇదే తరహాలో సెలవు ఉండేది. దీనిని రద్దు చేస్తూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమకు సెలవు కావాలంటూ రైతులు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు వినతిపత్రం అందజేశారు. సెలవు కొనసాగేలా మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

దుర్గ్-విశాఖ దుర్గ్ మధ్య వందే భారత్ ఈనెల 20 నుంచి నడుస్తుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే పేర్కొంది. విశాఖలో ఈనెల 16 సాయంత్రం 4.15 గంటలకు దీనిని అధికారులు ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవ రోజు రాయగడ వరకు మాత్రమే నడుస్తుంది. 20 నుంచి రెగ్యులర్ రాకపోకలు కొనసాగుతాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ గురువారం మినహా ప్రతిరోజూ నడుస్తుంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి పట్టణ ప్రాంతంలో స్కూటీ బోల్తా పడి యువతి మృతి చెందింది. సెయింట్ ఆన్స్ స్కూల్ స్కూల్ ఎదురుగా జాతీయ రహదారిపై శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో యువతి ధన (25) స్కూటీ అదుపుతప్పడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. గుంతల కారణంగా స్కూటీ అదుపుతప్పిందని, ఈ క్రమంలోనే ధన మృతి చెందినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.

దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ శివారు అనంతగిరి మండలానికి చెందిన సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు. SI టి.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రాకారం విజయనగరం జిల్లా పైడి భీమవరానికి చెందిన లంక సాయికుమార్, ఇండియన్ నేవీ ఉద్యోగి దిలీప్ కుమార్ జలపాతంలో గల్లంతయినట్లు తోటి స్నేహితులు తెలిపినట్లు చెప్పారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై SI విచారణ చేపడుతున్నారు.

విశాఖ కంటైనర్ టెర్మినల్లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్లోని లిథియం బ్యాటరీలు పేలడంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలను ఈనెల 24 నుంచి 27 వరకు విశాఖలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 78వ పురుషులు, మహిళల 17వ ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో ప్రముఖ బాక్సర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.

విశాఖ జిల్లాలోని భీమిలికి చెందిన వైసీపీ నేత నుంచి తనకు ప్రాణహాని ఉందని భీమిలికి చెందిన వెంకటలక్ష్మి శుక్రవారం మంత్రి లోకేశ్కు ఫిర్యాదు చేశారు. అతని వద్ద 2021నుంచి చిట్టీలు కడుతున్నానని, ఇటీవల చిట్టీ డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తమకు సీఎం చంద్రబాబు, లోకేశ్లే న్యాయం చేయాలని ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Sorry, no posts matched your criteria.