Visakhapatnam

News September 9, 2024

వారికి సందేశాలు పంపి అలెర్ట్ చేయాలి: హోం మంత్రి

image

కోస్తాంధ్రలోను అతి భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సమాచరం నేపథ్యంలో రాబోయే 72 గంటలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తడంతో విజయవాడ నుంచి ఆమె విశాఖకు బయలుదేరారు. విపత్తుల నిర్వహణ శాఖను అప్రమత్తం చేశారు. వంశధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలెర్ట్ సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని సూచించారు.

News September 9, 2024

‘తీవ్ర సంక్షోభంలో విశాఖ స్టీల్ ప్లాంట్’

image

తీవ్ర సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. ద్వారక నగర్ పౌర గ్రంథాలయంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితిని వివరించారు. వేతనాలు అందక ప్లాంట్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 9, 2024

ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే: అమర్నాథ్

image

విజయవాడ వరదల్లో మరణాలు ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. ప్రచారం కోసం చంద్రబాబు జేసీబీపై తిరగారని విమర్శించారు. వర్షాలకు అనకాపల్లి జిల్లాలో పంట పొలాలు అన్ని మునిగిపోయాయని అన్నారు. ఒక్క అధికారి జిల్లాలో కనిపించడం లేదన్నారు. కోవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను జగన్ కాపాడినట్లు పేర్కొన్నారు.

News September 9, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 10న రాస్తారోకో

image

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఈనెల 10వ తేదీన కూర్మన్నపాలెంలో రాస్తారోకో నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు, ప్రధాన కార్యదర్శి జీ.కోటేశ్వరరావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. 13 రోజులుగా కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు.

News September 9, 2024

నేడు అరకు-విశాఖపట్నం బస్సులు రద్దు

image

అరకులోయ-విశాఖపట్నం మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను సోమవారం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఘాట్ రోడ్డు బాగా దెబ్బతింది. మట్టి, రాళ్లు రహదారిపైకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బస్సు సర్వీసులు రద్దు చేశారు. ప్రయాణీకులు గమనించాలని సూచించారు.

News September 9, 2024

విశాఖ: రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్

image

విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లలో సంబంధిత రౌడీ షీటర్లకు ఆదివారం సాయంత్రం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హద్దు మీరవద్దని చెప్పారు. గొడవలకు వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించాలని కోరారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.

News September 8, 2024

విశాఖ: తీవ్రవాయుగుండంగా మారనుందా?

image

కళింగపట్నానికి తూర్పున 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణశాఖ అధికారుల తెలిపారు. పూరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల సమీపానికి చేరిన వాయుగుండం చేరిందన్నారు. ఇది దాదాపు వాయవ్యంగానే పయనిస్తూ రేపు ఉదయానికి తీవ్రవాయుగుండంగా మారుతుందని అంచనా వేశారు. వేగంగా పయనిస్తున్నందున రేపు మధ్యాహ్నానికే పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.

News September 8, 2024

ఏయూ అనుబంధ కళాశాలలకు రేపు సెలవు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఈ.ఎన్. ధనుంజయరావు తెలిపారు. రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మరల ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలియజేశారు.

News September 8, 2024

విశాఖ: ‘ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య’

image

ప్రతి లక్ష మందిలో 12 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎన్.ఎన్ రాజు అన్నారు. ఈనెల 12న ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పీఏపీ కార్యదర్శి కామేశ్వరరావు అధ్యక్షతన ఆత్మహత్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆత్మహత్యకు పాల్పడే గుర్తించే అవకాశం యువతకు, కుటుంబ సభ్యులకు ఉంటుందని వెంటనే వారిని కాపాడాలని కోరారు.

News September 8, 2024

విశాఖ జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు

image

ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ఎం.ఎన్. హారేంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో ఎల్.చంద్రకళ తెలిపారు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కాగా.. ఇప్పటికే అల్లూరి జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.