India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేశారన్న వార్తలు అల్లూరి జిల్లాలో కలకలం రేపాయి. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొయ్యూరు మండలంలో కొందరు సచివాలయ ఉద్యోగులు తాము చేయాల్సిన పనిని పాత వాలంటీర్లతో చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎంపీడీవో మేరీ రోజ్ను వివరణ కోరగా.. ఈ ఘటనపై విచారణ చేయిస్తానని చెప్పారు..

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3వ తేదీన రెండు జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ విశాఖ జిల్లా అధికారి సాయి కృష్ణచైతన్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పెదగంట్యాడలోని నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ దగ్గర, విశాఖ జైల్ రోడ్ గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు.

నిండు గర్భిణి 2 కిలో మీటర్లు కష్టపడి నడక సాగించిన దుస్థితి అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసింది. దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ రామన్నపాలేనికి చెందిన గర్భిణి దుంబరి నూకాలమ్మకు ప్రసవ సమయం దగ్గర పడింది. భారీ వర్షాల దృష్ట్యా ఆమెను ముందుగానే ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఈక్రమంలో ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో గర్భిణి కొంతదూరం నడక సాగించాల్సి వచ్చింది.

వాల్తేరు డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు చేశారు. ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం కోసం విశాఖపట్నంలో 0891-2746330, 0891-2744619.. విజయనగరంలో 8712641260, 08922 221202 నెంబర్లతో హెల్ప్డెస్క్లను అందుబాటులోకి తెచ్చారు.

అమెరికాలోని అట్లాంటాలో జరిగిన అందాల పోటీల్లో విశాఖ నగరానికి చెందిన డాక్టర్ తిరుమలిని దాసరి మెరిశారు. మిస్సెస్ ఇండియా యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్నారు. విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాలలో MBBS చదివారు. ప్రస్తుతం అమెరికాలో రుమటాలజిస్ట్గా పనిచేస్తున్నారు. మిస్సెస్ ఇండియా యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్న ఆమెకు సినీ నటి అమీషా పటేల్ టైటిల్ అందజేశారు.

అల్లూరి ఏజెన్సీ పరిధిలో గంజాయి పూర్తిగా నిర్మూలించామని అయితే ఒరిస్సా నుంచి గంజాయి కొనుగోలు చేసి రవాణాకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు అటు ఒరిస్సా ప్రభుత్వానికి ఇటు తమపై అధికారులకు వివరాలు ఇచ్చామని, గంజాయి నిర్మూలించాలంటే ఒరిస్సాలో కూడా ఆంధ్రాలో చేపట్టిన గంజాయి నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

విశాఖ-విజయవాడ-విశాఖ రత్నాచల్ సూపర్ ఫాస్ట్ను 2, 3వ తేదీల్లో రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ వెల్లడించారు. గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్ను ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు.. విశాఖ-గుంటూరు సింహాద్రిని 3 నుంచి 6వ తేదీ వరకు క్యాన్సిల్ చేశామన్నారు. గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ను 2 నుంచి 5 వరకు, రాయగడ-గుంటూరు రైలును 3 నుంచి 6వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.

జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్ తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమాన్ని ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేసినట్లు వివరించారు.

తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రైలు పట్టాలపై వరదనీరు ప్రవహిస్తున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికుల టికెట్లపై నగదు రిఫండ్ చేయడానికి విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే రద్దైన రైళ్లకు సంబంధించి సమాచారాన్ని తెలియజేసేందుకు విశాఖ, విజయవాడలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. 2న నాందేడ్-సంబల్పూర్ నాగవల్లి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ వందే భారత్(20707), విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ (20708) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ (20833), సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ (20834) ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దుచేశామన్నారు.
Sorry, no posts matched your criteria.