Visakhapatnam

News September 1, 2024

CSRతో విద్య‌, వైద్య రంగంలో సేవ‌ల‌ను విస్తృతం చేద్దాం: విశాఖ కలెక్టర్

image

CSR (కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ) నిధుల‌తో జిల్లాలోని విద్య‌, వైద్య రంగ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేద్దామ‌ని విశాఖ కలెక్టర్ పేర్కొన్నారు. దీనికి పారిశ్రామిక‌వేత్త‌లంతా మంచి మ‌న‌సుతో ముందుకు రావాల‌ని, పూర్తి స‌హ‌కారం అందించాల‌ని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ప్ర‌జా అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని నిధులను వెచ్చించాల‌ని సూచించారు. శనివారం వారితో కలెక్టరేట్లో సమావేశం అయ్యారు.

News August 31, 2024

విశాఖ: భారీ వర్షాలపై హోంమంత్రి సమీక్ష

image

భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని కలెక్టర్‌లకు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

News August 31, 2024

విశాఖలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నంబర్‌లు

image

జిల్లాలో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం
➤ ఫోన్లకు ఛార్జింగ్ ఫుల్‌గా పెట్టుకోండి
➤ కూలిపోయే స్థితిలో ఉన్న గోడలు, స్తంభాల దగ్గర ఉండకండి
➤ నదులు, కాలువలను ఎట్టి పరిస్థితుల్లో దాటకండి
➤ రోడ్డుపై వరద నీరు ఉంటే చూసి రాకపోకలు సాగించండి
➤ మ్యాన్ హోళ్ల వద్ద జాగ్రత్తగా ఉండండి
➤ విశాఖ కంట్రోల్ రూమ్ నెం. 1800 4250 0002, అనకాపల్లి 08924 226599

News August 31, 2024

విశాఖ: పింఛన్లను పంపిణీ చేసిన కలెక్టర్

image

విశాఖ నగరంలో శనివారం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్ల పాలెంలో ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు కలెక్టర్ హరీంధర ప్రసాద్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభారాణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News August 31, 2024

అనకాపల్లి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

image

అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ సెలవు ప్రకటించారు. కచ్చితంగా విద్యాసంస్థలు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా సెలవు ప్రకటించామని పేర్కొన్నారు. ఎంఈఓ లు విద్యాసంస్థల మీద పర్యవేక్షణ చేయాలని సూచించారు.

News August 31, 2024

నేడు విశాఖ జిల్లాలోని పాఠశాలలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్ హరీంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SHARE IT.

News August 31, 2024

బలపడిన వాయుగుండం.. భారీ వర్షాలు పడే అవకాశం

image

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మరో 36 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News August 30, 2024

గాజువాకలో చిట్టీల పేరిట మోసం

image

గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద చిట్టీల పేరిట మోసపోయామంటూ సుమారు 200 మంది బాధితులు ఆందోళన చెపట్టారు. వారి వివరాల ప్రకారం.. వాంబే కాలనీకి చెందిన మరడాన.పరుశురాం చిట్టీలు, రియల్ ఎస్టేట్ పేరిట సుమారు రూ.30 కోట్లతో పరారయ్యడని తెలిపారు. పరుశురాం గాజువాక పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ చేస్తుంటానని నమ్మించి తమను మోసం చేశాడని వాపోయారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

News August 30, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాకు ప్రత్యేక అధికారుల నియామకం

image

విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు సీనియర్ IASలను స్పెషల్ ఆఫీసర్స్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖకు హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సౌరభ్ గౌర్‌ను నియమించింది. అల్లూరి జిల్లాకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, అనకాపల్లికి ఇండస్ట్రీస్ డైరెక్టర్ సీహెచ్.శ్రీధర్‌ను నియమించింది.

News August 30, 2024

విశాఖలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

image

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిని కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. సమస్యలపై ప్రజలు అందజేసిన వినతి పత్రాలను స్వీకరించారు. అందర్నీ పలకరించారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.