Visakhapatnam

News July 26, 2024

ఒలింపిక్స్‌లో విశాఖ క్రీడా ‘జ్యోతి’

image

సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డురాదని యర్రాజీ జ్యోతి నిరూపించారు. పేదరికాన్ని పక్కకు నెట్టి పారిస్ ఒలింపిక్స్‌లో 100మీ హర్డిల్స్‌లో పోటీ పడుతున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించారు. 100 మీ. హర్డిల్స్‌లో దేశంలోనే ఫాస్టెస్ట్ ఉమెన్ అథ్లెట్‌గా గుర్తింపు సాధించారు. 40 ఏళ్ల తర్వాత విశాఖ నుంచి ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మన జ్యోతి.. ‘స్వర్ణ జ్యోతి’గా తిరిగి రావాలని ఆశిద్దాం.

News July 26, 2024

ఏయూ: సెప్టెంబర్ 23నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంసీఏ రెండో సెమిస్టర్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ రెండవ సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు తేదీలతో టైం టేబుల్‌ను వెబ్సైట్లో పొందుపరిచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

News July 26, 2024

ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన‌లో కొత్త కోర్సులు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం నుంచి ఈ సంవత్సరం బీఈడి, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్, బీకాం కంప్యూటర్ సైన్స్, బిబిఏ, ఎం.ఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ ప్రారంభిస్తున్నట్లు ఇన్ ఛార్జ్ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. దూరవిద్యలో 75 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని వీరి సంఖ్యను లక్షకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

News July 26, 2024

చెన్నై-సంత్రాగచ్చి మధ్య అన్ రిజర్వడ్ ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై సెంట్రల్, సంత్రాగచ్చి మధ్య ఒక వైపు అన్ రిజర్వడ్ ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీని యర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి (02842) అన్ రిజర్వడ్ ప్రత్యేక రైలు ఈనెల 25 తేదీ రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి తరువాత నేటి మధ్యాహ్నం 1.54 గంటలకు దువ్వాడ వచ్చి.. 1.59 గంటలకు వెళుతుందని తెలిపారు.

News July 26, 2024

ఒలింపిక్స్‌లో విశాఖ క్రీడా ‘జ్యోతి’

image

సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డురాదని యర్రాజీ జ్యోతి నిరూపించారు. పేదరికాన్ని పక్కకు నెట్టి పారిస్ ఒలింపిక్స్‌లో 100మీ హర్డిల్స్‌లో పోటీ పడుతున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించారు. 100 మీ. హర్డిల్స్‌లో దేశంలోనే ఫాస్టెస్ట్ ఉమెన్ అథ్లెట్‌గా గుర్తింపు సాధించారు. 40 ఏళ్ల తర్వాత విశాఖ నుంచి ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మన జ్యోతి.. ‘స్వర్ణ జ్యోతి’గా తిరిగి రావాలని ఆశిద్దాం.

News July 26, 2024

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల గడువు పెంపు

image

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు సీతారాం తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల బాలలకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో వచ్చే ఏడాది జనవరి 26న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేస్తారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, సాహస క్రీడలు, పర్యావరణం, కళలు రంగాల్లో ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 26, 2024

ఏయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజీనామా

image

ఆంధ్ర యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి మహమ్మద్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఆయన విధులకు దూరంగా ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఏయూ రిజిస్టార్ ‌కు తన రాజీనామా లేఖ అందించి ఆయన వెళ్లిపోయినట్లు ఏయూ వర్గాలు తెలిపాయి. మూడు సంవత్సరాల క్రితం నియమితులైన ఆయన ఏయూ భద్రత పటిష్ఠం చేయడంతో పాటు పలు వివాదాలకు కూడా కేంద్రంగా మారారు.

News July 26, 2024

నేడు రైతు బజార్‌లో టమాటా ధర కిలో రూ.38

image

విశాఖలోని అన్ని రైతు బజార్‌లలో కిలో టమాటాను రూ.38 చొప్పున శుక్రవారం అందుబాటులో ఉంటుందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ వారి ద్వారా రైతుబజార్‌లలో రాయితీ ధరలకే విక్రయించనున్నట్టు వెల్లడించారు. ఈరోజు ధర రూ.48, బుధవారం రూ.54, మంగళవారం రూ.61, సోమవారం రూ.58 గా విక్రయాలు జరిగాయి.

News July 25, 2024

విశాఖ: గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం పర్యాటకశాఖ, గృహ నిర్మాణ సంస్థ అధికారులతో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలు చేపట్టనున్న కార్యక్రమాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రగతి సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు వారికి అందజేశారు.

News July 25, 2024

స్థలం కేటాయించాకే రైల్వే జోన్ పనులు: కేంద్రమంత్రి

image

విశాఖలో జీవీఎంసీ అధికారులు తగిన స్థలం కేటాయించిన తరువాతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. 2024-25 రైల్వే బడ్జెట్‌కు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. విశాఖ జిల్లా అధికారుల వల్లే జోన్ పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ఈ బడ్జెట్‌లో తూర్పు కోస్తా రైల్వే జోన్ ఉన్న ఒడిశా రాష్ట్రానికి రూ.10,586 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.