India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొంతమంది పోలీసు అధికారులు YCP ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేశారని <<13455722>>హోం మంత్రి<<>> అనిత విమర్శించారు. వారిలో ఇప్పటికీ వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమన్న ఆమె.. సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అత్యధిక మెజార్టీతో గెలిచి అందరినీ ఆకర్షించిన గాజువాక MLA పల్లా శ్రీనివాసరావు ఇకపై ఏపీ TDP బాధ్యతలు మోయనున్నారు. YCP ప్రభుత్వంలో అనేక కేసులు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎదురొడ్డి నిలిచారు. పార్టీ మారాలని ఒత్తిడి వచ్చినప్పటికీ TDPలోనే కొనసాగి విధేయతను చాటుకున్నారు. 7రోజులు ఆమరణదీక్ష చేసి స్టీల్ప్లాంట్ ఉద్యమానికి ఊపు తెచ్చిన పల్లా.. గాజువాక హౌస్ కమిటీ భూములు, అగనంపూడి టోల్ గేట్ సమస్యపై పోరాడారు.
జగన్ ప్రభుత్వం రుషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలపై దుష్ప్రచారం తగదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవసరాల కోసం జగన్ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిందని వివరించారు. ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా టీడీపీ నాయకుల ప్రచారం చేయడం తగదన్నారు. నగరానికి ప్రముఖులు వచ్చినప్పుడు ఆ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు.
నాగచైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా షూటింగ్ ఉమ్మడి విశాఖలో జరుగుతోంది. ఆదివారం ఉదయం తంతడి-వాడపాలెం వద్ద సాంగ్ షూట్ చెయ్యగా.. మధ్యాహ్నం కొండకర్ల ఆవ వద్ద చేపల వేట, హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని సీన్లు తీశారు. షూటింగ్ చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షూటింగ్ విరామంలో నాగచైతన్య, సాయిపల్లవి 30 నిమిషాల పాటు దివ్యాంగులతో ముచ్చటించారు.
విశాఖ వేదికగా రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రుషికొండ భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, జనసేన ఇన్ ఛార్జ్ పంచకర్ల సందీప్ స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులతో ఆదివారం సందర్శించారు. ఆ భవనాల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రజా ధనాన్ని వృథా చేసి జగన్ రాజభవనాలు కట్టుకున్నారని టీడీపీ ఆరోపించగా.. అవి ప్రభుత్వ భవనాలే అని వైసీపీ తేల్చి చెబుతోంది. మరి ఈ వివాదంపై మీ కామెంట్
విశాఖ-సంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డిసిఎం కే సందీప్ తెలిపారు. విశాఖ-సంత్రగచ్చి స్పెషల్ ఈనెల 19, 21, 26, 28 తేదీల్లో విశాఖలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సంత్రగచ్చి చేరుకుంటుందన్నారు. అలాగే సంత్రగచ్చి-విశాఖ స్పెషల్ ఈనెల 20, 22, 27, 29 తేదీల్లో సంత్రగచ్చిలో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం విశాఖ చేరుకుంటుందన్నారు.
పారా స్పోర్ట్సు అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఈనెల 30న నగరంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ పారా (దివ్యాంగుల) అథ్లెటిక్స్ మీట్ నిర్వహించనున్నట్టు సంఘ కార్యదర్శి రామస్వామి తెలిపారు. రన్నింగ్ , త్రోస్ , జంప్ ఈవెంట్లలో ప్రతిభ కనబరిచిన అథ్లెట్లను జూలై 15 నుంచి జరిగే జాతీయ పారా అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని ఆసక్తి గలవారు ఈనెల 25లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
సరుకు రవాణాలో ఏపీఎస్ఆర్టీసీ జోన్-1 మొదటి స్థానంలో కొనసాగుతుంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. సరుకు రవాణా ద్వారా ఈ జోన్ గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 15వ తేదీ వరకు రూ.4.72 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ ఏడాది అదే కాలానికి 4.96 కోట్లు ఆర్జించినట్లు విశాఖ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బీ.అప్పలనాయుడు తెలిపారు.
ఏయూ వైస్ ఛాన్స్లర్ పీ.వీ.జీ.డీ ప్రసాదరెడ్డికి శనివారం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు విశాఖలోని మూడో పట్టణ పోలీసుస్టేషన్తో రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ ఫిర్యాదు ఆదివారం చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి వీసీకి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని లేకుంటే ఇబ్బంది తప్పదని.. ఇక నుంచి నీ ఆటలు కొనసాగవంటూ బెదిరించినట్లు తెలిపారు. బెదిరించిన వ్యక్తికి పోలీసులు ఫోన్ చేసినట్లు సమాచారం.
విశాఖపట్నం జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు భర్తీకి ఆన్లైన్లో అప్లై చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్లను https://mjpapbcwreis.apcfss.inలో డౌన్లోడ్ చేసుకోవాలని విశాఖ జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ దాసరి సత్యారావు సూచించారు.
Sorry, no posts matched your criteria.