Visakhapatnam

News June 16, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే

image

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పల్లా శ్రీనివాసరావు యాదవ్ టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడుగా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

News June 16, 2024

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు: గణబాబు

image

వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు టచ్‌లో ఉన్న మాట వాస్తవమే కానీ.. వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆదివారం స్పష్టం చేశారు. అద్భుతమైన పాలనను ఆంధ్ర ప్రజలు చూస్తారని ఆయన పేర్కొన్నారు. మాటల ప్రభుత్వం కాదు.. చేతల ద్వారా చూపించేది కూటమి ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని అన్నారు.

News June 16, 2024

మీరు అర్థం చేసుకోరు: ఎస్కేఎన్

image

రుషికొండపై జరిగిన విధ్వంసం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని భీమిలి జనసేన ఇన్‌ఛార్జ్ చేసిన ట్వీట్‌కు నిర్మాత ఎస్కేఎన్ రిప్లై ఇచ్చారు. ‘టూరిజం డెవలప్ చెయ్యడానికో, పాన్ ఇండియా సినిమా షూటింగ్‌ల కోసమో ఇవి కట్టి ఉంటారు సందీప్. వాటిని లీజు, అద్దెలకు ఇస్తే వచ్చే ఆదాయం ద్వారా ఏపీని డెవలప్ చెయ్యాలని ప్లాన్ చేసుంటారు.. అర్థం చేసుకోరు’ అని స్మైలీ ఎమోజీని జోడించారు.

News June 16, 2024

విశాఖలో ప్రశాంతంగా యూపీఏస్సీ ప్రిలిమినరీ పరీక్ష

image

విశాఖ నగర పరిధిలో 26 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన యూపీఏస్సీ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9,735 మంది హాజరు కావలసి ఉండగా, 4,677 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున వి.ఎస్.కృష్ణ కళాశాల, గాయత్రి కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.

News June 16, 2024

యువకుడిని కాపాడిన విశాఖ పోలీసులు

image

విశాఖ అప్పుఘర్ బీచ్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న యువకుడిని ఎంవీపీ పోలీసులు కాపాడారు. భీమిలి మండలం ఉప్పాడకు చెందిన 30 ఏళ్ళ యువకుడు కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన పోలీసులు యువకుడిని కాపాడి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అతనిని అప్పగించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

News June 16, 2024

ఈనెల 18న సింహాద్రి అప్పన్న సోదరి ఉత్సవం

image

సింహగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోదరి పైడితల్లమ్మ ఉత్సవం మంగళవారం (18 వతేదీన) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే సింహాద్రి అప్పన్న దర్శనానికి అవకాశం లభిస్తుందని ఈవో శ్రీనివాసమూర్తి వెల్లడించారు. బుధవారం యథావిధిగా ఉదయం ఆరున్నర గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించినట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలని కోరారు.

News June 16, 2024

రుషికొండపై పచ్చని రిసార్ట్స్ తొలగించి విలాస భవనం కట్టారు: గంటా

image

ప్రకృతి అందానికి నిలయమైన రుషికొండపై చెట్లను తొలగించడంతో పాటు రిసార్ట్స్ నేలమట్టం చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆదివారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జగన్ ఎంతో ముచ్చటగా కట్టుకున్న ఈ భవనంలోకి రాకుండా ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

News June 16, 2024

హోంమినిస్టర్‌కు గౌరవ వందనం సమర్పించిన పోలీసులు

image

నక్కపల్లిలో హోంమినిస్టర్ వంగలపూడి అనిత ఇంటి వద్ద పోలీసులు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.

News June 16, 2024

మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం: హోంమంత్రి అనిత

image

మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ పాలనలో స్త్రీలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం బాగా పెరిగాయన్నారు. భూకబ్జాలు, దాడులకు హద్దులేకుండా పోయిందని ఆరోపించారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వంలో సరిదిద్దుతానన్నారు. ఆడపిల్లలు కిడ్నాప్‌కు గురికాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడతామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.

News June 16, 2024

విశాఖ: పాప్‌కార్న్ కోసం వెళ్లిన చిన్నారి మృతి

image

పాప్ కార్న్ కొనేందుకు వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారింది. కంచరపాలెం జాషువా నగర్‌లో ఉంటున్న బీ.సురేశ్, శృతి దంపతులకు పూజిత (9) ఒక్కగానొక్క కూతురు. దీంతో వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి పాప్‌కార్న్ కోసం అని తండ్రి బైక్‌పై మార్కెట్‌కు వెళ్తుండాగా జరిగిన ప్రమాదంలో పూజిత మృతిచెందింది. చిన్నారిని తలుచుకుంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.