India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఈనెల 16వ తేదీన రెండో సెషన్లలో జరిగే యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమన్వయం పరీక్ష విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలోని 26 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో జూలై 1 నుంచి పలు రైళ్లకు నెంబర్లను మారుస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ-కడప తిరుమల ఎక్స్ ప్రెస్కు 18521, రిటర్న్ ట్రైన్కు 18522 నంబర్లను కొత్తగా కేటాయించామన్నారు. విశాఖ-బెనారస్ వీక్లీ ట్రైన్కు18523, రిటర్న్ ట్రైన్కు 18524, విశాఖ-కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్కు 18527, రిటర్న్ ట్రైన్కు 18528 నెంబర్లు కేటాయించినట్లు వెల్లడించారు.
పర్యాటకులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా ఆధునిక హంగులతో కైలాసగిరిపై I LOVE కైలాసగిరి పేరుతో నూతనంగా వ్యూ పాయింట్ నిర్మించారు. పెద్దపెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన బోర్డులను విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బుధవారం ప్రారంభించారు. రాత్రి వేళల్లో వెలుగులు వచ్చేలా విద్యుత్ దీపాలను కూడా అమర్చారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఉన్న ఐ లవ్ వైజాగ్ బోర్డులు మాదిరిగానే నూతనంగా దీనిని నిర్మించారు.
పాడేరు ఘాట్ రోడ్ 12 మైళ్ళ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. పాడేరు మోదకొండమ్మ జాతరకు సౌండ్, లైటింగ్ సిస్టమ్స్ తెచ్చి తిరిగి వైజాగ్ వెళుతుండగా డీసీఎం లారీ బ్రేకులు ఫెయిలై లోయలోకి దూసుకుపోయింది. లారీలో ఉన్న 11 మంది ప్రమాదానికి గురయ్యారు. వారిలో కనిపించిన ఆరుగురిని పాడేరు ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురు లోయలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్ర శాసనసభలో బీజేపీ శాసనసభ పక్ష నేతగా విష్ణుకుమార్ రాజును ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విష్ణుకుమార్ రాజు గతంలోనూ శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు. బుధవారం సాయంత్రం విజయవాడలో జరుగుతున్న బీజేపీ నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ సబ్జెక్టులలో తప్పిన విద్యార్థుల కోసం నిర్వహించే స్పెషల్ ఎగ్జామినేషన్స్ జూలై 13 నుంచి ప్రారంభం కానున్నాయని డిప్యూటీ రిజిస్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరిగే తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.
ప్రజలు చాప కింద నీరులా చేసిన విప్లవం వలనే కూటమి భారీ విజయం సాధించిందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అహకారానికి , అభివృద్ధికి జరిగిన యుద్ధంలో అభివృద్ధే గెలిచిందన్నారు. రాక్షస పాలన పోయిందని ఆంధ్ర ప్రజలు ఊరిపి పీల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏ శాఖ ఇచ్చినా తన మార్కు ఉండే విధంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబు, ఎన్డీఏ మార్కు పాలన చేస్తానని వెల్లడించారు.
మంత్రి వంగలపూడి అనితకు కేటాయించే శాఖపై ఆసక్తి నెలకొంది. అధికార పక్షంతోపాటు ప్రతిపక్ష నేతలు సైతం ఆమెకు కేటాయించే శాఖపై చర్చించుకుంటున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయించే అవకాశాలున్నాయని పలువురు భావిస్తుండగా.. ఆమె టీచర్గా పనిచేసిన కారణంగా విద్యాశాఖతో పాటు హోంశాఖ అయినా అప్పగించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఆమెకు ఏ శాఖ కేటాయిస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న బీఎస్సీ- ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 26వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ.నాయుడు తెలిపారు. ఈనెల 28వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు జరుపుతామని తెలిపారు. ఇంటర్ విద్యార్హత కలిగిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఏ.యూ వెబ్ సైట్లో సంప్రదించాలన్నారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అనితతో పదవీ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపైన ఉన్న పెద్దలకు అనిత నమస్కరించారు.
Sorry, no posts matched your criteria.