India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో ప్రశాంతతను తిరిగి నెలకొల్పుతామని MP శ్రీభరత్ హామీ ఇచ్చారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన ఆయన.. ముందుగా తన తాత ఎం.వీ.వీ.ఎస్ మూర్తికి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తప్పు చేసిన YCP నాయకులు, కార్యకర్తలపై చట్టప్రకారం చర్యలుంటాయన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో మొన్నటి ఎన్నికల్లో YCP నాయకులు, కార్యకర్తలు చూశారని అన్నారు.
అనంతగిరి మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు పర్యాటకులు పోటెత్తారు. శనివారం మూడు వేల మంది బొర్రాగుహలను సందర్శించగా రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. ఆదివారం నాలుగు వేల మంది బొర్రా గుహలను సందర్శించగా రూ.3.91 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. అలాగే బొర్రా జిఫ్ లైన్కు సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం రూ.1.16 లక్షల ఆదాయం వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఓ వ్యక్తికి బైక్పై లిఫ్ట్ ఇచ్చి దోచుకొని.. దాడిచేసిన ఘటన ఆదివారం జరిగింది. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలానికి చెందిన జవ్వాది శ్రీను(32) దేవరాపల్లిలోని అత్తారింటికి శనివారం రాత్రి బయలుదేరాడు. వావిలపాడు నుంచి దేవరాపల్లికి వెళ్తూ, దారిలో బైక్పై వస్తున్న వారిని లిఫ్ట్ అడిగాడు. వారు శారదానది వంతెనపై బైక్ ఆపి చాకు చూపిస్తూ పర్సు, సెల్ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. శ్రీను సెల్ఫోన్ ఇవ్వకపోవడంతో దాడిచేశారు.
విశాఖలోని కంచరపాలెం పరిధిలో దారుణ ఘటన చోటచేసుకుంది. సోమవారం ఉదయం కొంతమంది దుండగులు అదే ప్రాంతానికి చెందిన ఉదయ్( 20)పై కత్తితో మెడపై దాడి చేశారు. దీంతో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
.
విశాఖ పోర్ట్ అథారిటీ నగరవ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కాలుష్య నివారణకు విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. రూ.15 కోట్లతో పోర్టుకు చెందిన 186 ఎకరాల్లో మొక్కలు పెంచుతామన్నారు.
గాజువాకలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో రోలుగుంట ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచర్ పీవీఎం.నాగజ్యోతి 3 బంగారు పతకాలు సాధించారు. పవర్ లిఫ్టింగ్లోని మూడు విభాగాలలో బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్, స్క్వేట్ పాల్గొని మూడింటిలోనూ బంగారు పతకాలు సాధించారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు.
ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న ఆమె గతంలో అంతర్జాతీయ, జాతీయ మెడల్స్ సాధించారు.
సముద్రంలో చేపల వేటపై నిషేధం గడువు ముగుస్తున్న నేపాథ్యంలో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి వేటకు మత్స్యకారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తూర్పు తీరంలో విశాఖ చేపల రేవు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ 700 మరపడవలు, మరో వెయ్యి వరకు ఇంజిన్ పడవలు ఉన్నాయి. మత్స్య పరిశ్రమపై ప్రత్యక్షంగా 15,000 మంది పరోక్షంగా 10వేల మంది ఆధారపడి ఉన్నారు. వేట ప్రారంభించే ముందు ఈనెల 11న గంగాదేవి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్లో ఇగ్వానాలు సందర్శకులను అలరిస్తున్నాయి. పెద్దబల్లి జాతికి చెందిన ఇగ్వానాలు వయసు పెరిగే కొద్దీ వాటి రంగులు మారిపోతుంటాయి. పిల్లలగా ఉన్నప్పుడు కొంతవరకు ఆకుపచ్చని రంగులో కనిపిస్తాయి. పెరిగేకొద్ది బూడిద రంగులోకి మారుతాయి. అవి వివిధ రకాల పండ్లతో పాటు మెత్తని మట్టి తింటాయి. ప్రస్తుతం జూలో పిల్లలతో పాటు పెద్దవి 50 వరకు ఉన్నాయి.
గన్నవరం మండలం కేసరపల్లి IT పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ట్రాఫిక్పై ఆంక్షలు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి మీదుగా విశాఖ చేరుకుంటాయి.
పాడేరులో ఆదివారం నుంచి జరుగుతున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరలో ఐఏఎస్ అధికారులు సందడి చేస్తున్నారు. ఉదయం జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత భక్తులతో కలిసి స్వయంగా ఘటాలను ఊరేగింపుగా శతకం పట్టుకు తరలించారు. ఆదివారం రాత్రి జాయింట్ కలెక్టర్ భావన వశిస్ట్, ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తదితరులు జాతరలో సందడి చేశారు. జాతరలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జెయింట్ వీల్, ట్రైన్ ఎక్కి సందడి చేశారు.
Sorry, no posts matched your criteria.