Visakhapatnam

News May 9, 2024

విశాఖ: ఏడాదిలో ఒక్కరోజే నిజరూప దర్శనం

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనం ఏడాదిలో ఒక్కరోజే లభిస్తుంది. నిజరూపంలో స్వామిని దర్శించుకునేందుకు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం వేకువజామున వెండి బొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప భరితుడిని చేస్తారన్నారు. తర్వాత పరిమిత సంఖ్యలో మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించి మిగిలిన వారికి నీలాద్రి గుమ్మం నుంచి లఘు దర్శనం కల్పిస్తారు.

News May 9, 2024

విశాఖలో సినీ పాలిటిక్స్..!

image

విశాఖలో అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రచారాలకు సినీ గ్లామర్‌ తోడవుతుంది. అనకాపల్లి BJP ఎంపీ అభ్యర్థి CM రమేశ్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్లకి చిరంజీవి ఇప్పటికే మద్ధతివ్వగా.. NDA అభ్యర్థుల తరఫున జానీమాస్టర్, జబర్దస్త్, బుల్లితెర నటులు ప్రచారం చేస్తున్నారు. అటు వైసీపీ తరఫున భీమిలిలో అవంతి, నర్సీపట్నంలో గణేశ్‌కు మద్ధతుగా యాంకర్ శ్యామలా, హీరో సాయిరాం శంకర్ ప్రచారం చేస్తున్నారు.

News May 9, 2024

నిజరూప దర్శనం మొదట ఆ కుటుంబ సభ్యులకే

image

రేపు జరిగే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనాన్ని మొదటిగా అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులైన విజయనగరం గజపతిరాజులకే కల్పిస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులతో పాటు న్యాయమూర్తులు, పట్టు వస్త్రాలు సమర్పించే దేవాదాయ శాఖ అధికారులకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం మూడు నాలుగు గంటల మధ్య సేవకులు, విభిన్న ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తారు.

News May 9, 2024

దువ్వాడ మీదుగా ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-ఖుర్దా రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం కె.సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-ఖుర్దా రోడ్డు మధ్య ఈనెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి దువ్వాడ మీదుగా ఖుర్దా రోడ్డు చేరుకుంటుందన్నారు. 11వ తేదీ రాత్రి 7.17 గంటలకు ఖుర్దా రోడ్డులో బయలుదేరి దువ్వాడ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.

News May 9, 2024

స్టీల్ ప్లాంట్ రక్షణలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలి: సీఎండీ

image

సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కోక్ ఓవెన్ బ్యాటరీల రక్షణ విషయంలో కలెక్టర్ మల్లికార్జున జోక్యం చేసుకోవాలని బుధవారం స్టీల్ ప్లాంట్ సీఎండీ భట్ విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ కు బొగ్గు రవాణా చేయాలని జారీ చేసిన హైకోర్టు ఆదేశాలు అమలుకు నోచుకోలేదన్నారు. గంగవరం పోర్ట్ యజమాన్యం బొగ్గు రవాణాకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారు. బొగ్గు అందుబాటులో లేక ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు.

News May 9, 2024

విశాఖలో నేడు చంద్రబాబు బహిరంగ సభ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గురువారం విశాఖ నగరానికి వస్తున్నారు. విశాఖ దక్షిణ ఉత్తర నియోజకవర్గాలకు సంబంధించి సీతంపేట జంక్షన్‌లో జరిగే సభలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జి తెలిపారు. సాయంత్రం 6:30 గంటలకు సభ ప్రారంభం అవుతుందన్నారు. మొదట పేర్కొన్నట్లుగా రోడ్ షో ఉండదన్నారు. రాత్రికి చంద్రబాబు పార్టీ కార్యాలయ ఆవరణలో బస్సులో బస చేస్తారని వెల్లడించారు.

News May 9, 2024

సింహాచలంలో రేపే సింహాద్రి అప్పన్న చందనోత్సవం

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరగనున్న సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత సింహగిరి పైకి భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. రూ.300, రూ.1000, రూ.1500 టికెట్లు తీసుకున్నవారికి దర్శన సమయాల స్లాట్లు కేటాయించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో ఈసారి ప్రోటోకాల్ దర్శనాలు లేవు.

News May 9, 2024

విశాఖలో హీరో శ్రీకాంత్ కారు తనిఖీ

image

సినీనటుడు శ్రీకాంత్ కారులో వస్తుండగా మర్రిపాలెం టోల్‌గేట్ వద్ద ఆయన కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. ఆయన పూరి నుంచి హైదరాబాద్ వెళుతుండగా నిబంధనల ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి షేక్ బాబూరావు ఇతర సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. అన్నీ సక్రమంగా ఉండడంతో విడిచిపెట్టేశారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తాను కారులో వస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. 

News May 9, 2024

చందనోత్సవంలో సామాన్య భక్తులకు పెద్దపీట: విశాఖ కలెక్టర్

image

సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది చందనోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా ఏ.మల్లికార్జున పేర్కొన్నారు. అంతరాలయ దర్శనాలు ఉండవని తేల్చిచెప్పారు. ఎలాంటి రాజకీయపరమైన ప్రోటోకాల్ కూడా ఉండబోదని స్పష్టం చేశారు. పోలీసు కమిషనర్ డా ఏ రవిశంకర్‌తో కలిసి స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.

News May 9, 2024

ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు అప్రమత్తంగా వ్యవహరించాలి: విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున అన్నారు ఎన్నికల సన్నద్ధత సమావేశంలో భాగంగా ఆయన బుధవారం కలెక్టరేట్ సమావేశంలో ఆర్వోలతో సమావేశం అయ్యారు. సెక్టోరల్, రూట్ అధికారులతో సమన్వయం వహించాలని పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించాలని, ఈవీఎంల తరలింపు అంశాలపై సూచనలు చేశారు.