India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదగిరి పెండ్రీ అనే వ్యక్తి ఎసెన్షియా కంపెనీనీ తొలిసారి 2007లో అమెరికాలో స్థాపించారు. తర్వాత హైదరాబాద్, విశాఖపట్నానికి ఆ కంపెనీ విస్తరించింది. అచ్యుతాపురం సెజ్లో ఈ కంపెనీ 2016లో రిజిస్టర్ అయ్యింది. 2019 నుంచి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వివిధ రకాల సిరప్లతో పాటు కొత్ మెడిసిన్ కోసం ప్రయోగాలు చేస్తుంటారు. కాగా ప్రస్తుతం పెండ్రీ అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.
అచ్యుతాపురం దుర్ఘటనలో ఒక్కొక్కరదీ ఒక్కో విషాద గాథ. అచ్యుతాపురం(M) మోటూరుపాలేనికి చెందిన పూడి మోహన్(20), నానిబాబు అన్నదమ్ములు. రోజువారీ కూలీలుగా ఎసెన్షియా కంపెనీలో పనిచేస్తున్నారు. తమ్మడు నాని బాబు ఏ షిప్ట్ కావడంతో 2 గంటలకు డ్యూటీ దిగాడు. అదే సమయంలో మోహన్.. నానిని పలకరించి డ్యూటీ ఎక్కాడు. తర్వాత అరగంటలోనే మోహన్ చనిపోవడంతో నాని బోరున విలపించాడు. మరోవైపు కార్మికుల బంధువులు పరిశ్రమ బయట రోదించారు.
అచ్యుతాపురం ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో మొత్తం 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అందులో మొదటి అంతస్తు శిథిలాల కిందే 9 మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీటిని బయటకు తీయడానికి సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మృతుల్లో ఎక్కువమంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే ఉండటంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
అనకాపల్లి జిల్లాలో ప్రసూతి మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గత ఆరు నెలలుగా జరిగిన మాతృ మరణాలపై ఆరా తీశారు. తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై ఆమె సమీక్షించారు. రక్తపోటు, రక్తహీనత వంటి సాధారణ పరీక్షలతో పాటు డెలివరీకి వచ్చిన ప్రతి గర్భిణీకి జ్వర పరీక్షలు నిర్వహించాలన్నారు.
అచ్యుతాపురం ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 18మంది చనిపోయారని అధికారులు ఆయనకు వివరించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని సీఎం అన్నారు.
అచ్యుతాపురం ఫార్మాసిటీ ప్రమాదం నేపథ్యంలో హోంమంత్రి అనిత విజయవాడ నుంచి హుటాహుటిన అచ్యుతాపురం బయలుదేరారు. ఘటన తెలిసిన వెంటనే అధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడారు. బుధవారం రాత్రి ఇక్కడికి చేరుకొని ఫార్మా కంపెనీ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
అచ్యుతాపురం ఫార్మా ఘటనలో మనసును కలిచి వేసే దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. రియాక్టర్ పేలుడు ధాటికి కొందరు కార్మికుల శరీర అవయవాలు ముక్కలుముక్కలయ్యాయి. కనీసం మృతదేహాలను గుర్తించే స్థాయిలో కూడా లేకపోవడం ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. ఫార్మాసిటీ సమీపంలోని ముళ్ల పొదల్లో మాంసం ముద్దలు పడి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు శాసనమండలలో విపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, అధినేత జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బొత్సాకు మూడు సభలో ప్రాతినిత్యం వహించే అవకాశం దక్కింది.
అచ్యుతాపురం సెజ్ ఘటనలో గాయపడిన వారిని అనకాపల్లికి సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గాయపడిన వారిని బస్సులో తరలిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సగం కాలిన శరీర భాగాలతో ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వారి ఫొటోలు కంటితడి పెట్టిస్తున్నాయి.
అచ్యుతాపురం ఫార్మా సెజ్లో రియాక్టర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సెజ్ లోని అగ్నిమాపక యంత్రంతో పాటు 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. రియాక్టర్ పేలుడు ధాటికి మొదటి అంతస్తు శ్లాబు కూలిపోగా, శిథిలాల కింద ఉన్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 16మంది కార్మికులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.