Visakhapatnam

News March 20, 2024

విశాఖ: శాంతిని పెంపొందించడమే విన్యాసాల లక్ష్యం

image

భారత్ అమెరికా దేశాల మధ్య భాగస్వామ్యానికి అనుగుణంగా విశాఖ తూర్పు నౌకాదళం పరిధిలో నౌకా దళం,వాయుసేన విన్యాసాలు ప్రారంభమైనట్లు అమెరికా రాయబారి ఎరిక్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ తెలిపారు. మంగళవారం లాంచనంగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు విన్యాసాలు కొనసాగుతున్నారు. ఇది దేశాలకు చెందిన 3000 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

News March 20, 2024

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలు

image

జగన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలదని మంత్రి, గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక వడ్లపూడిలో ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజేపీ సిద్ధపడిందని, అలాంటి పార్టీతో టీడీపీ, జనసేన చేతులు కలిపాయన్నారు. వైసీపీకి ఓటు వేసి కూటమికి బుద్ధి చెప్పాలన్నారు.

News March 20, 2024

యలమంచిలి: ట్రాక్టర్‌ని ఢీకొన్న బస్సు.. వ్యక్తి మృతి

image

యలమంచిలి మండలం పులపర్తి హైవే జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం వొమ్మవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షేక్ మీరా సాహెబ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు.

News March 20, 2024

విశాఖ: ‘అసలు ఎవరి పక్కన ఉన్నారో త్వరలో తెలుస్తుంది’

image

రాష్ట్ర ప్రజలు ఎవరి పక్కన ఉన్నారో త్వరలో తెలుస్తుందని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. అనకాపల్లి ఎంపీ సీటు ప్రకటించేందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఈనెల 27 నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నమ్మినవారు తమ పార్టీలోకి వస్తున్నట్లు తెలిపారు.

News March 20, 2024

విశాఖ: ‘ఎంపీ రూ.500 కోట్ల భూముల ఆక్రమణ’

image

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నగరంలో రూ.500కోట్ల విలువైన క్రైస్తవ భూములను ఆక్రమించినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. విశాఖ నగరం ప్రజాశాంతి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆయనపై కేసు వేసి జైలుకు పంపిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

News March 20, 2024

కొమ్మాది: కళాశాలలో అమెరికా రాయబారి సందడి

image

అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, ఆ దేశ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మంగళవారం వసతిగృహ విద్యార్థినులతో సందడి చేశారు. సంచయిత గజపతిరాజు ఆధ్వర్యంలో పరదేశిపాలెం సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన సుజలధార, హరిత బయో టాయ్‌లెట్లను  ప్రారంభించారు. అంతకు ముందు గిరిజన విద్యార్థినులంతా థింసా నృత్యంతో స్వాగతం పలికారు.

News March 20, 2024

విశాఖకు చేరుకున్న ఐపీఎల్ జట్ల ప్రతినిధులు

image

విశాఖ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 31న జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌కు జట్ల ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌరభ్‌ గంగూలి, డేవిడ్‌ వార్నర్, షఫాలీ వర్మ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లారు. సాయంత్రం ఏసీఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

News March 20, 2024

సముద్ర దొంగల ఆట కట్టించేందుకు వ్యూహాత్మక అడుగులు: యూఎస్ రాయబారి

image

సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని భారత్‌–యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు. ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ తూర్పు నావికాదళ ప్రధాన కార్యలయానికి వచ్చిన ఆయన ఐఎన్‌ఎస్‌ జలశ్వ యుద్ధ నౌకలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు.

News March 20, 2024

విశాఖ: ‘ప్రభుత్వ భవనాలపై ప్రకటనలకు అనుమతి లేదు’

image

ప్రభుత్వ భవనాలు ప్రాంగణాల ఆవరణలో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు తీసుకున్నట్లు తెలిపారు.

News March 19, 2024

వైజాగ్ అందాలు అద్భుతం: యూఎస్ రాయబారి

image

టైగర్‌ ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ వచ్చిన భారత్‌లో యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ దంపతులు మంగళవారం కైలాసగిరిని సందర్శించారు. అక్కడి నుంచి విశాఖ అందాలను చూసి మంత్ర ముగ్ధులై ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ‘కైలాసగిరి నుంచి వైజాగ్‌ అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత ప్రాంతాన్ని సంరక్షిస్తూ మరింత అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దిన GVMCకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.