Visakhapatnam

News April 7, 2024

హెలిపాడ్ సిద్ధం.. పవన్‌కళ్యాణ్ షెడ్యూల్ ఇదే

image

అనకాపల్లిలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ విశాఖ హైవే పక్కన ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి వారాహి వాహనం మీద ఊరేగింపుగా పట్టణంలోకి వస్తారు. చాపల బజార్, నాలుగు రోడ్లు జంక్షన్, బండి గాడి వీధి, శ్రీకన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి జంక్షన్, ఎన్టీఆర్ విగ్రహం, నెహ్రూ చౌక్ జంక్షన్ వద్దకు చేరుకుంటారు. 6 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

News April 7, 2024

సీఎం రమేశ్‌కు 41ఏ నోటీసులు

image

అనకాపల్లి ఎన్డీఏ MP అభ్యర్థి సీఎం రమేశ్‌కు పోలీసులు శనివారం రాత్రి 41ఏ నోటీసులు ఇచ్చారు. ఇటీవల చోడవరంలోని ఓ టైల్స్ షాప్‌లో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా.. సీఎం రమేశ్ అక్కడికి చేరుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. సీఎం రమేశ్, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి రాజుతో పాటు ఆరుగురి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

News April 7, 2024

విశాఖ: హిందుస్థాన్ షిప్ యార్డ్ టర్నోవర్ రూ. 1,597 కోట్లు

image

హిందుస్థాన్ షిప్ యార్డ్ టర్నోవర్ వరుస ఆర్థిక సంవత్సరాల్లో రూ.478 కోట్ల నుంచి రూ. 1,597 కోట్లకు పెరిగి రికార్డు నెలకొల్పిందని సంస్థ యాజమాన్యం శనివారం తెలియజేసింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో రూ.478 కోట్ల టర్నోవర్ ఉన్నప్పటికీ సంస్థ రూ.14 కోట్ల నష్టాల్లో ఉండేది. ఆ తర్వాత 2021-22లో రూ.755 కోట్ల టర్నోవర్కు చేరి రూ.51 కోట్ల లాభం గడించింది. 2022-23లో రూ.1103 కోట్ల టర్నోవర్కు రూ.65 కోట్ల లాభం వచ్చింది.

News April 7, 2024

విశాఖ: వృద్ధురాలిపై అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు

image

ఓ వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకుల్ని అత్యాచార నేరం కింద ఎంవీపీ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 4న పెదవాల్తేరులో ఓ వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉందని పసిగట్టిన ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ సంఘటనలో యనమరెడ్డి నరేష్ (21), కృష్ణవంశీ (22), బారిక స్వామి(23)పై అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సి.ఐ. సంజీవరావు తెలిపారు.

News April 7, 2024

విశాఖ: ఓటు బదిలీకి కేఏ పాల్ దరఖాస్తు

image

విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తన ఓటును విశాఖకు బదిలీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతేడాది తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఇప్పుడు ఏపీకి వచ్చారు. నగరంలోని శ్రీకన్య థియేటర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తన ఓటును విశాఖ ఉత్తర నియోజకవర్గానికి బదిలీ చేయడానికి దరఖాస్తు చేసినా, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

News April 7, 2024

విశాఖ: హత్య కేసులో వాలంటీర్ అరెస్టు

image

పాయకరావుపేట మండలంలోని పెద్దరామ భద్రపురం హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 11న గ్రామంలో తలెత్తిన వివాదంలో గంపల నూకరాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు పాల్పడిన వారిలో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్నాళ్లు పరారీలో ఉన్న పాయకరావుపేటకు చెందిన గ్రామ వాలంటీర్ పెద్దాడ గాంధీని శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News April 7, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల పంపిణీ పూర్తి

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల పంపిణీ పూర్తయింది. 99% మందికి సచివాలయ సిబ్బంది పింఛన్లను అందజేశారు. విశాఖ జిల్లాలో 1,65,432 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 1,63,553 మందికి అందజేశారు. అనకాపల్లి జిల్లాలో 2,66,208 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,63,232 మందికి పంపిణీ చేశారు. అల్లూరి జిల్లాలో పింఛన్ లబ్ధిదారులు 1,27,894 మంది కాగా 1,26,573 మందికి పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

News April 7, 2024

విశాఖ: అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయల సాగు

image

జిల్లాలో మొత్తం 777 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా, వీటిలో 190 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. తొలి దశలో 42 కేంద్రాలకు రూ.10 వేలు చొప్పున కూరగాయల మొక్కల పెంపకానికి కేంద్రం నిధులను మంజూరుచేసింది. రెండో విడత మరికొన్ని కేంద్రాలకు విడుదల చేయనుందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం పరిధిలో కాయగూరలు పండించనున్నారు. వీటిని అదే కేంద్రాల్లో వంటకు వినియోగించనున్నారు. నిర్వహణ బాధ్యతను పూర్తిగా ఆయాలు చూడాలి.

News April 7, 2024

సింహాచలం: 18 నుంచి అప్పన్న వార్షికోత్సవ కల్యాణోత్సవాలు

image

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలను ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి తెలిపారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 19న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం, ఎదుర్కోలు ఉత్సవం, రథోత్సవం నిర్వహణ తదితర అంశాలపై చర్చించామని తెలిపారు.

News April 7, 2024

విశాఖ: కత్తిపోట్లతో బాలుడు మృతి.. ఆరుగురు అరెస్ట్

image

మాధవధారలో పాత కక్షల నేపథ్యంలో గురువారం కత్తిపోట్లకు గురైన అంబేడ్క‌ర్ కాలనీకి చెందిన మూగ బాలుడు తేజ (17) రెండు రోజులపాటు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతికి కారణమైన ఉదయకుమార్, రాజకుమార్, జగదీష్, శివశంకర్, సన్యాసిరావులపై శనివారం ఎయిర్ పోర్టు పోలీసులు హత్య కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఆరో వ్యక్తి మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించారు.