India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనకాపల్లి ఎంపీ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా సీఎం రమేశ్ను ఖరారు చేయగా.. వైసీపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో కాపు, గవర సామాజిక వర్గాలదే పైచేయి. అయితే ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు.. వైసీపీలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. మరి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారని మీరు భావిస్తున్నారు..?
సాధరణంగా జనావాసంలో ఉన్న పెద్ద చెట్లకు 5 వరకు తేనెపట్లు ఉంటాయి. అదే అటవీ ప్రాంతాల్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అల్లూరి జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. డుంబ్రిగూడ మండలం కొర్రాయి కొత్తవలస గ్రామంలో జనావాసాలను ఆనుకుని ఉన్న ఓ భారీ చెట్టు నిండుగా తేనెపట్లే ఉన్నాయి. ప్రతి కొమ్మకూ తేనెపట్లు ఉంటూ.. మొత్తంగా 100కు పైగా తేనెపట్లు ఉండటం విశేషం.
విశాఖ జూలో 24వ తేదీ అర్ధరాత్రి బెకన్ అనే మగ <<12921248>>జిరాఫీ<<>> మృతి చెందడంపై క్యూరేటర్ నందిని సలారియ వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా జిరాఫీ మృతి చెందిందన్నారు. సంవత్సర కాలంగా జిరాఫీకి చికిత్స అందిస్తున్నామన్నారు. చికిత్స కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ వెటర్నరీ వైద్యులను నిపుణులను సంప్రదించినా లాభంలేకపోయిందన్నారు.
సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నృసింహస్వామి డోలోత్సవం (పెళ్లి చూపులు) సోమవారం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు సాంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎస్.శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు. తెల్లవారుజామున సింహాద్రినాదుడు ఉత్సవమూర్తి ప్రతినిధి గోవిందరాజు స్వామిని సర్ణాభరణాలతో అందంగా అలంకరించారు.
అనకాపల్లి ఎంపీగా 1989లో కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. ఈ స్థానానికి 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఈ మెజార్టీనే అత్యల్పం. కొణతాల ప్రస్తుతం అనకాపల్లి జనసేన MLA అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వెంకట సత్యవతి 89,829 ఓట్ల మెజార్టీతో గెటిచారు. ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్ బరిలో ఉండగా.. వైసీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
విశాఖ ఇందిరాగాంధీ పార్కులో సోమవారం తెల్లవారుజామున జిరాఫీ మృతి చెందింది. గతంలో రెండు జిరాఫీలు ఉండేవి. అందులో ఒకటి ఇప్పటికే మృతి చెందగా ఈరోజు మరో జిరాఫీ మృతి చెందింది. దీంతో జూ పార్క్లో ఉన్న జిరాఫీల ఎన్క్లోజర్ ఖాళీ అయింది. జంతువుల వరుస మరణాలతో జూ పార్క్ వెలవెలబోతోందని జంతు ప్రేమికులు అంటున్నారు. అధికారుల తగు జాగ్రత్తలు తీసుకొని జంతువులను కాపాడాలని కోరుతున్నారు.
విశాఖపట్నం ఎయిర్పోర్టు జంక్షన్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆటోను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షత్రగాత్రులను కేజీహెచ్కు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జనసేన నిన్న ప్రకటించిన జాబితాలో విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు లేదు. YCP నుంచి జనసేనలోకి వచ్చిన ఈయనకు విశాఖ దక్షిణ టికెట్ కేటాయిస్తానని జనసేన అధినేత పవన్ గతంలో హామీ ఇచ్చినట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట మంగళగిరిలో ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారన్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ పేరు లేకపోవడంతో ఈ టికెట్ ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
జనసేన టికెట్ దక్కించుకున్న పంచకర్ల రమేష్ బాబు 2009లో పెందుర్తి నుంచి మొదటిసారిగా ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎలమంచిలి నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 2023లో వైసీపీలో చేరిన ఆయన జిల్లా అధ్యక్షుని పనిచేశారు. అనంతరం రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ 1985లో టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా, 1989 ఎన్నికలలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పని చేశాడు. 2012లో రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయి, ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికయ్యాడు. 2018లో రెండోసారి TDP తరఫున రాజ్యసభకు ఎంపికై ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.