India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హుకుంపేట మండలం పట్టం పంచాయతీ దాబువలసలో విషాదం చోటుచేసుకుంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న భవానీ అనే గర్భిణీని పాడేరు జిల్లా ఆసుపత్రి నుంచి విశాఖ కేజీహెచ్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. శుక్రవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గ్రామానికి తరలించి శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా మృతురాలికి ఇద్దరు పిల్లల సంతానం.
విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు విశాఖలో ఆర్ఐఓ మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 వరకు సెలవులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 19 ఆదివారం కావడంతో తిరిగి 20 నుంచి కళాశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. ప్రైవేట్ కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
సంక్రాంతి పండగ పురస్కరించుకుని పేకాట, జూదం, కోడిపందేలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇటువంటి కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు.
యూట్యూబర్ <<15118839>>భార్గవ్<<>> (ఫన్ బకెట్ ఫేమ్)కు 20ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈయనది విజయనగరం జిల్లా కొత్తవలస. చెల్లి అంటూనే విశాఖకు చెందిన 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు 2021లో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దిశ చట్టం కింద భార్గవ్ను అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణలో నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ వైజాగ్ ప్రేక్షకులకు స్పెషల్ అనుభూతిని పంచింది. రామ్ చరణ్ విశాఖ కలెక్టర్గా.. బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్గా పనిచేశారు. విశాఖ యూనివర్సిటీ పేరుతో ఉన్న భవనంలో పలు ఫైట్ సీన్లు ఉన్నాయి. షూటింగ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కోసం R.K బీచ్లో పెద్ద సెట్ వేశారు. బీచ్ రోడ్డు NTR బొమ్మ దగ్గర సాంగ్ షూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి.
సంక్రాంతి దృష్ట్యా విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఈ నెల 13 వరకు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణాధికారి తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు 20, రాజమండ్రి, విజయవాడకు 40, కాకినాడకు 20, విజయనగరం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాలకు 830 బస్సులు నడవనున్నాయన్నారు.
విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు ఈనెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు సీఈఓ పి.నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ మేరకు జడ్పిటిసి సభ్యులు ఎంపీపీలకు ఆహ్వానాలు పంపించడం జరిగిందన్నారు. అధికారులు తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ వైజాగ్ ప్రేక్షకులకు స్పెషల్ అనుభూతిని పంచింది. రామ్ చరణ్ విశాఖ కలెక్టర్గా.. బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్గా పనిచేశారు. విశాఖ యూనివర్సిటీ పేరుతో ఉన్న భవనంలో పలు ఫైట్ సీన్లు ఉన్నాయి. షూటింగ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కోసం R.K బీచ్లో పెద్ద సెట్ వేశారు. బీచ్ రోడ్డు NTR బొమ్మ దగ్గర సాంగ్ షూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి.
హెచ్ఎంపీవీకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గురువారం తెలిపారు. దీనిలో భాగంగా కేజీహెచ్లో 20 పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామన్నారు. అలాగే రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధంగా ఉంచామన్నారు. ఈ వైరస్పై వస్తున్న వదంతులు నమ్మవద్దని సూచించారు. ఇది ప్రాణాంతకం కాదన్నారు.
విశాఖ- సికింద్రాబాద్ (20833/34)వందే భారత్ రైలుకు అదనంగా నాలుగు కోచ్లు ఏర్పాటు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. జనవరి 11 నుంచి వందే భారత్ రైలు 20 కోచ్లతో నడుస్తుందన్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ -2, చైర్ కార్ -18 బోగీలు ఉండనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.