Visakhapatnam

News June 29, 2024

విశాఖ: బదిలీల కోసం తహశీల్దారుల ఎదురుచూపు

image

ఎన్నికల ముందు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న తహశీల్దారులను ప్రభుత్వం వేరే జిల్లాలకు బదిలీ చేసింది. ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు బదిలీపై వచ్చిన తహశీల్దారులు తమ సొంత జిల్లాలకు వెళ్లడానికి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారు ఉమ్మడి విశాఖ జిల్లాకు రావడానికి ఎదురుచూస్తున్నారు.

News June 29, 2024

విశాఖ: టోల్ ఛార్జీ వసూళ్లను నిలిపివేసిన ఆర్టీసీ

image

విశాఖ జిల్లా అగనంపూడి వద్ద టోల్ గేట్ ఎత్తివేయడంతో ఆ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ టోల్ ఛార్జీల వసూళ్లకు నిలిపివేసింది. విశాఖ ఆర్టీసీ రీజియన్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి అనకాపల్లి, రాజమండ్రి, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు ప్రయాణికుల నుంచి ఆర్టీసీ రూ.5 నుంచి రూ.10 వరకు టోల్ ఛార్జీలు వసూలు చేసేది. ఈ మేరకు టికెట్ ఇష్యూ మెషీన్‌లో సాఫ్ట్‌వేర్‌ను సవరించారు.

News June 29, 2024

విశాఖ: డ్రెడ్జ్-8 నౌకకు అత్యవసర మరామత్తులు పూర్తి

image

విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో కేవలం ఐదు రోజుల్లోనే అత్యవసర డ్రై డాకింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన డ్రెడ్జ్-8 నౌక అత్యవసర మరమ్మతుల కోసం ఈనెల 21న తీసుకువచ్చారు. సంస్థ అధికారులు, సిబ్బంది 24 గంటల ప్రణాళికతో ఐదు రోజుల్లో పనులు పూర్తి చేశారు. ఈ నౌకను 1977లో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

News June 29, 2024

డైట్‌లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్: ప్రిన్సిపల్

image

డైట్లో డిప్లమో కోర్స్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌కు ఈనెల 30 నుంచి జూలై 4 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎం.జ్యోతి కుమారి తెలిపారు. మొదటి విడత వెబ్‌ఆప్షన్స్ ఇవ్వనివారు, మొదటి విడతలో సీటు రానివారు.. ఈ అవకాశం వినియోగించుకోవచ్చని చెప్పారు. వీరికి జూలై 5 నుంచి ఏడో తేదీ వరకు సీట్లు కేటాయింపు ఉంటుందని, జూలై 9 నుంచి 13 వరకు ప్రవేశాలు కల్పిస్తామని జ్యోతికుమారి తెలిపారు.

News June 28, 2024

విశాఖలో ఆటో డ్రైవర్‌పై దాడి

image

విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కవానిపాలెం ప్రభుత్వ వైన్ షాప్ వద్ద ఆటో డ్రైవర్ బొల్లి అక్కునాయుడుపై దాడి జరిగింది. అయితే ఈ దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. గాయాలైన ఆటో డ్రైవర్‌ను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎంవీపీ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

News June 28, 2024

విశాఖ వైఎస్సార్ స్టేడియంలో ఆటగాళ్ల సందడి

image

విశాఖ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్‌లో క్రికెటర్లు శుక్రవారం సందడి చేశారు. ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్ మూడో సీజన్ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు తలబడనున్నాయి. ఆయా జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు.

News June 28, 2024

విశాఖ రానున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు 

image

స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయ్యన్నపాత్రుడు తొలిసారిగా 29న విశాఖ వస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.15 గంటలకు హోటల్ దసపల్లాకు వెళ్లి సందర్శకులను కలుస్తారు. అక్కడే లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు అనకాపల్లి నూకాంబికను దర్శించుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

News June 28, 2024

విశాఖ పోలీస్ కమిషనర్‌కు బదిలీ

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్‌కు బదిలీ అయింది. ఆయనను సీఐడీ అడిషనల్ డీజీపీగా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సీపీ పోలీస్ కమిషనర్‌గా శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చీని ప్రభుత్వం నియమించింది. ఇటీవల విశాఖ కలెక్టర్‌గా పని చేసిన మల్లికార్జునను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

News June 28, 2024

ముంపు గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యలు: హోం మంత్రి

image

ముంపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. భారీవర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీసీ నిర్వహించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వరద ముంపు గ్రామాల్లో జిల్లా, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలను వరదల పట్ల చైతన్యం చేస్తున్నామన్నారు.

News June 28, 2024

చంద్రబాబును కలిసిన పల్లా దంపతులు

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు దంపతులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేస్తూ పని చేయాలన్నారు.