Vizianagaram

News April 19, 2026

VZM: 21న ఫుట్బాల్, బాక్సింగ్ క్రీడా ఎంపికలు

image

ఈ నెల 21, 23, 24 తేదీల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్ 21న ఫుట్ బాల్ మహిళా, 23న ఫుట్ బాల్ పురుషులు, 24న బాక్సింగ్ బాలబాలికలు ఎంపిక పోటీలు విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉ.8 గంటలకు హాజరుకావాలన్నారు.

News April 19, 2026

VZM: చందానోత్సవానికి వచ్చే వారికి ముఖ్య గమనిక

image

ఏప్రిల్ 20న సింహచలం చందనోత్సవానికి వస్తున్న భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. దేవస్థానం సుమారు 100 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను కొండపైకి తీసుకెళ్లనుంది. అయితే అనకాపల్లి, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస నుంచి వచ్చే వారు పాతగోశాల, శ్రీనివాస కళ్యాణ మండపం, సింహపురి కాలనీ వద్ద బస్సులు ఎక్కాలి. హనుమంతువాక నుంచి వచ్చే భక్తులు కొత్త గోశాల, అడవివరం కొత్త టోల్ గేట్ బస్ స్టాప్ వద్ద బస్సులు ఎక్కాలి.

News April 18, 2026

VZM: ‘బీఎల్ఏలను త్వ‌ర‌గా నియ‌మించాలి’

image

రాజ‌కీయ పార్టీలు ప్ర‌తీ పోలింగ్ కేంద్రానికి త‌మ ప్ర‌తినిధులుగా బీఎల్‌ఏల‌ను నియ‌మించి, ఆ జాబితాను త్వ‌ర‌గా అంద‌జేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.స‌త్తిబాబు కోరారు. త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో శనివారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. బీఎల్ఎల‌ను నియ‌మించుకోవ‌డం ద్వారా ఎన్నిక‌ల ప్ర‌క్రియను స‌జావుగా, పార‌ద‌ర్శ‌కంగా పూర్తి చేసేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

News April 18, 2026

VZM: పైడితల్లమ్మ ఆలయం పనులు.. ఉత్తరాయణలోనే ప్రారంభించేలా చర్యలు

image

విజయనగరం పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 18, 2026

VZM: మే 5, 6,7 తేదీల్లో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు

image

రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల (5వ ఏపీ కప్) పోస్టర్‌ను గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు దంపతులు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు శనివారం అశోక్ బంగ్లాలో ఆవిష్కరించారు. మే 5, 6,7 తేదీల్లో విజయనగరం రాజీవ్ స్టేడీయంలో ఈ పోటీలు జరగనున్నట్లు జిల్లా ఒలింపిక్, తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి, ఎమ్మెల్సీ గ్రీష్మ పాల్గొన్నారు.

News April 18, 2026

VZM: మే 5, 6,7 తేదీల్లో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు

image

రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల (5వ ఏపీ కప్) పోస్టర్‌ను గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు దంపతులు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు శనివారం అశోక్ బంగ్లాలో ఆవిష్కరించారు. మే 5, 6,7 తేదీల్లో విజయనగరం రాజీవ్ స్టేడీయంలో ఈ పోటీలు జరగనున్నట్లు జిల్లా ఒలింపిక్, తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి, ఎమ్మెల్సీ గ్రీష్మ పాల్గొన్నారు.

News April 18, 2026

జీవప్రాణులకు జలమే ఆధారం: VZM కలెక్టర్

image

జీవప్రాణులకు జలమే ఆధారమని విజయనగరం కలెక్టర్ రాంసుందర రెడ్డి పేర్కొన్నారు. శనివారం అలకనంద కాలనీలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్రలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇంకుడు గుంతను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొనే విధంగా ప్రజా చైతన్యం రావాలన్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

News April 18, 2026

అర్హత గల బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్

image

బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేసి, విజయనగరం జిల్లాలో శత శాతం విద్యార్థుల నమోదు సాధించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే ప్రత్యేక ప్రవేశోత్సవంలో అర్హత గల బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ నుంచి వచ్చిన పిల్లలు, 5వ తరగతి పూర్తి చేసినవారు, డ్రాప్‌అవుట్స్‌ను గుర్తించి చేర్పించాలన్నారు.

News April 18, 2026

అర్హత గల బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్

image

బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేసి, విజయనగరం జిల్లాలో శత శాతం విద్యార్థుల నమోదు సాధించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే ప్రత్యేక ప్రవేశోత్సవంలో అర్హత గల బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ నుంచి వచ్చిన పిల్లలు, 5వ తరగతి పూర్తి చేసినవారు, డ్రాప్‌అవుట్స్‌ను గుర్తించి చేర్పించాలన్నారు.

News April 18, 2026

అర్హత గల బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి: కలెక్టర్

image

బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేసి, విజయనగరం జిల్లాలో శత శాతం విద్యార్థుల నమోదు సాధించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే ప్రత్యేక ప్రవేశోత్సవంలో అర్హత గల బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ నుంచి వచ్చిన పిల్లలు, 5వ తరగతి పూర్తి చేసినవారు, డ్రాప్‌అవుట్స్‌ను గుర్తించి చేర్పించాలన్నారు.