Vizianagaram

News September 25, 2025

ఓటర్ల జాబితాను మ్యాప్ చేయండి: VZM కలెక్టర్

image

ఓటర్ల జాబితా సవరణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాప్ చేయాలని తెలిపారు. ఓటర్ల సవరణ కోసం అందిన ఫారం 6, 7, 8ని నిర్దేశిత గడువు లోగా డిస్పోజ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

News September 24, 2025

VZM: ‘రెవెన్యూ వినతులపై సానుకూలంగా వ్యవహరించాలి’

image

విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి అధికారులు ఈ-ఆఫీస్ ద్వారానే ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ వినతులకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. వినతుల పై ప్రజల సంతృప్తి పెరగాలని అన్నారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవ్, DRO శ్రీనివాస్ మూర్తి పాల్గొన్నారు.

News September 24, 2025

VZM: ఆర్టీసీలో అప్రెంటీస్‌‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరం జిల్లా పరిధిలో గల డిపోలు, యూనిట్‌లలో షీట్ మెటల్ వర్కర్ & పెయింటర్ ట్రేడ్‌లలో అప్రెంటిషిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. www.apprenticeship.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News September 24, 2025

VZM: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో జిల్లా ముందుండాలి’

image

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పర్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యాచరణ అమలు తీరును తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా MPDOలతో సమీక్షించారు. నగరపాలక సంస్థల్లో నిర్ణీత లక్ష్యాలు సాధిస్తున్నారన్నారు. గ్రామాల్లో కూడా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు.

News September 23, 2025

VZM: ఆర్టీసీలో అప్రెంటీస్‌ షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరం జిల్లా పరిధిలో గల డిపోలు, యూనిట్‌లలో షీట్ మెటల్ వర్కర్ & పెయింటర్ ట్రేడ్‌లలో అప్రెంటిషిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. www.apprenticeship.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News September 23, 2025

బొండపల్లి: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

బొండపల్లి మండలంలో పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందాడు. MRO రాజేశ్వరరావు వివరాల ప్రకారం.. గంట్యాడ మండలం పెదమజ్జిపాలేనికి చెందిన సుంకరి సూర్యనారాయణ (63) వెదురువాడ గ్రామానికి సమీపంలోని మామిడి తోటలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఒక్కసారిగా పిడుగు పడడంతో సూర్యనారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. వీఆర్వో ద్వారా బొండపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.

News September 23, 2025

పైడితల్లమ్మ పండగ ఏర్పాట్లపై ఆరా

image

విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం ఉదయం పర్యటించారు. వచ్చే నెల 6,7 తేదీల్లో పైడితల్లి అమ్మ వారి పండుగ జరగనున్న నేపథ్యంలో సిరిమాను ప్రారంభించే ప్రాంతమైన హుకుంపేటను పరిశీలించారు. అనంతరం పైడితల్లమ్మ అమ్మవారి గుడికి చేరుకుని భక్తులు లోపలికి ప్రవేశించే మార్గాలపై ఆరా తీశారు. వారితో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

News September 23, 2025

VZM: శ్రీ పైడితల్లిని దర్శించుకున్న ఎస్పీ

image

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎ.ఆర్.దామోదర్ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ అధికారులు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మూడు లాంతర్లను సందర్శించి సిరిమాను తిరిగే ప్రాంతాన్ని పరిశీలించారు.

News September 22, 2025

కలెక్టర్ PGRSకు 240 వినతులు

image

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు 240 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంభందించి రెవిన్యూ శాఖకు అత్యధికంగా 106 వినతులు వచ్చాయి. పంచాయతిశాఖకు 15, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డిఏకు 28 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వీటిని కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి, జేసీ సేదు మాధవన్ స్వీకరించారు.

News September 22, 2025

VZM: తీవ్రంగా గాయపడిన యువకుడి మృతి

image

అనంతగిరి మండలంలో డముకు వ్యూ పాయింట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కిషోర్ (32)అనే యువకుడు అరకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి స్కూటీపై వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు.