Vizianagaram

News March 30, 2025

మైనర్లకు వాహనాలు ఇచ్చి చిక్కుల్లో పడొద్దు: VZM SP

image

మైనరు డ్రైవింగుతో చట్టపరమైన చిక్కులు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వ్యక్తులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. అటువంటి వ్యక్తులు డ్రైవింగు చేయుట వలన రహదారి ప్రమాదాలు, అనర్థాలు జరిగేఅవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే ప్రమాద భీమాను చెల్లించేందుకు సదరు భీమా కంపెనీలు నిరాకరిస్తాయన్నారు.

News March 29, 2025

ఈ నెల 31న రంజాన్ సందర్భగా గ్రీవెన్స్ రద్దు: VZM SP

image

రంజాన్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31న శెలవుగా ప్రకటించినందున జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రిసల్ సిస్టం’ను రద్దు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంకు మార్చి 31న ప్రజలెవరూ రావద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

News March 29, 2025

VZM: గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు గడువు పెంపు

image

గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు గురుకుల జిల్లా కన్వీనర్ కె.రఘునాధ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా గురుకుల పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏప్రిల్ 6 లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 29, 2025

అనుమానస్పద స్థితిలో యువతి మృతి

image

అనుమానస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ SI నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.

News March 29, 2025

ఈ నెల 31న గ్రీవెన్స్ రద్దు: కలెక్టర్ అంబేద్కర్

image

ఈ నెల 31వ తేదీన సోమ‌వారం రంజాన్ పండుగ సంద‌ర్భంగా, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వ‌హించే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌వేదిక కార్యక్రమాన్ని ర‌ద్దు చేయ‌డం జ‌రిగింద‌ని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని ఆయ‌న సూచించారు. ఆ రోజున మండల కార్యాలయాల్లో కూడా గ్రీవెన్స్ ఉండదన్నారు.

News March 29, 2025

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు: VZM SP

image

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్‌లో 2021లో నమోదైన పోక్సో కేసులో విజయనగరం పట్టణం గోకపేటకు చెందిన నిందితుడు కంది సన్యాసిరావు(19)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే.నాగమణి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు శుక్రవారం తెలిపారు. రూ.10,500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.

News March 29, 2025

క్షయ వ్యాధి నియంత్రణలో విజయనగరానికి జాతీయ స్థాయి గుర్తింపు

image

క్ష‌య వ్యాధి నియంత్ర‌ణ‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు ల‌భించినట్లు క‌లెక్ట‌ర్ అంబేద్కర్ తెలిపారు. ఈ వ్యాధి నియంత్ర‌ణ‌లో భాగంగా వ్యాధిగ్ర‌స్థుల గుర్తింపులో జిల్లా ముంద‌ు వరుసలో నిలిచిందన్నారు. వ్యాధి నియంత్ర‌ణకై చేపట్టిన ప్ర‌త్యేక వంద‌రోజుల కార్యక్రమంలో దేశంలోనే అత్య‌ధిక క్ష‌య‌వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసిన జిల్లాగా విజయనగరం నిలిచినట్లు పేర్కొన్నారు. సిబ్బందిని అభినందించారు.

News March 28, 2025

31న జరగాల్సిన టెన్త్ సోషల్ ఎగ్జామ్ వాయిదా

image

ఈ నెల 31న జరగాల్సిన సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసినట్లు డీఈవో మాణిక్యం నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31న రంజాన్ కారణంగా పరీక్ష వాయిదా వేసినట్లు చెప్పారు. 31న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ ఒకటిన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని కోరారు.

News March 28, 2025

VZM: శుభలేఖ సుధాకర్, SP శైలజకు జీవిత సాఫల్య పురస్కారం

image

ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్, సినీ నేప‌థ్య గాయని ఎస్పీ శైలజకు కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నామని కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బిఏ నారాయణ తెలిపారు. ఏప్రిల్ 1 న ఆనంద గజపతి కళాక్షేత్రంలో కళా పీఠం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని పద్మభూషణ్, గానకోకిల పి.సుశీల పాల్గొంటారన్నారు.

News March 28, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

ఎస్.కోట మండలం కొత్తూరు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసనబోయిన కార్తీక్ (21) మృతి చెందాడు. ఇతను తన స్నేహితులతో కలసి ఎస్.కోట నుంచి స్కూటీపై ఎల్.కోట పండక్కి వెళ్తున్న నేపథ్యంలో కొత్తూరు సమీపంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించగా కార్తీక్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

error: Content is protected !!