Vizianagaram

News May 22, 2024

విజయనగరం: ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ

image

విజయనగరం ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఈవీఎంలను భద్రపరిచిన ఇంజినీరింగ్ కళాశాల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వుడు, సివిల్ పోలీసుల మూడంచెల భద్రతను మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కళాశాలకు వెళ్లే మార్గాల వాహనా తనిఖీలు పర్యవేక్షించారు. అంతేకాకుండా ఆయా మార్గాల వెళ్లే వాహనాల వ్యక్తుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తామన్నారు. ఈవిఎంల భద్రతను అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో ఉంటుందన్నారు

News May 21, 2024

REWIND: రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం ఉత్తరాంధ్రలో సాగింది

image

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం శ్రీకాకుళంలో మే 21, 1991న సాగింది. అప్పటి లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించారు. శ్రీకాకుళంలో జరిగిన భారీ బహిరంగ సభలో అభ్యర్థి డా.కణితి విశ్వనాథంకు మద్దతుగా ప్రసంగించారు. అక్కడ నుంచి విజయనగరం సభలో మాట్లాడారు. అనంతరం విశాఖ చేరుకుని అక్కడ నుంచి విమానంలో రాత్రి 10 గంటలకు తమిళనాడులోని పెరుంబుదూర్‌లో జరిగిన మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యారు.

News May 21, 2024

VZM: జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు

image

ఇటీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే కాల్స్‌తో ప్రజలు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి నకిలీ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. కొరియర్ సర్వీసులతో వచ్చే నకిలీ కాల్స్‌ను నమ్మి, సైబర్ మోసాల బారిన పడొద్దని కోరారు. ఈ తరహా సైబర్ మోసగాళ్ల కాల్స్ భయపడాల్సిన పని లేదని, ఇటువంటి కాల్స్ ప్రజలెవరూ స్పందించకూడదన్నారు.

News May 21, 2024

తెర్లాం: గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తుల అరెస్టు

image

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామని బొబ్బిలి రూరల్ తిరుమల రావు తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తెర్లాం ఎస్ఐ రమేశ్‌కు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు తెర్లాం జంక్షన్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసునున్నామన్నారు. వారి వద్ద నుంచి 1.5 కేజీ గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించామని సీఐ వివరాలను వెల్లడించారు

News May 21, 2024

VZM: 24న ఎంఎస్ఎంఈ వర్క్‌షాప్

image

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 24న ఎంఎస్ఎంఈ మేక్‌ఇన్ ఇండియా సపోర్ట్ స్టార్టప్ అండ్ అగ్రిటెక్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డాక్టర్ దాసరి దేవ రాజ్, డీజీఎస్ సంతోష్ కుమార్‌లు ఈ విషయం తెలిపారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం టీటీడీసీలో వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపారు.

News May 21, 2024

పార్వతీపురం: 24 తేది నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

image

ఈ నెల 24 నుంచి జూన్ 7వ తేది వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. కేశవనాయుడు అన్నారు. సోమవారం పార్వతీపురం ఇంటర్ పరీక్షల నిర్వహణపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, వర్షాలు పడినా పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఉండాలన్నారు.

News May 21, 2024

తెర్లం: గంజాయితో ఆరుగురు అరెస్ట్

image

గంజాయతో పట్టుబడిన ఆరుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెర్లాం ఎస్సై ఆర్.రమేశ్ సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి మండలంలో రంగప్పవలస చెరువు దగ్గర ఒడిశా రాష్ట్రం నుంచి 2.193 కిలోల గంజాయి తీసుకువస్తుండగా యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, ఈ కేసు బొబ్బిలి సీఐ తిరుమలరావు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News May 20, 2024

పాచిపెంట : మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాచిపెంట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై పి నారాయణరావు తెలిపిన ప్రకారం.. పాంచాలి గ్రామానికి చెందిన కలువలపల్లి రాంబాబు(45) మద్యానికి బానిపై అయ్యాడు. అతిగా మద్యం తాగవద్దని భార్య మందలించింది. మనస్తాపం చెందిన రాంబాబు ఈ నెల 18న గడ్డి మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

News May 20, 2024

పశువుల అక్రమ రవాణా చేస్తే సమాచారం ఇవ్వండి: ఎస్పీ

image

జిల్లాలో పశువుల అక్రమ రవాణా, తరలింపు నియంత్రణకు కఠిన చర్యలు చేపడతామని ఈ చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ అధికారిగా విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీ డి.విశ్వనాధ్‌ను నియమిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారులకు లేదా విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీ 91211 09406 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

News May 20, 2024

విజయనగరం: పాము కాటుతో వ్యక్తి మృతి

image

పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎల్.కోట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కరెడ్ల చిన్నారావు(60) పొలంలో పనిచేస్తున్న క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి ఎస్.కోట తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.