Vizianagaram

News May 20, 2024

విజయనగరం: నేడే పైడితల్లమ్మ దేవరోత్సవం

image

నేడు జరగనున్న పైడితల్లి అమ్మవారి దేవరోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్ వనంగుడిలో కొలువుదీరిన అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ఆలయ ప్రదక్షిణ అనంతరం సా.5గంటలకు ఊరేగింపుగా హుకుంపేట తీసుకొస్తారు. అక్కడ నుంచి ఘటాలతో మంగళవారం తెల్లవారుజామున కొత్తపేట, పార్కుగేటు, శివాలయం వీధి మీదుగా ఊరేగింపుతో మూడులాంతర్ల చదురుగుడికి తీసుకొస్తారు. వచ్చే రెండువారాల వరకు అమ్మవారు అక్కడే పూజలందుకుంటారు.

News May 20, 2024

విజయనగరం: 24న DEECET పరీక్ష

image

ఈ నెల 24న DEECET-2024 పరీక్షను గాజులరేగలో ఐయాన్ డిజిటల్ జోన్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్ తెలిపారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను cse.ap.gov.in వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.

News May 19, 2024

ఎస్.కోట: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన అప్పలస్వామి అనే గొర్రెల కాపరి ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఎప్పటిలాగే తన మేకలను మేపేందుకు గ్రామ సమీపంలో మెట్టకు వెళ్లాడు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినప్పటికీ అప్పలస్వామి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెతికారు. ఈ నేపథ్యంలో అప్పలస్వామి గ్రామ సమీపంలో పిడుగు పడి మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తీవ్రంగా రోదిస్తూ వెల్లడించారు.

News May 19, 2024

విజయనగరం: 42 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

ఈనెల 24 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు జిల్లాలో 42 కేంద్రాల్లో నిర్వహించనున్నామని ఆర్ఐఓ ఆదినారాయణ తెలిపారు. ప్రథమ సంవత్సర పరీక్షలకు 14,904, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 7,927 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News May 19, 2024

విజయనగరం: చెరువులో పడి బాలుడి మృతి

image

దత్తిరాజేరు మండలంలోని రాజుల రామచంద్రపురం గ్రామానికి చెందిన మండాది గౌతం (10) శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు పప్పల చెరువు వద్దకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో కాలు జారి చెరువులోకి పడిపోయాడు. స్నేహితులు బయటకు తీసి 108కు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడని స్టేషన్ బూర్జివలస ఎస్.ఐ లక్ష్మీప్రసన్న కుమార్ ఆదివారం తెలిపారు.

News May 19, 2024

అవి పులి పాదముద్రలు కావు: ఫారెస్ట్ అధికారులు

image

భోగాపురం మండలంలో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై అటవీశాఖ అధికారులు స్పందించారు. దిబ్బలపాలెం ప్రాంతంలో సెక్షన్ అధికారి మధుమోహన్‌రావు శనివారం పర్యటించి పాదముద్రలు పరిశీలించారు. అవి పులి అడుగుజాడల్లానే ఉన్నా.. దుమ్మలగుండుగా పిలిచే హెన్నావిగా నిర్ధారించారు. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

News May 19, 2024

విజయనగరం: ఈనెల 21న అండర్-16 క్రికెట్ ఎంపికలు

image

ఈ నెల 21 అనగా మంగళవారం నాడు అండర్-16 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి ఎంఎల్ఎన్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరు కానున్న క్రీడాకారులు స్టడీ, ఆధార్ కార్డులు పట్టుకొని ఆరోజు ఉదయం 6.30 గంటలయ్యేసరికి విజ్జీ మైదానంలో ఉండాలని పేర్కొన్నారు.

News May 19, 2024

కూటమికి 160పైగా సీట్లు: కిమిడి

image

YCP ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయమని చీపురుపల్లి TDP MLA అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావడం ఖాయమన్న ఆయన..1983,1994ఎన్నికల తరహాలో ఈసారి పెద్దఎత్తున ప్రభంజనం వచ్చిందన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు, ప్రకృతిని దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా YCP పాలించిందని ఆరోపించారు. జూన్ 9న విశాఖలో CMగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తామని బొత్స చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

News May 19, 2024

పార్వతీపురం: తెలంగాణ ఎంసెట్‌లో శ్రీనిధి ప్రతిభ

image

కొమరాడ మండలం దళాయిపేటకి చెందిన ధనుకొండ శ్రీనిధి తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పదో ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు ధనుకొండ శ్రీనివాసరావు, సుశీల ఇద్దరూ ఉపాధ్యాయులే. శ్రీనివాసరావు నెల్లిమర్ల మండలం సారిపల్లి జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్నారు. శ్రీనిధి పదో తరగతిలో కూడా మంచి మార్కులు సాధించింది. విద్యార్థినిని ఆమె తల్లిదండ్రులు, బంధువులు అభినందించారు.

News May 18, 2024

VZM: డస్ట్ బిన్‌లో పసికందు మృతదేహం

image

విజయనగరం ఎంజీ రోడ్డులోని వస్త్ర దుకాణాల ఎదురుగా ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డస్ట్ బిన్‌లో పసికందు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. సాయంత్రం స్థానికులు డస్ట్ బిన్‌లో ఉన్న అట్ట పెట్టెకు రక్తం కనిపించడంతో దాన్ని తెరిచి చూశారు. పసికందు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.