India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 20న విజయనగరం ప్రభుత్వ ITIలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన 18-35 లోపు వయసు యువకులు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాబ్ మేళాలో ప్రముఖ ఫార్మా కంపెనీలు హాజరవుతున్నాయని, ఆసక్తి గల వారు https://naipunyam.ap.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
విజయనగరం జిల్లాలోని వాగులు గెడ్డలపై చెక్ డ్యామ్లు నిర్మించేందుకు వారం రోజుల్లోగా ప్రతిపాదనలు సమర్పించాలని జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం ఆ శాఖ ఇంజినీర్లతో తన కార్యాలయంలో సమీక్షించారు. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న భూముల్లో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను తనకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టుల మరమ్మతులు నిర్వహణ పనుల కోసం మంజూరైన నిధుల వివరాలు చెప్పాలన్నారు.
ఎల్.కోట మండలం భీమాలిలో ఇటీవల కోడి పందేలను నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన ఘటనలో విచారణ కొనసాగుతుందని DIG గోపీనాథ్ జెట్టీ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బాధ్యులైన పోలీసులపై చర్యలు తప్పవన్నారు. కోడిపందేల స్థావరంపై రైడ్ చేసిన పోలీసులు కేసులు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించారని SP విచారణలో వెల్లడి కావడంతో ఎల్.కోట అసిస్టెంట్ రైటర్ జీ.సత్యనారాయణను సస్పెండ్ చేశామన్నారు.
విజయనగరం PW మార్కెట్లో తక్కువ రకం బియ్యాన్ని బ్రాండెడ్ కవర్లలో నింపి విక్రయిస్తున్న షాపుపై పోలీసులు రైడ్ చేసిన సంగతి తెలిసిందే. జయలక్ష్మి ట్రేడర్స్ షాపు ప్రతినిధి పెంటపాటి ఈశ్వర వెంకట్(రాజా) హైదరాబాద్లో పద్మావతి పాలీసాక్స్ను నడుపుతున్న శ్రీనివాస్ నుంచి కాలీ బ్రాండెడ్ రైస్ కవర్లు కొని తక్కువ రకం బియ్యాన్ని నింపుతున్నట్లు గుర్తించామని ఎస్ఐ నరేశ్ తెలిపారు.
విజయనగరంలోని పడాల్ పేటకు చెందిన విద్యార్ధిని సూసైడ్ చేసుకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ వివరాల ప్రకారం.. వీర వెంకట లక్ష్మి (19) మైగ్రేన్ సమస్యలతో బాధపడుతోందన్నారు. ఈనెల 13న నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగేసిందని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలోని ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపులు, కాలేజ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని SP వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అదనంగా మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా షాపు యజమానులకు, వ్యాపారవేత్తలకు, అపార్టుమెంట్ వాసులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణకు డ్రోన్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును ఎంపీ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సదస్సులో చంద్రబాబు ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుందని, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని, కింజరాపు పాల్గొన్నారు.
ఈ నెల 20 లోపు 1 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్ధులందరికీ అపార్ ఐడీలు జనరేట్ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో యాక్షన్ టేకాన్ రిపోర్ట్పై విద్యా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆధార్ సమస్యను పరిష్కరించుకొని వెంటనే అపార్ ఐ.డిలను జారీ చేయాలని సూచించారు. బడి బయట ఉన్న 6 సంవత్సరాల పైబడిన బాలల వివరాలను, బడి బయట ఉండడానికి గల కారణాలను తెలపాలన్నారు.
జిల్లాలో MSME, ఇతర పరిశ్రమల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీని నియమించినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమల శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ను ఇన్ఛార్జ్గా నియమించినట్లు తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహానికి అవసరమైన భూ సమస్యలను రెవెన్యూ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.
దత్తిరాజేరు జెడ్పీ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి ఎం.కూర్మారావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. కూర్మారావు సొంత ఊరు అయిన పొరలికి వచ్చి, దత్తిరాజేరు స్కూల్ను శనివారం పరిశీలించారు. జిల్లా అధికారి మాణిక్యం నాయుడు, మండల ఎంఈఓ వెంకట్రావు, స్కూల్ హెచ్ఎం స్వర్ణ కలెక్టర్కు ఘనంగా స్వాగతించి అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.