Vizianagaram

News November 16, 2024

ఎస్.కోట: మహిళపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం

image

మహిళపై స్కూల్ HM అత్యాచారయత్నం చేసినట్లు ఎస్.కోట పోలీసలు కేసు నమోదు చేసుకున్నారు. సీఐ వీ.ఎన్ మూర్తి వివరాల ప్రకారం.. గంట్యాడ మండలంలోని ఓ మహిళ తన కుమారుడి స్టడీ సర్టిఫికెట్లు సరిదిద్దాలని ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎమ్‌ను కోరారు. సరి చేయడం కోసం బొడ్డవర వెళ్లాలని చెప్పి ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. సమీప తోటల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేయబోగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో వదిలేశాడు.

News November 16, 2024

విజయనగరం మాజీ ఎంపీకి కీలక బాధ్యతలు

image

ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జోగారావుకి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌తో అండగా ఉంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.

News November 16, 2024

VZM: ‘జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి’

image

వచ్చే నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి మీనా దేవి కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కేసులన్నీ లోక్ అదాలతో పరిష్కరించు కోవాలన్నారు. దీనికి లోక్ అదాలత్‌ను వేదికగా చేసుకుని కక్షిదారులకు డబ్బు, సమయం వృథా కాకుండా చూడాలన్నారు.

News November 15, 2024

ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు విజయనగరం ఎంపీ వినతి

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబును.. అక్కడి విమానాశ్రయంలో కలిసి ఆహ్వానం పలికారు. చెన్నైలో మాదిరిగా జిల్లాలో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేసినట్లు ఎంపీ తెలిపారు.

News November 15, 2024

VZM: ‘రాజీకు వచ్చే క్రిమినల్ కేసులను గుర్తించండి’

image

రాజీకు వచ్చే అన్ని క్రిమినల్ కేసులను గుర్తించి వాటిని జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ సూచించారు. పోలీస్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. రాజీయే రాజమార్గమని, ఈ విధానం ద్వారా కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు.

News November 15, 2024

విజయనగరం రైల్వే ట్రాక్‌పై మృతదేహం 

image

విజయనగరం రైల్వే స్టేషన్ యార్డులో రూట్ నంబర్ 9లో సుమారు 30 -35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్పీఎఫ్ ఎస్ఐ బాలాజీ రావు తెలిపారు. పింక్ కలర్ రెడీమేడ్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బిస్కెట్ కలర్ ఫ్యాంట్, కుడి మోచేతి పైన “SINVREN “అని పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. ఇతడి ఆచూకీ తెలిసినవారు స్థానిక స్టేషన్లో సంప్రదించాలన్నారు.

News November 15, 2024

తగరపువలస గోస్తనీ నదిలో కారు బోల్తా.. డ్రైవర్ మృతి

image

తగరపువలస గోస్తని నదిలో కారు బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. వంతెన‌పై అంధకారం నెలకొనడంతో గురువారం రాత్రి కారు అదుపుతప్పి నదిలో బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో స్థానికులతో పాటు పోలీసులు సహాయకు చర్యలు చేపట్టారు. మృతుడు భోగాపురం ఎయిర్పోర్ట్‌ నిర్మాణ సిబ్బందికి చెందిన డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. మరి కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

News November 15, 2024

విజయనగరంలో టుడే టాప్ న్యూస్

image

>స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రద్దు > విజయనగరంలో గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం > బాల్యవివాహాలు చేస్తే సమాచారం ఇవ్వాలన్న ఎస్పీ వకుల్ జిందాల్ > నటుడు పోసానిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు > బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలు గ్రీన్ ఛానల్ ద్వారా తరలింపు > ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవం>కొండగుంపాంలో ఇంటి పైనుంచి జారిపడి మహిళ మృతి > పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం

News November 14, 2024

VZM: స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌‌ల నియామకం 

image

జిల్లా జ్యుడీషియల్ పరిధిలో సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. బార్‌లో నాన్ ప్రాక్టీసింగ్ న్యాయవాదులుగా ఉంటూ 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. వారంలో ఐదు రోజులపాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.

News November 14, 2024

MLC ఎన్నిక ప్రక్రియ రద్దుపై కలెక్టర్ ప్రకటన

image

ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ ర‌ద్దు చేసిన‌ట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉప ఎన్నిక‌కు ఈ నెల 4వ తేదీన నోటిఫికేష‌న్ వెలువ‌డింద‌ని వెల్లడించారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ర‌ఘురాజు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేష‌న్ ర‌ద్దు చేస్తూ ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని తెలిపారు.