Vizianagaram

News May 12, 2024

విజయనగరం: ఎలక్షన్@2024.. మూడు జిల్లాల ముచ్చట

image

విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉండగా.. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు విజయనగరం ఎంపీ స్థానానికి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అటు అల్లూరి జిల్లాలో ఉన్న అరకు ఎంపీ అభ్యర్థికి పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గ ఓటర్లు తమ ఓటును వేస్తారు.

News May 12, 2024

ఓటర్లకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి విజ్ఞప్తి

image

ఇన్ ఎడిబుల్ ఇంక్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. ఈ ఇంక్ ఎవరూ కొనుగోలు చేసేందుకు, సేకరించేందుకు అందుబాటులో లభించదని స్పష్టం చేశారు. దేశంలో కేవలం ఒక చోట మాత్రమే దీని ఉత్పత్తి జరుగుతోందని, ఎన్నికల కమిషన్ మినహా ఇతరులు ఎవరూ దీనిని పొందే అవకాశం లేదన్నారు. అపోహలకు గురికాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

News May 12, 2024

విజయనగరం: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా 2019లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. కురుపాం-77.7%, పార్వతీపురం- 76.9%, సాలూరు- 79.4%, బొబ్బిలి- 78.9%,చీపురుపల్లి- 83.3%,గజపతినగరం- 86.9%, నెల్లిమర్ల- 87.9%, విజయనగరం- 70.8%, శృంగవరపుకోట- 86.1 శాతం నమోదైంది. మరి ఈ సంవత్సరం ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మీ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా.

News May 12, 2024

విజయనగరం ఎంపీ అభ్యర్థికి ప్రధాని మోదీ లేఖ

image

విజయనగరం ఎంపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుని విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ లేఖను కలిశెట్టి విడుదల చేశారు. జర్నలిస్టుగా విజయనగరం అభివృద్ధి, సమస్యలపై లోతైనా అవగాహన ఉండటం, క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయమని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.

News May 12, 2024

6,100 మందిపై బైండోవర్ కేసులు: మన్యం ఎస్పీ

image

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. 1150 మంది సిబ్బంది,6 కంపెనీల కేంద్ర బలగాలను, 56 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు,138 మంది సెక్టార్ అధికారులను నియమించామన్నారు. చెప్పారు. 6,100 మందిపై బైండోవర్ నమోదు చేశామన్న ఆయన..అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు జిల్లా విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు.

News May 12, 2024

VZM: ఓటేసుందుకు వస్తుండగా మృతి..!

image

సీతానగరం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గవర ముసలినాయుడు (సాయి)(24) భూపాలపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రామగుండంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సాయి..శనివారం తన స్నేహితులను దిగబెట్టడానికి వరంగల్‌ బస్టాండ్‌కు బైక్‌పై వెళ్లాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారిని టిప్పర్‌ ఢీకొట్టింది. సాయితో పాటు అతని స్నేహితుడు కూడా మరణించాడు. వీరు ఓటేసేందుకు వస్తున్నట్లు సమాచారం.

News May 12, 2024

మూడవ రాండమైజేషన్ పూర్తి: మన్యం జిల్లా కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బందికి మూడవ రాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్ మెహర్డ సమక్షంలో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ అనంతరం సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సీల్డు కవర్‌లో పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

News May 11, 2024

VZM: ర్యాండ‌మైజేష‌న్ ద్వారా ఎన్నికల సిబ్బంది కేటాయింపు

image

ర్యాండ‌మైజేష‌న్ ద్వారా పోలింగ్ కేంద్రాల‌కు ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. జిల్లా ఎన్నిక‌ల సాధార‌ణ‌ ప‌రిశీల‌కులు హ‌నీష్ చాబ్రా, త‌లాత్ ప‌ర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, సీతారామ్ జాట్ స‌మ‌క్షంలో జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి క‌లెక్ట‌రేట్ ఎన్ఐసీ కేంద్రంలో శనివారం ఈ ప్ర‌క్రియ నిర్వ‌హించారు.

News May 11, 2024

VZM: మీ నియోజకవర్గంలో విజయం ఎవరిది?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగిసింది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సి ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News May 11, 2024

విజయనగరం: రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్

image

ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కేంద్రాలు మూసివేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎన్వీ రమణ తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మూతపడతాయన్నారు. అనధికార మద్యం విక్రయాలు చేసినా.. నిల్వలు చేసినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.