Vizianagaram

News November 12, 2024

10 వేల ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం:DGP

image

ఇటీవల కాలంలో పది వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసి 3వేల మందిని అరెస్టు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వెల్లడించారు. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో సంకల్పం కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గంజాయి పండించే రైతుల జీవనోపాధికి పెద్ద పీట వేస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిణీ చేస్తున్నామన్నారు.

News November 12, 2024

విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు నామినేషన్లు వ్యాలీడ్..!  

image

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ పత్రాల స్క్రూటినీ రిటర్నింగ్ అధికారి సేతు మాధవన్, ఎన్నికల పరిశీలకులు ఎం.ఎం.నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఆయన ఛాంబర్‌లో జరిగింది. స్క్రూటినీ అనంతరం ముగ్గురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎటువంటి అభ్యంతరాలు లేనందున వ్యాలీడ్‌గా జేసీ ప్రకటించారు. అభ్యర్థుల వివరాలను నోటీస్ బోర్డ్‌లో పెడతామని JC తెలిపారు.

News November 12, 2024

విజయనగరం డీవీఈవోకి సీఎం చేతుల మీదుగా అవార్డు

image

విజయనగరం జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న భీమ శంకర్రావుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. సోమవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ప్రిన్సిపల్ క్యాడర్లో ఈ అవార్డు పొందినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. అవార్డు పొందిన డీవీఈవోను పలువురు ప్రిన్సిపల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు అభినందించారు.

News November 12, 2024

విజయనగరం: మూడు జిల్లాలకు ఒక్కరే..!

image

వైద్య సేవ జిల్లా సమన్వయకర్త పోస్టు ఖాళీగా ఉండి నెలరోజులు గడుస్తుంది. విజయనగరం,విశాఖపట్నం,పార్వతీపురం జిల్లాలకు అప్పారావు ఒక్కరే సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మూడు జిల్లాల బాధ్యతలు చూడడం అనేది ఏ అధికారికైనా కత్తి మీద సాము వంటిదే.వైద్య సేవ ఆసుపత్రుల పరిశీలన, సేవల తీరుపై ఆరా తీయడం, సకాలంలో వైద్యం అందేలా చూడాలి. జిల్లాకు సమన్వయకర్తను నియమిస్తే సకాలంలో వైద్యసేవలు అందుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

News November 11, 2024

విజయనగరం MLC స్థానానికి మూడు నామినేషన్లు

image

స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక కోసం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్లు దాఖలు గడువు ముగిసింది. మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు JC ఎస్.సేతు మాధవన్ వెల్లడించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎస్.కోట మండలం బొడ్డవరకు చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి, అదే మండలం వసి గ్రామానికి చెందిన కారుకొండ వెంకటరావు, వైసీపీ తరుఫున శంబంగి వెంకట చిన అప్పలనాయుడు నామినేషన్లు వేశారు.

News November 11, 2024

విజయనగరం జిల్లాలో పర్యటించిన ఎన్నికల పరిశీలకులు  

image

శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ సోమవారం జిల్లాలో పర్యటించారు. ఆయనకు జిల్లా కలెక్టర్ అంబేడ్క‌ర్ స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల పరిశీలకులతో సమావేశమై శాసనమండలి ఉప ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలు, ఎం.సి.సి. బృందాలు ఏర్పాటు తదితర అంశాలను తెలిపారు.

News November 11, 2024

వాల్తేర్ డీఆర్ఎంతో విజయనగరం ఎంపీ భేటీ.. చర్చించిన అంశాలివే..!

image

☛ కోమటిపల్లి రైల్వే వ్యాగన్ లోడింగ్ పాయింట్‌‌ను సీతానగరం స్టేషన్‌కు మార్చాలి
☛ బొబ్బిలిలో వందే భారత్‌కు హాల్టింగ్
☛ విజయనగరంలోని రైల్వే అండర్ పాస్ నిర్మాణంపై ఆరా
☛ పార్వతీపురం-గుమడ మధ్య ఫ్లైఓవర్ల నిర్మాణం
☛ కొత్తగా ప్రతిపాదించిన పాలకొండ-రాజాం రైల్వే లైన్ నిర్మాణ ప్రగతిపై ఆరా
☛ చీపురుపల్లి రోడ్డు ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ఎంపీ కోరగా సంక్రాంతి లోపు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.

News November 11, 2024

విజయనగరం ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుధారాణి నామినేషన్

image

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి ఇందుకూరి సుధారాణి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. జేసీ సేతు మాధవన్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. కాగా ప్రస్తుతం ఆమె టీడీపీలో కొనసాగుతున్నారు.

News November 11, 2024

విజయనగరం: ప్రాణం తీసిన చుట్ట..!

image

దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన సారిక సింహాచలం అనే వృద్ధురాలు చుట్ట కాల్చుకునే క్రమంలో చీరకు నిప్పు అంటుకుంది. వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె తమ్ముడు రౌతు సింహాచలం తెలిపారు. ఈ ఘటనపై పెదమానాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

News November 11, 2024

తలసరి ఆదాయంలో వెనుకబడిన విజయనగరం

image

ఏపీలో 26 జిల్లాల విభజన జరిగిన తర్వాత తొలిసారిగా తలసరి ఆదాయం లెక్కలు బహిర్గతమయ్యాయి. 2022-23కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ వివరాల ప్రకారం విజయనగరం జిల్లా చాలా వెనుకబడింది. రూ.1.46 లక్షలతో 23వ స్థానంలో నిలిచింది. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా సైతం రూ.1.41 లక్షలతో 25వ స్థానానికి పరిమితమైంది. మరోవైపు మన పక్కనే ఉన్న విశాఖ జిల్లా రూ.4.83 లక్షలతో టాప్ ప్లేస్‌లో ఉంది.