Vizianagaram

News November 9, 2024

VZM: ‘10వ తేదీలోగా రహదారి మరమ్మతులు ప్రారంభించాలి’

image

గుంతలు లేని రహదారుల నిర్మాణంలో భాగంగా విజయనగరం జిల్లాలో చేపడుతున్న 68 రహదారి మరమ్మతుల పనులన్నిటినీ సోమవారంలోగా ప్రారంభించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో 932 కిలో మీటర్ల రహదారి మరమ్మత్తుల పనులను జనవరి నాటికి పూర్తి చేయవలసి ఉన్నందున వెంటనే పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం R&B అధికారులతో రహదారి మరమ్మత్తుల పనులపై ఆయన ఛాంబర్లో సమీక్షించారు.

News November 9, 2024

VZM: విద్యుత్ భవన్‌లో ఫైర్ సేఫ్టీ పై అవగాహన

image

విజయనగరం జిల్లా స్థానిక దాసన్నపేట విద్యుత్ భవన్‌లో విద్యుత్ అధికారులు, సిబ్బందికి గత మూడు రోజులుగా NPTI బెంగళూరు ఆధ్వర్యంలో భద్రతా విపత్తులు మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఫైర్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలను నివారించే సమయంలో తగు జాగ్రత్తలను వివరించారు.

News November 9, 2024

VZM: ఫోన్ పోయిందా? అయితే ఇలా చేయండి!

image

పోగొట్టుకున్న ఫోన్లను ట్రేస్ చేసేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానాన్ని జిల్లాలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బాధితులు 8977945606 నంబర్‌కి మెసేజ్ చేస్తే గూగుల్ ఫారం వస్తుందని, అందులో వివరాలు పొందుపరిస్తే ఫోన్ ను ట్రేస్ చేసి బాధితులకు అప్పగిస్తామన్నారు. ఫోన్ పోతే ఇకపై సైబర్ సెల్ కార్యాలయానికి రావాల్సిన పనిలేదన్నారు.

News November 8, 2024

VZM: గంజాయితో ఆరుగురు యువకులు అరెస్ట్

image

విజయనగరంలో గంజాయిని చిన్న మొత్తాల్లో విక్రయిస్తున్న ఆరుగురు యువకులను వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు చెందిన యువకులు చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారన్నారు. వారి అవసరాలకు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొని వచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి, విక్రయిస్తున్నట్లు గుర్తించి దాడులు చేయగా 2 కిలోల గంజాయి లభించిందన్నారు.

News November 8, 2024

VZM: బాధితులకు 300 ఫోన్లు అప్పగింత

image

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న ఫోన్లను పోలీసులు ట్రేస్ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా బాధితులకు 300 ఫోన్లను తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న ఫోన్లను తక్కువ వ్యవధిలోనే తిరిగి తమకు అప్పగించిన సైబర్ సెల్ పోలీసులకు, ఎస్పీకు బాధితులు కృతజ్ఞతలు తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్య లత పాల్గొన్నారు.

News November 8, 2024

‘విజయనగరం ఎమ్మెల్సీ స్థానానికి పోటీ’

image

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా డా.రంగుముద్రి శివ నరేంద్ర నాయుడు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన ఈయన గతంలో వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. వైసీపీ ఓటమి అనంతరం ఆయన పదవికి రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి సంబంధించి ఈనెల 11న నామినేషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు.

News November 8, 2024

గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో కోమటిపల్లి వ్యక్తి మృతి

image

గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో బొబ్బిలి సమీపంలోని కోమటిపల్లికి చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముత్యాల లక్ష్మణరావు (54) కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ట్రైన్ బాత్రూంలో మృతి చెందాడు. తోటి ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

News November 8, 2024

బడి బయట 10వేల మంది: కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో బడిబయట ఉన్న పిల్లలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో విద్యార్థి వారీగా నివేదిక రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ విద్యాశాఖ అధికారుల‌ను ఆదేశించారు. విద్యాశాఖాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న విద్యార్థుల సంఖ్య దృష్ట్యా సుమారు ప‌దివేల మంది బడి బయట ఉండవచ్చని డీఈఓ తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వారిపై అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశించారు.

News November 7, 2024

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

విజయనగరానికి చెందిన కుమిలి సురేశ్‌కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు SP వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో స్థానిక మహిళా పోలీసు స్టేషన్లో 2021లో పోక్సో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టగా నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు వెల్లడైందన్నారు.

News November 7, 2024

VZM: టూరిజం హోటల్స్ ఏర్పాటుపై IHCL బృందం పరిశీలన

image

విజయనగరం జిల్లాలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా సంస్థకు చెందిన IHCL ఆసక్తి కనబరుస్తోంది. ఈ సంస్థ ప్రతినిధుల బృందం జిల్లాలో గురువారం పర్యటించి పలు ప్రాంతాల్లో పర్యాటక హోటల్స్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసింది. అనంతరం కలెక్టర్ అంబేడ్కర్‌ను  కలెక్టరేట్లో కలిసి జిల్లాలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు.