India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్కు కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం రిటర్నింగ్ అధికారి వద్ద శంబంగి ప్రమాణం చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.
విజయనగరం స్థానిక సంస్థల MLC స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇందుకూరి రఘురాజుకు అనుకూలంగా హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎన్నికలకు సంబంధించి ఈసీ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. దీంతో విజయనగరం కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకారణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే వైసీపీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడును బరిలో ఉండగా.. కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
విజయవాడలోని సీఎం చంద్రబాబు నాయుడును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై సీఎంతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. సీఎంను కలిసిన వారిలో విజయనగరం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు ఉన్నారు.
విజయవాడ-విశాఖ మధ్య ప్రారంభించిన ‘జన్ సాధారణ్'(అన్నీ జనరల్) రైళ్లకు విశేష ఆదరణ లభిస్తుండగా..విజయనగరం మీదుగా వెళ్తున్న వందేభారత్కు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. BBL, PVP, VZM, గజపతినగరం, చీపురుపల్లి నుంచి వలస కార్మికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. సరిపడా రైళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వందేభారత్కు బదులు జన్ సాధారణ్ రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు దేనికి ఓటేస్తారు?
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల MLCగా ఇందుకూరి రఘురాజు కొనసాగవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన 2027 నవంబర్(మరో మూడేళ్లు) ఆ పదవిలో ఉండనున్నారు. 2021లో ఎన్నిక జరగగా.. స్థానిక సంస్థల్లో సరైన సంఖ్యాబలం లేకపోవడంతో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. దీంతో ఇందుకూరి వైసీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఇందుకూరి భార్యతో పాటు ఆయన అనుచరులు టీడీపీలో చేరారు.
విజయనగరం జిల్లా వైద్య సేవా సిబ్బందితో జిల్లా సమన్వయకర్త అప్పారావు బుధవారం నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సేవా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. రోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్, టీమ్ లీడర్లు, వైద్య సేవా సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వివిధ కోర్టుల్లో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ – సెకండ్ క్లాస్ పోస్టుల్లో నియామకం కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసినట్టు జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణ చక్రవర్తి వెల్లడించారు. బొబ్బిలి, కొత్తవలస, పార్వతీపురం, సాలూరులో ఈ పోస్టుల నియామకం కోసం రెండు నోటిఫికేషన్లు విడుదల చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు అదేశాల మేరకు ఈ నోటిఫికేషన్ రద్దు చేసినట్లు తెలిపారు.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేరును YCP అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 1955లో బొబ్బిలి మండలం పక్కిలో జన్మించిన ఆయన 1983,85,94లో TDP ఎమ్మెల్యేగా, 2019లో YCP ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే ప్రొటెం స్పీకర్, ప్రభుత్వ విప్ పదవులు కూడా నిర్వహించారు. ప్రధానంగా కొప్పలవెలమ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఆయనకు పేరుంది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ నేతలు బుధవారం భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో.. అభ్యర్థి ఎంపికపై ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ నేతలు, పలువురు ఆశావాహులు తాడేపల్లికి పయనమయ్యారు. వైసీపీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిజన ఆశ్రమ పాఠశాల ఒప్పంద ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు మంగళవారం సాలూరులో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం విడుదల చేసే డీఎస్సీలో తమ పోస్టులు మినహాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.