India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జామి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. మండల వ్యాప్తంగా 27 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వీటిలో 13 పంచాయతీలు శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోనూ, మిగిలిన మరో 14 పంచాయతీలు గజపతినగరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. దశాబ్దాల కాలం నుంచి ఈ మండలానికి శృంగవరపుకోట, గజపతినగరం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తూ వస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు జిల్లాకు వస్తున్నారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో మంగళవారం మధ్యాహ్నం జరిగే యువగళం సభకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున యువత, నిరుద్యోగులను ఆహ్వానిస్తున్నారు. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లలో లోకేష్ ముఖా ముఖీ మాట్లాడతారు. తొలుత వైసీపీ పాలనలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రసంగిస్తారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 9న ఎన్నికల ప్రచారానికి కురుపాం రానున్నారు. 9వ తేదీ ఉదయం 11 గంటలకు కురుపాం మండల కేంద్రం సమీపంలోని జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన కోర్ కమిటీ సోమవారం సాయంత్రం రాష్ట్ర పార్టీ కార్యదర్శి వీరేశ్ దేవ్ ఇంటి వద్ద సమావేశమయ్యారు.
ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి రెండు రోజులు సమయం పెంచినట్లు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. పార్వతీపురం ఎస్వీడీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఏడు, ఎనిమిది తేదీలలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని సూచించారు.
విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో 2020 నమోదైన పోక్సో కేసులో నిండుతుడికి 20 సం కఠిన కారాగార శిక్ష, 2,500 జరిమానా విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిందని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ద్వారపూడి గ్రామానికి చెందిన నిందితుడు కళ్లేపల్లి అప్పారావు (61) 5సం. మైనర్ బాలికపై లైంగిక నేరానికి పాల్పడినట్లుగా బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. నిండుతుడిని కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో తీర్పు ఇచ్చిందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9న టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాల్గొనున్న ప్రజాగళం బహిరంగ సభను విజయవంత చేయాలని ఆ
పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున పిలుపునిచ్చారు. చీపురుపల్లిలోని విజయనగరం, పాలకొండ ప్రధాన రహదారిలో మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని సాలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర అన్నారు. సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్రెడ్టిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి థింసా నాట్యం చేశారు.
ఏ గ్రామానికైనా ఒకటే మండల కేంద్రం ఉంటుంది. కానీ కురుపాం నియోజకర్గంలోని మార్కొండపుట్టికి 2 మండల కేంద్రాలున్నాయి. గరుగుబిల్లి మండలంలో ఉన్న మార్కొండపుట్టి.. తోటపల్లి డ్యాంలో ముంపునకు గురవ్వడంతో వారికి కొమరాడ మండల పరిధిలో నిర్వాసితకాలనీ ఏర్పాటు చేశారు. దీంతో భూసమస్యలకు గరుగుబిల్లి.. కుల, ఆదాయ ఇతర పనులకు కొమరాడ మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరి ఈ సమస్యను పాలకులు పట్టించుకుంటారో లేదో చూడాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు పెడతామని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. ఈ మేరకు గాజువాకలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ హామి ఇచ్చారు. అలాగే ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలుపుతామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ వేరే జిల్లాలలో ఓటరుగా నమోదు అయి ఉన్న 6,812 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును ఆదివారం వినియోగించుకున్నారు.
➠విజయనగరం: 1356
➠చీపురుపల్లి: 385
➠గజపతినగరం: 603
➠నెల్లిమర్ల: 587
➠బొబ్బిలి: 749
➠ఎస్.కోట: 563
➠పార్వతీపురం: 1098
➠కురుపాం: 925
➠సాలూరు: 546
Sorry, no posts matched your criteria.