Vizianagaram

News November 4, 2024

విజయనగరం జిల్లాలో క్యాంపు రాజకీయాలు.?

image

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో క్యాంపు రాజకీయాలు తప్పనిసరి అంటూ వైసీపీ అధిష్ఠానం భావిస్తోన్నట్లు సమాచారం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక లాగే పోలింగ్ రోజు వరకు స్థానిక సంస్థల ఓటర్లను వివిధ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

News November 4, 2024

దీపావళితో రాష్ట్రంలో వెలుగులు నిండాయి: మంత్రి

image

అల్లూరి జిల్లాలో లక్షా యాభై వేల మంది లబ్ధిదారులకు దీపం పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పాడేరు మండలం, బంగారుమెట్ట గ్రామంలో దీపం-2.0 కార్యక్రమంలో మంత్రి పాల్గొని, లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దీపావళితో రాష్ట్రంలో వెలుగులు నిండాయని అన్నారు.

News November 4, 2024

VZM: సంఖ్యాబలంలో వైసీపీనే టాప్..!

image

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. వైసీపీ పోటీలో నిలవడం దాదాపు ఖాయం కాగా కూటమి నుంచి ఇంకా ఎటువంటి సంకేతాలు రాలేదు. సంఖ్యాబలంలో టీడీపీ కంటే వైసీపీనే టాప్ ప్లేస్‌లో ఉంది. కూటమికి 169 మంది సభ్యుల బలం ఉండగా, వైసీపీకి 548 మంది సభ్యుల బలం ఉంది. ఇండిపెండెంట్లు మరో 14 మంది ఉన్నారు.

News November 4, 2024

VZM: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో?

image

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అభ్యర్థుల ఖరారుపై ఇరు ప్రధాన పార్టీలు గోప్యత పాటిస్తున్నాయి. ఈ స్థానానికి పూర్తిస్థాయిలో వైసీపీకి మెజార్టీ ఉండడంతో.. అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఇప్పటికే సూర్యనారాయణ రాజు కొనసాగుతున్న నేపథ్యంలో పార్వతీపురం జిల్లాకు వెళ్లే ఛాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 4, 2024

VZM: నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ

image

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం నుంచి విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 11:00 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

News November 4, 2024

‘పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి’

image

పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రెండవ రోజు దీక్షలను కొనసాగించారు. ఈ ప్రభుత్వం విద్యా రంగ సమస్యలపై దృష్టి సారించి తక్షణమే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేసి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

News November 3, 2024

విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి మృతిపై మంత్రి దిగ్బ్రాంతి

image

విజయనగరం బీసీ హాస్టల్ విద్యార్థి మృతిపై మంత్రి సవిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఏడో తరగతి చదువుతున్న కొణతాల శ్యామలరావు బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాత కళ్లు తిరుగుతున్నాయని తోటి విద్యార్థులకు తెలిపి అపస్మారకస్థితిలోకి వెళ్లి ఆకస్మికంగా మృతి చెందాడు. శ్యామలరావు మృతికి కారణాలు తెలపాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధితుని కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

News November 3, 2024

విజయనగరం: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

image

స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో విజయనగరం పరిధిలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ముసుగులు తొడిగారు. కమిషనర్ పి.నల్లనయ్య ఆదేశాలతో ప్రణాళిక అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగినట్లు కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు.

News November 3, 2024

VZM: అభ్యర్థుల ఎంపికపై రకరకాల ఊహాగానాలు

image

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనేదానిపై జిల్లాలో ప్రస్తుతం చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున గొంప కృష్ణ, కిమిడి నాగార్జున పేర్లు వినిపిస్తుండగా.. వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాస్, బెల్లాన చంద్రశేఖర్ పేర్లు వినిపిస్తున్నాయి.

News November 3, 2024

విజయనగరంలో ప్రజా ప్రతినిధుల సంఖ్య ఇలా..

image

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీ గుర్తులతో గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో MPTC 549, ZPTC 34, కార్పొరేటర్లు 50, కౌన్సిలర్లు 110, MLA 9, MLC ఒకరు చొప్పున మొత్తం 753 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కాగా వీటిలో మొత్తం 22 ఖాళీలు ఏర్పడ్డాయి. మెజారిటీ సభ్యులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు.