Vizianagaram

News May 3, 2024

విజయనగరంలో నారా లోకేశ్ పర్యటన ఖరారు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల6న నారా లోకేశ్ విజయనగరం రానున్నారు. ఆరోజు జరిగే యువగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని టీడీపీ నాయకులు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు నగరానికి చేరుకొని సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు. ఇక్కడ సభ అనంతరం శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఇప్పటికే ఈనియోజకవర్గంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ ప్రచారం చేశారు.

News May 3, 2024

ఏనుగుల బెడద తప్పిస్తాం: నితిన్ గడ్కరీ

image

కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్వతీపురంలో గురువారం పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి కొత్తపల్లి గీతతో కలిసి చినబొండపల్లిలో జరిగన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మన్యం జిల్లాలో ఏనుగుల బెడద తప్పిస్తామని హామీ ఇచ్చారు. అరకు పార్లమెంట్‌ పరిధిలో రోడ్లు, నీళ్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్ మొదలగు వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

News May 3, 2024

విజయనగరం కేంద్రంగా నకిలీ నగదు, బంగారం ముఠా..!

image

నకిలీ డబ్బు, బంగారంతో మోసగిస్తున్న ముఠాను మధురవాడ పోలీసులు రెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితుల్లో హేమచంద్రరావు, హరి శ్రీను, హేమంత్ కుమార్, ఎం.సుబ్బారెడ్డి, డి.శ్రీనివాస్, జన్న సునీల్ ఉన్నారు. వారి వద్ద నుంచి నకిలీ రూ.500 నోట్లు, బంగారం బిస్కెట్లు, నాణేలు, 23 చరవాణులు, ల్యాప్ టాప్, రూ.1000, వివిధ మారణాయుధాలు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయనగరం నుంచి విశాఖ వెళ్తుండగా పట్టుబడ్డారు.

News May 3, 2024

సూక్ష్మ పరిశీలకుల శిక్షణ ర్యాండమైజేషన్ పూర్తి: మన్యం కలెక్టర్

image

సాధారణ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు నియమించిన సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) శిక్షణ ర్యాండమైజేషన్ గురువారం పూర్తి చేసారు. కలెక్టరేట్‌లో పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహార్థ సమక్షంలో, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూక్ష్మ పరిశీలకుల శిక్షణ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.

News May 2, 2024

విజయనగరంలో బాలకృష్ణ రోడ్‌షో

image

విజయనగరం పట్టణంలో కొత్తపేట వాటర్ ట్యాంక్ జంక్షన్ నుంచి గంటస్తంభం కూడలి వరకు నిర్వహించిన రోడ్‌‌ షోలో బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం గంటస్తంభం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ మేనిఫెస్టోను సూపర్ సిక్స్ పధకాలను ప్రజలకు తెలియజేశారు. విజయనగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థి పూసపాటి అధితి గజపతిరాజును పార్లమెంట్ ‌అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలని కోరారు.

News May 2, 2024

ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు: కలెక్టర్ నాగలక్ష్మి

image

విజయనగరం జిల్లాలో ఈనెల 13న జరిగే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌‌ నాగలక్ష్మి ఆదేశించారు. పోలింగ్‌ నిర్వహణకు సంబంధించి పీఓలు, ఏపీఓల రెండో విడత శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం చేపట్టారు.

News May 2, 2024

VZM: రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

గొట్లాం, గరుడబిల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృత దేహాన్ని గురువారం గుర్తించామని రైల్వే పోలీసులు తెలిపారు. ట్రైన్ ఢీకొట్టిందా లేదా ట్రైన్ నుంచి జారిపడి మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం ఆస్పత్రికి తరలించామని జీఆర్పీ హెచ్సీ కృష్ణారావు తెలిపారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు VZM, BBL GRP స్టేషన్‌‌లకి తెలపాలని కోరారు.

News May 2, 2024

నేడు పాలకొండలో పవన్ పర్యటన

image

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం పాలకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజుపేట జంక్షన్ వద్ద హెలికాప్టర్ దిగి, అక్కడి నుంచి తన కాన్వాయ్‌లో ప్రచారం చేస్తూ పాలకొండలోని వడమ సెంటర్ చేరుకుంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

News May 2, 2024

విజయనగరం: ఈనెల 15 నుంచి వేసవి క్రీడా శిబిరాలు

image

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహించాలనుకున్న వేసవి శిక్షణ శిబిరాలను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ శిబిరాలు వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయసు గల బాల, బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News May 2, 2024

నేడు విజయనగరం, చీపురుపల్లిలో బాలకృష్ణ సభ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నందమూరి బాలకృష్ణ నేడు విజయనగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సభ జరగుతుందని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. చీపురుపల్లిలో జరిగే సభ అనంతరం కొత్తపేట నీళ్ల ట్యాంకు, అంబటి సత్రం కూడలి, మూడు లాంతర్ల కూడలి మీదుగా సభస్థలానికి చేరుకుంటారని వెల్లడించారు. ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా నిన్న విశాఖ చేరుకున్నారు.