Vizianagaram

News October 31, 2024

VZM: సీఎం సభావేదిక ఫిక్స్.. 

image

నవంబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో పర్యటించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గంగచోళ్ల పెంట వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పురిటిపెంట వద్ద రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చే పనుల్లో ఆయన స్వయంగా పాల్గొననున్నట్లు వివరాలు వెల్లడించారు.

News October 31, 2024

విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్

image

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈవో, వైస్‌ప్రెసిడెంట్‌ను కోరారు. ఏపీలో ఈ- గవర్నెన్స్, డిజిటల్ విద్యకు సహకరించాలని మీటింగ్‌లో ప్రతిపాదించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి తోడ్పాటుతో పాటు స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి లోకేశ్ కోరినట్లు టీడీపీ ట్వీట్ చేసింది.

News October 31, 2024

సింహాచలం ఆలయంలో నేడు నరకాసుర వధ

image

నరక చతుర్దశి సందర్భంగా గురువారం సింహాచలం ఆలయ ప్రాంగణంలో నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు. నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలోను సింహాద్రి అప్పన్న, శ్రీదేవి, భూదేవి సమేతంగా మరొక వాహనంలోను ఎదురెదురుగా తీసుకువచ్చి నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు. స్వామివారి దర్శనాలు సాయంత్రం 5 గంటల వరకే లభిస్తాయి.

News October 30, 2024

విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు 

image

నవంబర్ 2న సీఎం చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గత ఐదేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను ఆయన జిల్లానుంచి ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఆరోజు ఉదయం 10.30 గంటలకు కొత్తవలస మండలం దెందేరు జంక్షన్ వద్ద పనులకు శ్రీకారం చుడతారు. సుమారు రూ.826 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా గోతులు పూడ్చే పనులను తమ స్వహస్తాలతో ప్రారంభిస్తారు.

News October 30, 2024

నెల్లిమర్ల: EVM గోదాములను పరిశీలించిన కలెక్టర్

image

నెల్లిమర్లలోని EVM గోదాముల‌ను క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ బుధవారం త‌నిఖీ చేశారు. గోదాముల‌కు వేసిన సీళ్ల‌ను ప‌రిశీలించిన ఆయన EVMల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ త‌నిఖీల్లో డీఆర్వో ఎస్.శ్రీనివాస మూర్తి, ఆర్డీవో డీ.కీర్తి, కలెక్టరేట్ ఎన్నిక‌ల విభాగం సూప‌రింటెండెంట్ భాస్క‌ర్రావు, నెల్లిమ‌ర్ల ఎమ్మార్వో సుద‌ర్శ‌న్‌, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 30, 2024

VZM: జిల్లాలో మహిళలపై ఆగని అఘాయిత్యాలు

image

విజయనగరం జిల్లాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు బాలికలపై అత్యాచారం ఘటనలో 11 పోక్సో కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మహిళలపై 4 రేప్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల గంట్యాడ మండలం కొఠారుబిల్లి జంక్షన్‌లో మూడున్నర ఏళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రామభద్రపురం మండలానికి చెందిన 6 నెలల బాలికపై తాత వరసయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటంతో ఆందోళన కలిగిస్తున్నాయి.

News October 30, 2024

సింహాచలం: ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఈవో

image

సింహాచలం దేవస్థానంలో జీడిపప్పు దొంగలించిన ఇద్దరు ఉద్యోగులను ఈవో త్రినాథరావు మంగళవారం సస్పెండ్ చేశారు. ఆలయంలో ప్రసాదాల తయారీ విభాగంలో లడ్డూలో కలపాల్సిన జీడిపప్పును జూనియర్ అసిస్టెంట్ సూర్యనారాయణ, పిండి బిల్లు అసిస్టెంట్ కాశి పైడిరాజు దొంగలించారు. దీనిపై విచారణ నిర్వహించిన ఈవో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 30, 2024

దీపావళికి ఏపీలో అసలైన దీప కాంతులు: మంత్రి

image

ఉచిత గ్యాస్ సిలెండర్లకు బుకింగ్స్ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ దీపావళి నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి, ఏపీలో సూపర్ సిక్స్ హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. దీపావళి నాడు ఆంధ్ర రాష్ట్రంలోని ఇళ్లలో అసలైన దీప కాంతులను కూటమి ప్రభుత్వం నింపబోతుందని చెప్పారు.

News October 29, 2024

నెల్లిమర్లలో టీచర్‌పై పోక్సో కేసు నమోదు

image

నెల్లిమర్ల పోలీసు స్టేషన్లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదైంది. అదే మండలంలోని కొండవెలగాడ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికపై బయాలజీ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గణేశ్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

News October 29, 2024

అత్యాచార ఘటనలో అన్ని ఆధారాలు సేకరించాం: VZM SP

image

గంట్యాడ మండలంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ధర్యాప్తు పూర్తయ్యిందని SP వకుల్ జిందల్ ప్రకటించారు. నిందితుడికి శిక్ష పడే విధంగా అన్ని సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలు సేకరించామని తెలిపారు. బాలికకు అన్ని వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కేసును ప్రత్యేక పోక్సో న్యాయస్థానం ద్వారా వేగంగా ప్రాసిక్యూషన్ పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.