India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంట్యాడ మండలంలో మూడున్నర సంవత్సరాల బాలికపై జరిగిన లైంగిక దాడిలో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే విజయనగరం మహిళా PSలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్టీఆర్ వైద్య సేవా (ఆరోగ్యశ్రీ) పథకంలో పనిచేస్తున్న సిబ్బంది నేటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విధితమే.వైద్యసేవ సిబ్బంది యూనియన్ నాయకులతో నిన్న సాయంత్రం జరిగిన చర్చల్లో సిబ్బంది న్యాయపరమైన డిమాండ్లు తీర్చడానికి కొంత సమయం ప్రభుత్వం కోరడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా ప్రెసిడెంట్ జెర్రిపోతుల ప్రదీప్ తెలిపారు. నేటి నుంచి యధావిధిగా రోగులకు సేవలందిస్తారని తెలిపారు.
నేటి నుంచి మూడు రోజులు పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం సంబంధిత ఏజెన్సీల వద్ద బుక్ చేసుకోవచ్చని JC సేతు మాధవన్ సూచించారు. ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఇప్పటికే లబ్ధిదారుల సమాచారం ఉందన్నారు. బుకింగ్ అనంతరం ఇంటికి సిలిండర్ వచ్చిన తర్వాత డబ్బులు చెల్లించాలని, తిరిగి 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో సొమ్ము జమవుతుందన్నారు. సిలిండర్ పొందేందుకు 5 నెలల పాటు సమయం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
అభం శుభం తెలియని మూడున్నర ఏళ్ల చిన్నారిపై అకృత్యానికి పాల్పడిన దోషిని కఠినంగా శిక్షించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. నేరాన్ని వీలైనంత త్వరగా విచారించి, నిందితుడికి కఠిన శిక్ష పడేటట్టు చూడాలని ఆయన సూచించారు. గంట్యాడ మండలంలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
గంట్యాడ మండలంలో మూడున్నర సంవత్సరాల మైనరు బాలికపై జరిగిన లైంగిక దాడిలో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే విజయనగరం మహిళా PS లో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గంట్యాడ మండలానికి చెందిన చిన్నారి అత్యాచార ఘటనపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు.బాలికకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. సభ్య సమాజం తలదించుకునే ఘటనకు పాల్పడిన నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గంట్యాడ పోలీసు స్టేషన్ పరిధిలో చిన్నారిపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతి పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి ఘటన వివరాలు తెలుసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్తో మాట్లాడిన మంత్రి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
ఆదివారం రేవు పోలవరం సముద్రంలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. ఉదయాన్నే తుర్ల అర్జునరావు మృతదేహం వెలుగు చూసింది. అరగంట వ్యవధిలోనే సంజీవ్ కుమార్(బబ్లూ) మృతదేహం కూడా బయటపడినట్లు పోలీసులు తెలిపారు. చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉంటారని ఆశించిన తల్లిదండ్రుల కళ్లముందే కుమారులు తనువు చాలించడంతో బోరున విలపించారు.
మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. అనకాపల్లికి చెందిన ఓ కుటుంబం గంట్యాడలో ఓ శుభకార్యానికి వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న చిన్నారిని 30 ఏళ్ల యువకుడు ఆమెను దగ్గర్లోని తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా సీఐ నర్సింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు గల్లంతయినట్లు మెరైన్ ఏఎస్ఐ కృష్ణ తెలిపారు. కోరుప్రోలు గ్రామానికి వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయనగరం నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులు తీరంలో విహారయాత్రకు వెళ్లారు. వారిలో టి.అర్జున్, బి.బబ్లు సముద్రంలో స్నానం చేస్తుండగా గల్లంతయినట్లు పేర్కొన్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.