Vizianagaram

News October 26, 2024

విజయనగరంలో స్కిల్ సెంటర్ ప్రారంభిస్తాం: మంత్రి

image

JNTUలో త్వరలో స్కిల్ సెంటర్ ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విజయనగరంలోని మంత్రి కార్యాలయంలో JNTU ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్ బి.రాజ్యలక్ష్మితో మంత్రి సమావేశమయ్యారు. వీసీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అతి త్వరలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

News October 25, 2024

VZM: ధాన్యం కొనుగోలు మద్దతు ధర ప్రకటన

image

ఖరీఫ్ 2024-25 సీజన్‌లో ధాన్యం కొనుగోలు నవంబర్ 2వ వారం నుంచి ప్రారంభం కానుందని సంబంధిత అధికారులు తెలిపారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై అవగాహన పోస్టర్లను కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ఆవిష్కరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. గ్రేడ్ ఏ రకం క్వింటాకు రూ.2,320, గ్రేడ్ బీ రకం క్వింటాకు రూ.2,300 ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.

News October 25, 2024

జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

image

విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ప్రధాన శాఖలపై సమీక్ష నిర్వహించారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలును సకాలంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఇరువురు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.

News October 25, 2024

గుర్ల ఘటనకు బాధ్యులెవరు?

image

గుర్ల ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. రోగులకు రెస్ట్ లేకుండా ప్రజాప్రతినిధులు వరుసపెట్టి గుర్ల చేరుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు మళ్లించడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం కొరవడిందని అధికార పక్షం ఆరోపించగా.. ఈ ప్రభుత్వం పల్లెలను పట్టించుకోకపోవడమే మరణాలకు కారణమని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మరి ఈ ఘటనకు బాధ్యులెవరని మీరు భావిస్తున్నారు.. సమస్యకు పరిష్కారం ఏంటో కామెంట్ చెయ్యండి.

News October 25, 2024

బొబ్బిలి వీణల తయారీదారులకు గుడ్ న్యూస్

image

Dy.cm పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బొబ్బిలి వీణల తయారీలో ఉపయోగిస్తున్న పనస మొక్కల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దేశ, విదేశాల్లో ఆదరణ ఉన్న వీణల తయారీలో ముడి సరుకుగా ఉన్న పనస కొరత కారణంగా తయారీదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉపాధి హామీ పథకంలో భాగంగా VZM, పార్వతీపురం మన్యం, SKLM జిల్లాల్లో పనస మొక్కల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

News October 25, 2024

VZM: జడ్పీలో నేడు సర్వ సభ్య సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ

image

జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా గుర్ల లో డయేరియా మరణాలు, వివిధ గ్రామాల్లో విజృంభిస్తున్న అంటువ్యాధులపై ప్రధానంగా చర్చ సాగనుంది. ఈ సమావేశానికి ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.

News October 25, 2024

రామభద్రపురం: హార్ట్ఎటాక్‌తో ఉపాద్యాయుడు మృతి

image

రావివలస ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు పిసిని.వెంకటప్పడు (57) హార్ట్ ఎటాక్‌తో పాఠశాల పరిసర ప్రాంతంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన వాడని, విధుల నిమిత్తం ఇక్కడ పనిచేస్తున్నారన్నారు. గురువారం విధుల్లో ఉంటూ బయటకు వచ్చారని అక్కడే తీవ్ర గుండె నొప్పితో కుప్పకూలి మృతి చెందారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు.

News October 24, 2024

విజయనగరంలో TODAY TOP న్యూస్

image

>గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు పరామర్శించిన జగన్ > డయేరియాపై అధికారులతో హోంమత్రి అనిత సమీక్ష >వైరల్ అవుతున్న జడ్పీ ఛైర్మన్ ఫ్లెక్సీ > విజయనగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం >విజయనగరం డీఆర్వో గా శ్రీనివాసమూర్తి >పోలీసులపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం >భద్రత విషయంలో జగన్‌పై హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు

News October 24, 2024

ఉమ్మడి జిల్లాకు రానున్న నూతన DROలు

image

రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్‌ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లాకు DROగా ఎస్.శ్రీనివాస మూర్తిని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు ఇక్కడ DROగా విధులు నిర్వహించిన S.D.అనితను అమరావతిలోని సెక్రటేరియేట్‌‌కు రిపోర్ట్ చేయాలన్నారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాకు నూతన DROగా A.రవీంద్ర రావును నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News October 24, 2024

జగన్ పర్యటన బందోబస్త్‌పై హోంమంత్రి రియాక్షన్

image

YS.జగన్ గుర్ల పర్యటనలో బందోబస్త్‌ విషయమై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఇప్పుడు నొప్పి తెలుస్తోందా.. రామతీర్థాలకు వచ్చిన చంద్రబాబు రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఆ నొప్పి తెలీలేదా జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తాము ప్రొటోకాల్ ఇస్తున్నాం.. నువ్వొస్తున్నావని పరదాలు కట్టేసి, చెట్లు కొట్టేయాలా ఇప్పుడు ఒక MLAవి దానికి తగ్గ సెక్యురిటీనే ఉంటుంది అన్నారు.